Khammam

News May 24, 2024

భద్రాచలం: మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఆందోళన

image

భద్రాచంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న కాలేజ్ ప్రాంగణలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గాయాలతో పడి ఉండగా యాజమాన్యం ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కారుణ్య నిన్న సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కాలేజ్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

News May 24, 2024

మణుగూరు నుంచి కోల్ కారిడార్

image

బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కోల్ కారిడర్ మణుగూరు నుంచి ప్రారంభం కానుంది. తాజాగా మణుగూరు – రామగుండం వరకు రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చ జండా ఊపింది. ఇందుకుగాను రూ. 2,911 కోట్లు ఖర్చు చేయనుంది. మణుగూరులో ప్రారంభమయ్యే ఈ రైలు ఏటూరు నాగారం మీదుగా ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భూపాలపల్లి నుంచి మంథని మీదుగా రామగుండం పరిధిలోని రాఘవాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

News May 24, 2024

KMM: రోడ్డు ప్రమాదంలో రికార్ట్ అసిస్టెంట్ దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి సత్తుపల్లిలో చోటుచేసుకుంది. JVR ప్రభుత్వ కాలేజ్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేసే ప్రసాద్(38) స్థానిక కృషి బైపాస్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ద్విచక్రవాహనంపై రాజీవ్‌నగర్ నుంచి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్‌కు ఉన్న కల్టివేటర్‌ను ఢీకొన్నాడు. పేగులు బయట పడటంతో స్థానికులు వెంటనే స్థానిక CHCకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News May 24, 2024

అభయారణ్యంలో అలరిస్తున్న జింకలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి. 1974లో 8 జింకలతో ఈ అరణ్యం మొదలైంది. ప్రస్తుతం జింకల సంతతి 140కి చేరింది. గతంలో సింగరేణి సంస్థ వీటి బాధ్యతను చూసేది. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో అభయారణ్యం కొనసాగుతోందని రేంజర్ శ్రీనివాస్ తెలిపారు.

News May 24, 2024

KMM: ప్రయాణికులపై ట్రాన్స్‌జెండర్ల దాడి

image

ఒడిశా వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. జనరల్ బోగిలో ఎక్కిన వారు ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బలరాం వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతడితో పాటు మరికొందరిపై దాడి చేశారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగగా, సదరు యువకులు ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 24, 2024

KMM: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు జిల్లాలో 42కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 14,984 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,352మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,632 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9నుంచి మధ్యహ్నం 12గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యహ్నం 2:30 నుంచి 5:30వరకు నిర్వహిస్తారు. జూన్1న పరీక్షలు ముగియనున్నాయి.

News May 24, 2024

ఖమ్మం: రైస్ మిల్లును తనీఖీ చేసిన కలెక్టర్

image

సిఎంఆర్ రైస్ దిగుమతి లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీలు చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వ ఉన్నవి, హమాలీలు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ లో వచ్చే పంటపై వివరాలు సేకరించారు.

News May 23, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

ACBకి చిక్కిన చర్ల డిప్యూటీ తహశీల్దార్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దార్ భరణిబాబు ఏసీబీకి చిక్కాడు. పాసుపుస్తకం ఇచ్చేందుకు ఓ రైతును లంచం అడిగాడు. రైతు ఏసీబీకి సమాచారం అందించగా రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News May 23, 2024

ఖమ్మం: ఆస్తి కోసం తండ్రిని చంపిన కూతురు..!

image

ఆస్తి కోసం కన్న కూతురే తండ్రిని చంపిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. గోరిలపాడుతండాకు చెందిన తేజవత్ బిచ్చు(60)కు కూతురు సక్కుకు ఆస్తి పంపకాల నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో సక్కు, మనుమరాలు నగ్మ కలిసి అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.