India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సారా వ్యతిరేక ఉద్యమంలో రామోజీరావు పాల్గొన్నారు. 1994 నవంబర్ 4న ఖమ్మం రిక్కాబజార్ పాఠశాలలలో జరిగిన సదస్సుకు ఆయన వావిలాల గోపాల కృష్ణయ్యతో కలిసి హాజరయ్యారు. అప్పటి పీవైఎల్ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నల్లమల వెంకటేశ్వరరావు, డీఐఎఫ్ఐ నాయకుడు విడియం వెంకటేశ్వర్లులతో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యమ విస్తృతిపై దిశానిర్దేశం చేశారు.

TGPSC ఆధ్వర్యంలో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇరు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 21 సెంటర్లలో మొత్తం 8,871 మంది, ఖమ్మం జిల్లాలో 52 సెంటర్లలో 18,403 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉ.9 గంటలకే చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.

తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. చింతపల్లికి చెందిన శివ(25) శనివారం తాటి ఆకుల కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు.

రేపు జరగబోయే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఖమ్మం జిల్లా పరిధిలో హాజరుకాబోయే 18,403 అభ్యర్థులకు రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్లకు రీజినల్ మేనేజర్ వెంకన్న ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలని కోరారు. ఎంక్వయిరీ కోసం 99592 25979, 99592 25965 సంప్రదించగలరు.

గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి జిల్లాలో 481 జీపీలు ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. 3 నెలలుగా లోక్ సభ ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం నిమగ్నమవటంతో పంచాయతీల పాలనపై పర్యవేక్షణ కొరవడింది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్ శనివారంతో ముగియనుంది. ఇకనైనా జీపీ పాలనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

NLG-WGL-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఫస్ట్ టైం గెలుచుకున్నట్లైంది. 2015, 21లో ఈస్థానాన్ని బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలుచుకుంది. ఈ సారి మాత్రం పట్టభద్రులు కాంగ్రెస్కు పట్టం కట్టారు.

సత్తుపల్లికి చెందిన సూక్ష్మకళాకారుడు గుమ్మడిదల గౌరీశంకర్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా 3 సారి రికార్డు పొంది హ్యాట్రిక్ వీరుడయ్యాడు.పెన్సిల్ లెడ్ను ఉపయోగించి ఇదివరకు 617 లింక్లతో ఉన్న గిన్నిస్ రికార్డు అధిగమించాడు. పెన్సిల్ లెడ్తో ఏకంగా 9 అడుగుల పొడవు ఉండేలా 1,125లింకులు చేసి ఆ రికార్డ్ను బద్దలు కొట్టాడు.ఇందుకోసం దాదాపు 6 నెలలపాటు శ్రమించినట్లు గౌరీ శంకర్ తెలిపారు

పట్టభద్రుల MLCగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే స్థానంలో గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు.

కూసుమంచి: ఖమ్మం ఎంపీ ఎన్నికల చరిత్రలో ఏ ఎంపీకీ రాని మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాయకన్ గూడెంలో స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అతి త్వరలోనే అర్హులైన అందరికీ ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని పేర్కొన్నారు.

గ్రూప్ 1 అభ్యర్థులకు ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు బూట్లు, అభరణాలు వేసుకుని రావొద్దని సూచించారు. జిల్లాలో మొత్తం 52 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 18,403 మంది హాజరవుతారన్నారు. నిమిషం ఆలస్యమై పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదన్నారు.
Sorry, no posts matched your criteria.