India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం గ్రామీణ మండలం ధంసలాపురంలో తీవ్ర విషాదం జరిగింది. మున్నేరులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా, మరో బాలుడి కోసం గాలిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మద్యం ప్రియులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. దీంతో వైన్ షాపుల దగ్గర రద్దీ వాతావరణం నెలకొంది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భద్రాచలం వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మంత్రి తుమ్మల సిబ్బందికి సహకరించారు. ఎన్నికలలో డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆళ్ళపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామ ప్రజలు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం తమ గ్రామంలోకి ప్రచారానికి రావద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడంలో కేవలం ఎన్నికల హామీలు ఇస్తున్నారు.. కానీ పరిష్కరించడం లేదన్నారు. తమ గ్రామం ఎన్నికలప్పుడే గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.

ఖమ్మం లోక్ సభ ఎన్నికల వేళ మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది. మే 13న పోలింగ్ జరగనుండగా.. మే 11న సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లు మూసేయాలని అధికారులు అదేశించారు. ఈ రెండు రోజులతో పాటు.. కౌంటింగ్ రోజైన జూన్ 4వ తేదీన కూడా మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారులు ముందే ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదవశాత్తు ఓ కారు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన ఏటూరునాగారంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి మేడారం దర్శనానికి కారు వెళ్తోంది. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని జీడివాగు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మంగపేట PHC పరిధిలోని పొగళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఏఎన్ఎం-1గా విధులు నిర్వహిస్తున్న పుష్పలత(35)గత నెల 27న విధులకు భర్త శ్రీనివాస్తో కలిసి బైక్పై పాల్వంచ నుంచి బయల్దేరింది. పాతూరు శివారులో ఎదురుగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పలత బుధవారం మృతిచెందారు.

✓మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓తల్లాడ మండలంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్
✓ఇల్లందు నియోజకవర్గంలో మాజీ గవర్నర్ తమిళిసై పర్యటన
✓భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
✓వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

మహబూబాబాద్ లోక్సభ స్థానం BJP అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో నేడు రోడ్ షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోపీకృష్ణ బుధవారం తెలిపారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి , శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో రిటర్నింగ్ అధికారి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియకు దగ్గర పడుతున్నందున నిబంధనలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
Sorry, no posts matched your criteria.