Khammam

News June 10, 2024

ఖమ్మంలో దొంగలు హల్‌చల్

image

ఖమ్మం జిల్లాలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు గట్టినిఘా పెట్టినా వారి కళ్లు గప్పి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం కొత్తబస్టాండ్‌లో చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.6 లక్షల విలువైన బంగారు అభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News June 10, 2024

ఇల్లందు: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

క్రికెట్ ఆడుతూ గుండెనొప్పికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లెందులో ఆదివారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలో 2బస్తీకి చెందిన బొల్లి కిరణ్ (27) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాగా ఆయాసం వచ్చింది. వెంటనే తోటి స్నేహితులు స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. కిరణ్‌ను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం రిఫర్‌ చేశారు. ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు.

News June 10, 2024

ఖమ్మం : గ్రూప్-1 పరీక్షకు 20,504మంది హాజరు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పరీక్షకు 20,504 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 2,226మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష ఉ. 10.30 నుంచి ఒంటిగంట వరకు కొనసాగింది. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News June 10, 2024

ఐఈడీ మందు పాతరలు నిర్వీర్యం

image

వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 4 ఐఈడీ మందు పాతరలను బీడీ బృందాలు గుర్తించినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశామన్నారు. మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వీటిలో ఇప్పటికే 3 పేలిపోగా .. ఒక మందు పాతరను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.

News June 9, 2024

పైరవీలకు తావు లేదు.. అర్హులకే పెన్షన్: మంత్రి పొంగులేటి

image

ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో పెన్షన్ పొందిన వాటిని రద్దు చేస్తామన్నారు. అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

News June 9, 2024

నాలుగో ప్రయత్నంలో విజయం

image

రెండుసార్లు MLCస్థానానికి, ఒకసారి MLAస్థానానికి పోటీచేసి ఓడిపోయిన మల్లన్న.. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. 2015లో NLG- KMM-WGLఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో HZNR అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడారు. 2021లో NLG- KMM-WGLఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం అదే స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో మల్లన్న విజయం సాధించారు.

News June 9, 2024

మిషన్ భగీరథ నీరు వస్తోందా.. ?!

image

ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల ఇళ్లకు.. భద్రాద్రి జిల్లాలో కూడా దాదాపు అదేసంఖ్యలో ఇళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో చాలా ఇళ్లకు నీరు అందడం లేదని, పైపులైన్లు పగిలిపోయి, వాల్వ్ ల వద్ద లీకేజీలతో నీరు వృథా అవుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యాన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటిని సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News June 9, 2024

KMM: కేయూలో రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

జూన్ 11 నుంచి ప్రారంభం కావాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ PG సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి, అదనపు నియంత్రణ అధికారి డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.