Khammam

News May 30, 2024

పాఠశాలల ప్రారంభానికి పనులన్నీ పూర్తి చేయాలి: కలెక్టర్

image

పాఠశాలల పునఃప్రారంభంలోగా పాఠశాలలోని పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఖమ్మం రాపర్తినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బురహాన్ పురం విద్యానగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ఖమ్మం రూరల్ మండలం కొత్తూరు (వై), చిన్న తాండలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు తనీఖీ చేసారు. విద్యార్థులకు అందించే దుస్తులను కూడా పరీశీలించారు.

News May 29, 2024

ఖమ్మం: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. ఖమ్మంలో మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 29, 2024

గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జూన్ 9న జరగనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 8,875 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

News May 29, 2024

బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైపై దాడి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైపై పోలీస్ స్టేషన్‌లోనే దాడి జరిగింది. ఓ ఫిర్యాదుకు సంబంధించి విచారిస్తున్న ఏఎస్సై సత్యంపై నిమ్మల హరీశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. హరీశ్ పరార్ కాగా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడిపై ఏఎస్సై సత్యం బూర్గంపాడు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News May 29, 2024

కౌంటింగ్‌కు సన్నద్దం కావాలి: కలెక్టర్

image

లోక్‌సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీచైతన్య కళాశాలలో కౌంటింగ్ జరగనుంది.

News May 29, 2024

ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ మిస్టరీ

image

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కుమారి, పిల్లలు కృషిక, తనిష్క మృతిచెందారు. అయితే కారు డ్రైవ్ చేస్తున్న కుమారి భర్త బోడా ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. అయితే మృతులపై ఒంటిపై గాయాలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో తల్లి, పిల్లల మృతదేహాలున్నాయి.

News May 29, 2024

KMM: అదేరోజు బాలిక, మంగళవారం యువకుడు మృతి

image

ఇటీవల ఓ మైనర్ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవులుకు ఫోన్ కాల్‌లో ఖమ్మంకు చెందిన సుష్మతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈనెల 24న వరంగల్ 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేయగా.. సుష్మ(17) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన చెన్నకేశవులు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News May 29, 2024

ఖమ్మం: ఉమ్మడి జిల్లాల్లో 100 పోస్టాఫీసుల్లో మాత్రమే ఈ సేవలు

image

ఖమ్మం రీజియన్ పరిధిలో 825 పోస్టాఫీసులు ఉన్నా కేవలం 100 తపాలా కార్యాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు సేవలు అందుతున్నాయి. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఆధార్ నమోదు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఖమ్మం జిల్లాలో 60 మంది, భద్రాద్రి జిల్లాలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అందుకే 100 మాత్రమే ఈ సేవలందిస్తున్నారు.

News May 29, 2024

ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన పి.నాని(19) హైదరాబాద్‌లోని TVS సంస్థలో సర్వీస్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పని నిమిత్తం బైక్‌పై పెద్దపల్లికి వెళ్లి తిరిగి కరీంనగర్‌కు వస్తుండగా ముగ్దుంపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు.

News May 29, 2024

ఖమ్మం: గ్రూప్‌-2, సింగరేణి ఉద్యోగాలంటూ..రూ.4కోట్ల మోసం

image

గ్రూప్-2, సింగరేణి ఉద్యోగాలిప్పిస్తామని రూ.4కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముఠాను చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్‌‌కమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్‌ చుంచుపల్లి మండల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పానని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఈ స్కామ్‌లో హరికిషన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.