India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజధాని ఏసీ బస్సు చార్జీలతో లహరి బస్సులో ప్రయాణించవచ్చని, బెర్త్కు అదనపు చార్జి ఉంటుందని ఖమ్మం రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు. అలాగే లహరి నాన్ ఏసీ బస్సులో సీటు చార్జీలు సూపర్ లగ్జరీకి సమానంగా ఉంటాయని ప్రకటించారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఖమ్మం, సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల నుంచి మియాపూర్, విశాఖపట్నం, బెంగళూరుకు లహరి బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఖమ్మం లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64/66, బీఆర్ఎస్కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తోందని అంచనా వేశాయి.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రారంభమై, పూర్తయిన తొలి సాగు నీటి ప్రాజెక్టుగా భక్త రామదాసు రికార్డు చరిత్ర లిఖించింది. భద్రాచలం ఐటీడీఏలో ఉన్న మండలాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సమస్య తీరింది. జిల్లాలో 161 పల్లె , 9 బస్తీ దవాఖానాలు, 210 PHCల ద్వారా వైద్యం అందుతోంది. పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతోంది.

ఖమ్మం పార్లమెంట్ స్థానం కాంగ్రెస్దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేశారు. BJP నుంచి తాండ్ర వినోద్ రావు, BRS నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

ఖమ్మం పార్లమెంట్ స్థానం కాంగ్రెస్దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేశారు. BJP నుంచి తాండ్ర వినోద్ రావు, BRS నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో వడదెబ్బతో శనివారం ఒక్కరోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఎండ తీవ్రతకు పోతన బోయిన గురవయ్య (80), పుప్పాల రామయ్య (85) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ కన్నుమూశారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

గ్రామస్థాయి నేతలు పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జూన్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి ఆయా పార్టీల నేతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికలు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఎప్పుడు జరుగుతాయోనని ఆరా తీస్తున్నారు. గతంలో ఉన్న అభ్యర్థులతో పాటు కొత్త వారు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని 1,070 జీపీలలో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల చర్చే ఉంది.

హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్ష విరమణకు భద్రాద్రికి విచ్చేసిన హనుమాన్ భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవి తెలిపారు.

ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను ఆయన అడిగితెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.