India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిత్యం బడికి డుమ్మాకొడుతూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజన బిల్లులు స్వాహా చేసిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. గుండాల మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శంకర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండానే ఏడాది కాలంగా బిల్లులు స్వాహా చేస్తున్నాడు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరాచారి ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాచలంలో 17, 18 తేదీలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణానికి వీవీఐపీ, వీఐపీలతో పాటు సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భద్రత దృష్ట్యా ఇప్పటి నుంచే కూంబింగ్ చేస్తున్నామని తెలిపారు.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రేసులో పలువురు ఉండగా తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రసాద్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా అధికార పార్టీ అభ్యర్థి ప్రకటనతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపొందుకోనుంది.
నేడు భద్రాద్రిలో ఎదుర్కొలు ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 11 వరకు ఈ వేడుక ఉంటుంది. సీతారాములవారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మవారి వైపు ఒకరు, రామయ్యతండ్రి వైపు ఇంకొకరు ఉండి ఇరు వంశాల గొప్పలను సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ ఉంటుంది.
భద్రాద్రి శ్రీరామచంద్రుడి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ, భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈనెల 17 న సీతారాముల కళ్యాణం రోజు భక్తులు ఉచిత దర్శనం చేసుకోవచ్చని ఈఓ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు శీఘ్ర దర్శనం కొరకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఆ రోజు ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అమె తెలిపారు.
ఈ నెల 18 నుండి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటుచేసి, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థికి 3 వాహనాలు మాత్రమే అనుమతి ఉందన్నారు.
నీటితొట్టిలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన వైరా మండలం కేజీ సిరిపురంలో చోటుచేసుకుంది. కూరాకుల గోపి, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. వృత్తి రీత్యా తండ్రి కూరాకుల గోపి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి వైరాలోని ఒక షాపులో వర్కర్ గా పని చేస్తుంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు యశ్వంత్ (16 నెలలు) వారి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న సమయంలో అదుపుతప్పి సమీపంలో ఉన్న నీటితొట్టిలో పడిపోయి మృతి చెందాడు
భద్రాచలంలో ఈ నెల 17న జరగబోయే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి మొత్తం 238 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. అన్ని ప్రధాన బస్టాండ్ల నుంచి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి భద్రాచలానికి రిజర్వేషన్ సౌకర్యం కలదని పేర్కొన్నారు.
భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండవ వంతెనను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు. 2014లో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెనకు శంకుస్థాపన చేశారు. పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెనను శ్రీరామనవమి నాటికి ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వంతెనను రూ. 100 కోట్ల వ్యయంతో 2 కీ.మీ పొడవు నిర్మించారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్, కల్యాణ మండపం యొక్క సెక్టార్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ లో పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.