Khammam

News April 15, 2024

WOW.. భద్రాచలం సీతమ్మవారికి త్రీడీ చీర

image

భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

ఖమ్మం: ఓటు నమోదుకు నేటితో ముగియనున్న గడువు

image

ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు చేసుకునేవారు మే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 15, 2024

దమ్మపేట: ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి

image

తాగునీటి కోసం వ్యవసాయ క్షేత్రంలో గల నీటికుంట వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిన ఘటన భద్రాద్రి(D) దమ్మపేట(M) అల్లిపల్లిలో జరిగింది. గంగుల గూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగరాజు మరో ఐదుగురితో కలిసి ఆదివారం అల్లిపల్లి గ్రామంలో కొబ్బరి బొండాలు కోత కోసే పనికి వెళ్లాడు. నాగరాజుకు దాహం వేయగా, అదే తోటలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.

News April 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓అశ్వారావుపేటలో BJP కార్యకర్తల సమావేశం

News April 15, 2024

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్ నేడు పునఃప్రారంభం

image

నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల కారణంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో ఈరోజు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

News April 15, 2024

నేడు భద్రాద్రిలో ధ్వజారోహణం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలలో చాలా ముఖ్యమైనది. సంతానం లేని స్త్రీలకు గరుడ ప్రసాదం ఇస్తారు. ఈ ప్రసాదం తినడం వలన సంతానం కలుగుతుందనే నమ్మకంతో వేలాదిమంది సంతానార్ధులైన స్త్రీలు భద్రాద్రి వస్తారు.

News April 15, 2024

ఎన్నికల సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

image

లోకసభ ఎన్నికలు-2024 సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన లోకసభ ఎన్నికల సహాయక కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సహాయార్థం సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఎన్నికల సంఘం నుండి పంపబడిన నామినేషన్ పత్రాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

News April 14, 2024

‘ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి సెలవులు రద్దు’

image

రానున్న లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సెలువులు కోరితే ఇవ్వవద్దని గతంలో పెట్టుకున్న సెలవులను రద్దు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తమకు సెలవులు కావాలని కోరుతున్నారని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎటువంటి సెలవలు మంజూరు చెయ్యొద్దని అన్ని శాఖల అధికారులకు తెలియజేశారు.

News April 14, 2024

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు: భట్టి

image

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. ఒక్క గంట కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నాం అని మోసం చేశారన్నారు.

News April 14, 2024

ఏపీ సీఎంపై దాడి.. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపైన గాయమైంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచివి కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించరన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.