India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి 6 రోజులే గడువుంది. 13న పోలింగ్ జరగనుండగా 2 రోజుల ముందుగా 11న సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సభలు, కార్యక్రమాలకు ఇబ్బందిగా మారాయని అభ్యర్థులు చెబుతున్నారు. అనుకున్న స్థాయిలో ప్రచార షెడ్యూల్ పూర్తి చేయలేకపోతున్నారు.

చింతూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఛాతిలో నొప్పి ఉందంటూ ఒక్కసారిగా కుప్ప కూలడంతో తోటి సిబ్బంది వెంటనే రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు శనివారం చింతూరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఏఎస్ఐ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రధానంగా ఖమ్మం జిల్లాపై ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిసారించారు.

∆} ఖమ్మంలో నేడు సినీ సంగీత విభావరి
∆} ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
∆} వివిధ శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} వేంసూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి మండలంలో ఎంపీ వద్దిరాజు పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రతి ఒక్కరూ చల్లగా ఉండేందుకు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని స్విమ్మింగ్ పూల్స్, పంట పొలాల్లోని బావుల వద్ద.. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో అక్కడ ఈత కొడుతూ.. చిన్నారుల నుంచి పెద్దల వరకు సేద తీరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే .. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. నియోజకవర్గంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం రోజు రోజుకూ జోరందుకుంటుంది. సమావేశాలు, సభలతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. తమ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు జిల్లాలో వాడవాడనా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే చేయబోయే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.

ఖమ్మం జిల్లాలో హోం ఓటింగ్ కొనసాగుతోంది. శనివారం ముదిగొండ మండలంలో 61 మంది, కల్లూరు మండలంలో 19, చింతకాని మండలంలో 79, వేంసూరు మండలంలో 39 మంది ఇంటి దగ్గరే ఓటు వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం లోక్ సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ కోల్టేతో కలిసి ఈవిఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించినట్లు చెప్పారు.

NLG -WGL-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.