India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటికి ఈ విషయం మీద స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఖమ్మం లోక్ సభ స్థానం ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈమేరకు సోమవారం ఏడుగురు అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)గా ఉల్లెంగుల యాదయ్య, బహుజన్ లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అంతోని సురేష్ నామినేషన్ సమర్పించారు. మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,700 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.300 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న తన అనుచరులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నేతల ఆహ్వానం తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో రాములు నాయక్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఖమ్మం రాజకీయాలు తనకు స్పష్టంగా తెలుసని.. హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా బరిలో ఉంటానని ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. సోమవారం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. తాను ఖమ్మంలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్ సభకు పోటీ చేయమంటే చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక సమస్యలపై తమ వంతుగా కృషి చేశానని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాలతో తనకు గుర్తింపు లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైరాలో ఆయన సంబంధించిన వర్గీయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని అనేకమంది నాయకులు ప్రజాప్రతినిధులు రాములు నాయక్ మద్దతుగా నిలిచారు.
✓పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓మణుగూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
✓నేలకొండపల్లిలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఐదుగురు స్థానికేతరులు ఎన్నిక కావటం విశేషం. PDFఅభ్యర్థిగా కర్ణాటకకి చెందిన టీబీ విఠల్రావు 1952, 1957, అలంపూర్కు చెందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ 1962, 67, 71, ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన పీవీ రంగయ్యనాయుడు 1991, గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల భాస్కర్రావు 1998, విశాఖపట్నానికి చెందిన రేణుకాచౌదరి 1999, 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి విజయకేతనం ఎగురవేశారు.
వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎన్నికైన అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల విధానంపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 643 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులను మే నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 6 గంటల నుంచే ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా అశ్వాపురం మండలంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా బూర్గంపహాడ్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.