Khammam

News April 30, 2024

పక్కపక్కనే ఇద్దరు మంత్రులు.. నీళ్లెందుకు రాలేదు: KCR

image

ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్కన నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి.. ఇద్దరు మంత్రులుండగ కాలువలో నీళ్లెందుకు రాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం రోడ్ షో అయన మాట్లాడుతూ.. పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతామని రైతులు ఎందుకుపోయి దండయాత్ర చేశారు? అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినయ్‌. ఇవన్నీ చర్చించాలన్నారు. ఈ దేశం మీది.. రాష్ట్రం మీది..భవిష్యత్‌ మీది. యువత ఓ ఒరవడిలో కొట్టుకుపోవద్దన్నారు.

News April 29, 2024

నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారు: కేసీఆర్

image

ఖమ్మంలో నిర్వహించినoచిన రోడ్ షోలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. బీఆర్ఎస్‌కు 12 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.

News April 29, 2024

రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశాం: కేసీఆర్

image

అశోక్‌ గులాటీ ఆగ్రో ఎకానమిస్ట్‌తో అనేక మాసాలపాటు చర్చించి ఓ నిర్ణయం తీసుకొని రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చామని, కరెంటు, నీటి తీరువా లేకుండా చేశామని, పాత బకాయిలు రద్దు చేశామని, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని పేర్కోన్నారు.

News April 29, 2024

కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్‌కు బలం ఇవ్వాలి: కేసీఆర్‌

image

కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో బలం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు ఇచ్చిందన్నారు. రైతుబంధును బుర్రలేక పెట్టినమా ? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ, మద్దతు లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదన్నారు.

News April 29, 2024

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ఏ.ఆర్.ఓలు, ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ.. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News April 29, 2024

ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట: భట్టి

image

ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సంపద, వనరులను జనాభా సంఖ్యకు అనుగుణంగా పంచాలనేది రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. కేసీఆర్ పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచేసి సిగ్గులేకుండా ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు.

News April 29, 2024

KCR దిగజారి మాట్లాడుతున్నారు: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు మొదలయ్యయని .. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన మండిపడ్డారు.

News April 29, 2024

కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్ల పరిశీలన

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరానికి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. కేసీఆర్ బస్సు యాత్ర ఖమ్మం కాల్వఒడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

News April 29, 2024

నడ్డా హెలికాప్టర్, కాన్వాయ్ తనిఖీ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరావడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా హెలికాప్టర్, కాన్వాయ్‌ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు.

News April 29, 2024

ఖమ్మం జిల్లాలో బరిలో ఉండేది ఎవరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు సమయం ముగియడంతో.. ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఖమ్మం జిల్లా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.