Khammam

News April 26, 2024

KMMకు 45 మంది, మహబూబాబాద్‌కు 30

image

ఎంపీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి 45 మంది 72 సెట్లు, మహబూబాబాద్‌ స్థానానికి 30 మంది 56 సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ప్రధాన పార్టీల నుంచి KMMలో రఘురాంరెడ్డి(కాంగ్రెస్‌), నామా నాగేశ్వరరావు(BRS), తాండ్ర వినోద్‌రావు(BJP), MHBDకు బలరాంనాయక్‌(కాంగ్రెస్‌), కవిత(BRS), సీతారాంనాయక్‌(BJP) నామపత్రాలు సమర్పించారు.

News April 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} దమ్మపేటలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 26, 2024

గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ గురువారం రిలీజ్ అయింది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 గడువు కాగా పోలింగ్ మే 27న జరగనుంది. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

News April 25, 2024

‘బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం నష్టానికి గురైంది’

image

పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ నాయకుల అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

News April 25, 2024

KMM: ఏజెన్సీ ప్రాంతంలో 88 మంది అరెస్ట్

image

ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి 115 కేసుల్లో 88 మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, Y.రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మం.ల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News April 25, 2024

‘పోలీసులు విధినిర్వహణలో బాధ్యతగా ఉండాలి’

image

పోలీసులు విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, బాధ్యతాయుతమైన విధులు చాలా కీలకమని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని కాపాడటం, నేర కార్యకలాపాలు కట్టడి చేయడం వంటి కీలకమైన భాధ్యతలు నిర్వహించాల్సిన ట్రైన్ కానిస్టేబుళ్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

News April 25, 2024

ఖమ్మంలో కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తాన్

image

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ముందడుగు వేశాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన భారీ ర్యాలీలో ఆయా పార్టీల శ్రేణులు భాగస్వాములయ్యాయి.

News April 25, 2024

ఎన్నికలపై ఎస్పీ సమీక్ష

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకూడదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి భాదితులకు న్యాయం చేకూర్చాలన్నారు.

News April 25, 2024

ఖమ్మంలో రెండు కోట్ల రూపాయలకు ఐపీ

image

ఖమ్మంలోని పాక బండ బజార్‌కు చెందిన రవీంద్రనాథ్ సింగ్ మొత్తం 32 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ రెండు కోట్ల రూపాయలకు స్థానిక కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. దివాలాదారుడు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో పెట్టుబడుల కోసం స్నేహితులు, బంధువుల వద్ద రూ.2,18, 10, 000 అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశాడు.

News April 25, 2024

‘ఎన్నికల ఉల్లంఘన పై ఫిర్యాదు చేయోచ్చు’

image

లోక్ సభ సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లైతే తనకు తెలియజేయాలని సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డా.సంజయ్ గేండ్రాజ్ తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలు, ఫిర్యాదులు ఉంటే స్వయంగా స్వీకరించడానికి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్‌లో (NSP) అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఫోన్ నంబర్ 93462 93006 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

error: Content is protected !!