India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో సంస్థకు అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈనెల 4వ తేదీన ఖమ్మం రీజియన్ నుంచి సంస్థకు రూ.1.35 కోట్లు ఆదాయం రాగా, సోమవారం అంతకుమించి రూ.1.50 కోట్లు ఆదాయం సమకూరింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా శుభకార్యాలు, ఇతర పనుల కోసం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండడం ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
రాష్ట్రంలో కరెంటు కోతలున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం బూటకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన కరెంటు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎక్కడా పవర్ కట్లు లేవన్నారు. పదే పదే ప్రభుత్వాన్ని కూల్చుతామనడం బీఆర్ఎస్ పార్టీకి సరికాదన్నారు. అక్కడ విధానాలు నచ్చకే కాంగ్రెస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు.
భద్రాచలం సీతమ్మ తల్లికి ప్రత్యేకమైన మూడు సూత్రాల తాళితో కళ్యాణం నవమి నాడు నిర్వహించనున్నారు. పుట్టింటి సూత్రం, మెట్టినింటి సూత్రంతో పాటు రాముని పరమ భక్తుడు భక్తరామదాసు భక్తుల తరఫున ఏర్పాటు చేసిన మూడో సూత్రం కలిపి దేవాలయ అర్చకులు శ్రీరామ నవమి నాడు రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో ఆలయానికి మాత్రమే ఈ తంతు ప్రత్యేకం.
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న రానుందని ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్కు దరఖాస్తుల సమర్పణకు వచ్చే ప్రజలు దీనిని గమనించాలని, పై తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే కలెక్టరేట్కు దరఖాస్తుదారులు రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
భద్రాద్రి రామయ్య ఎదురుకోలు ఉత్సవం ఈరోజు సాయంత్రం భద్రాచలం లో కన్నుల పండుగగా అట్టహాసంగా జరిగింది. కల్యాణానికి కొద్ది ఘడియలు ముందు అత్యంత ఘనంగా ఎదుర్కోలు వేడుక ఉంటుంది. సీతారాములవారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మవారి వైపు ఒకరు, రామయ్య తండ్రి వైపు ఇంకొకరు ఉండి ఇరు వంశాల గొప్పలు సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ చేసారు.
ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సగర వంశస్తులైన మంగళవారం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, వడి బియ్యం స్వామివారికి అందజేశారు. భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రతో తరలివచ్చిన ఆలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు.
శ్రీరామనవమి నిర్వహణపై మంగళవారం ఎస్పీ రోహిత్ రాజు పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. తమకు కేటాయించిన విధులను గురించి వివరించారు. పోలీసు అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమన్వయంతో డ్యూటీ చేయాలన్నారు.
బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఈరోజు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో ఆల్ ఇండియా 938వ ర్యాంకు సాధించారు. సాయి అలేఖ్యకు మధిర టౌన్ ఎస్ఐ సంధ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.