India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవనుండగా.. తాజాగా షెడ్యూల్ను మార్చింది. రోజూ ఉ.7 నుంచి ఉ.11 వరకు స్కూల్ టీచర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చదువుకు దూరంగా ఉంటున్న పిల్లల్ని టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.

ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సెక్రటేరియట్లో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ మేరకు నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది రోజులకు పైగా మూతబడి ఉన్న
థియేటర్లు శుక్రవారం తెరుచుకోనున్నాయి. ఈనెల 17 నుంచి సినిమా హాళ్లను మూసి ఉంచుతున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి మూతబడిన హాళ్లను తిరిగి తెరవాలని అసోసియేషన్ గురువారం నిర్ణయించడంతో నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని 30 థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు నానో ఎరువు 2, 3 శాతం కూడా వినియోగించడం లేదని తెలుస్తోంది. సాధారణ యూరియా బస్తా వేస్తే 30 శాతం పంటకు అందుతుండగా, నానో యూరియా వినియోగిస్తే 80 శాతం అందుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అరలీటర్ సీసాలో లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానం. రాయితీ పోను యూరియా బస్తా ధర రూ.266 ఉండగా, నానో యూరియా రూ.240కే లభ్యమవుతుంది.

మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఇటీవల కొన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్తో పోలిస్తే మేలో భూగర్భజలాలు పెరిగాయి. బోనకల్ మండలంలో 0.34, ముదిగొండ 0.25, కొణిజర్ల 0.71, సింగరేణి 1.88, కామేపల్లి 0.06, ఎర్రుపాలెం 1.83, రఘునాథపాలెం 0.46, సత్తుపల్లి 1.26, వేంసూరులో 1.11 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. జిల్లాలో సగటున 0.26 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తరపున కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు, స్వామివారికి ఇష్టమైన వడమాల అప్పాల మాలలను భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి గురువారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే స్టేషన్ సమీపంలో కర్లపూడి నాగభూషణం(58) అనే విశ్రాంత ఎస్టీవో ఉద్యోగి గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన స్వస్థలం ఖమ్మం బీకే బజార్. కొంతకాలంగా నాగభూషణం క్యాన్సర్ బాధపడుతున్నాడు. ఆయన ఇటీవల హైదరాబాద్లో ఓ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కీమోథెరపి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రాముడి తరఫున కానుక అందించేందుకు చర్యలు చేపట్టారు. జూన్ 1న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రామబంటు ఆంజనేయుడికి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను అందించేందుకు ఈఓ రమాదేవి కొండగట్టు వెళ్లినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. హనుమాన్ జయంతికి పట్టు వస్త్రాలను అందించడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది.

మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ జరిగి B TECH విద్యార్థి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. కూలి లైన్కు చెందిన గుణదీప్(21) HYDలో B TECH చేస్తున్నాడు. సెలవులకు కొత్తగూడెం రాగా.. ఖమ్మం బస్ స్టాప్ దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఘర్షణలో మరో యువకుడు గుణదీప్ను ఛాతిపై కొట్టడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు పరారిలో ఉన్నాడు.
Sorry, no posts matched your criteria.