India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
> ఖమ్మం నగరంలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
> ఎన్నికల నిర్వహణపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
> ఖమ్మం రూరల్ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల పొంగులేటి పర్యటన
> ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిషేధ ఆజ్ఞలు అమలులో వుంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు, ఊరేగింపులు అన్ని రకాల ప్రచారాలు నిషేధించబడతాయన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

శాంతియుత వాతావరణంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్ఫోర్స్మెంట్.. తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి పోలీస్ కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై సూచనలు చేశారు.

ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ రాత్రి 10 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు.

మధిర పట్టణంలోని అన్నపూర్ణ మెస్ పక్కన విజయవాడ నుంచి వచ్చిన ఓ యువతి (22) అద్దెకు నివాసం ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర టౌన్ ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు.. ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే రాజకీయాలు చేస్తున్నాను.. అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.

ఖమ్మం MP స్థానంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈనెల 11నుంచి 13వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.

ఒంటరిగా మహిళ ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి బంగారు గాజుల అపహరించిన ఘటన తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడకు చెందిన మహిళ రాధిక ఇంట్లో ఒంటరిగా కూర్చోని ఉండగా ఇంటి వెనుక వైపు నుంచి గుర్తు తెలియని దొంగ లోపలకు ప్రవేశించి రాధిక మొఖంపై మత్తు మందు స్ప్రే చేశాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చేతికి ఉన్న రూ.1.05 లక్షల విలువైన 3 బంగారు గాజులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.