Khammam

News May 27, 2024

ఖమ్మం: విత్తన భాండాగారం.. రైతుల పాలిట కల్పవృక్షం

image

పంటల సాగుకు రైతులకు నాణ్యమైన విత్తనాలను వారికి అందిస్తూ.. రైతుల పాలిట కల్పవృక్షంగా నిలుస్తోంది రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం. 1993లో జిల్లాలో ఏపీ సీడ్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం టీఎస్ సీడ్స్ కార్యాలయంగా పిలుస్తున్నారు. ఏటా రూ.25 కోట్లకు పైగా విత్తన వ్యాపారం నిర్వహిస్తున్నారు.

News May 27, 2024

FLASH.. ఖమ్మం: ప్రారంభమైన పోలింగ్

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు ఉమ్మడి జిల్లాలోని 605 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఎలక్షన్ అధికారులు సూచించారు.

News May 27, 2024

KMM: ప్రధాన అభ్యర్థులు ఓటేసేదిక్కడే..!

image

KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

News May 27, 2024

పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు కీలకం: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్‌లో లెక్కింపు సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై, లెక్కింపు సిబ్బందికి విధులపై అవగాహన కల్పించారు. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

News May 26, 2024

ఖమ్మం: విద్యుదాఘాతంతో మాజీ ఎంపీపీ మృతి

image

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన మాజీ ఎంపీపీ రాములు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాములు తన ఇంట్లో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 26, 2024

ఎమ్మెల్సీ ఓటర్లు ఇలా వేస్తే ఓటు చెల్లదు: కలెక్టర్

image

రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నిబంధనల మేరకు ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రోమన్ అంకె లేదా సాధారణ అంకెల రూపంలోనే ఓటు వేయాలన్నారు. అలాకాకుండా ప్రాధాన్యత క్రమాన్నిమార్చివేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు. ఓటు వేసే ముందు అక్కడ సిబ్బందిని ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.

News May 26, 2024

భద్రాచలం ఆలయంలో మళ్లీ వివాదం..!

image

భద్రాచలం ఆలయంలో మరోసారి వివాదం మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రవర మార్చి చదివారని అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అర్చకులకు, వేద పండితులకు ఈవో మెమోలు జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రవర పఠించే సమయంలో శ్రీరాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

News May 26, 2024

9రోజుల్లో ఫలితాలు.. ఖమ్మం MPఎవరో ?

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికీ 13 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 9 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తామే గెలుస్తున్నామన్న ధీమాలో ఉన్నారు. ఖమ్మం నుంచి ఎవరు పార్లమెంట్లో అడుగు పెడతారో తెలియాలంటే మరో 9 రోజులు ఆగాల్సిందే. మరి గెలిచేదెవరో మీ కామెంట్!

News May 26, 2024

ఖమ్మం: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

News May 26, 2024

లారీ ఢీకొట్టి బాలుడి మృతి

image

భద్రాచలానికి చెందిన బాలుడు హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ITCలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం.వెంకటగోపి కుటుంబీకులతో HYD కూకట్‌పల్లిలో ఓ గృహ ప్రవేశానికి వచ్చారు. శనివారం స్వర్ణగిరి ఆలయానికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో వేదశ్రీ, పూజిత్‌రామ్‌కు వాంతులు కావడంతో కారు పక్కకు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కొడుకు పూజిత్‌రామ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడికక్కడే మృతిచెందాడు.