India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మానికి చెందిన విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి అమెరికాలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా.. రాకేష్(24) అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈనెల 8న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు రాకేశ్తో పాటు అతని స్నేహితుడు మునిగిపోయారు. మృతదేహాలు మరుసటి రోజు లభ్యమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని ఖమ్మానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
✓పలు శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో భారీ వాహనాలను 12న ఉదయం 5 గంటల నుంచి 14న ఉదయం 8 గంటల వరకు నిలిపి వేయాలని రంపచోడవరం రిటర్నింగ్ అధికారి పోలీసులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

ఖమ్మం: లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 13న పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, ఎన్నికల ఏర్పాట్లు, సైలెన్స్ పీరియడ్ పై మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ సమయం ఒక గంట పొడిగించిందని తెలిపారు.

దుమ్ముగూడెం: ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అచ్చుతాపురం గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. లక్ష్మీనగరం గ్రామం నుండి అచ్చుతాపురానికి వెళ్లే జిల్లా పరిషత్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు సైతం పూర్తిగా కుంగి రహదారి అధ్వానంగా మారిందని వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు.

ఖమ్మం జిల్లాలోని సమస్యాత్మకమైన పలు నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 4గంటలకు ముగిసింది. ఇన్నిరోజులు జోరుగా మోగిన మైకులు మూగబోయాయి. మే 13న పోలింగ్ జరగనుంది.

ఖమ్మం జిల్లాలో ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి విపి గౌతమ్ అన్నారు. స్లిప్లు రాని వారు ఓటు హక్కు రద్దైనట్లు భావించకూడదని, ఓటర్ స్లిప్ సమాచార నిమిత్తమే ఓటర్ స్లిప్ రాని వాళ్ళు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి ఓటు వేయొచ్చని చెప్పారు. 48 గంటల్లో స్టార్ క్యాంపెయినర్ లా వచ్చిన వారు వాళ్ళ ప్రాంతానికి వెళ్లిపోవాలన్నారు. అటు నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో నామా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 1,60,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలిలా..
నామా నాగేశ్వరరావు (బీఆర్ఎస్) – 5,67,459,
రేణుకా చౌదరి (కాంగ్రెస్) – 3,99,397,
బోడ వెంకట్ (సీపీఎం) – 57,102,
దేవకి వాసుదేవరావు (బీజేపీ) – 20,488,
నరాల సత్యనారాయణ (జనసేన) – 19,315.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ఈరోజు సా.4 గంటలకే ప్రచారం ముగియనుంది. మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం.. ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సా.4 గంటలకే ప్రచారం ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.