India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మంలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకానుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేదు. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైన గెలవాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరి లోక్సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి జరగనున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 3నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డబ్బు అక్రమ రవాణా, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో రెండు, ఖమ్మం జిల్లా పరిధిలో పది అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 15 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, 5 అకౌంటింగ్ బృందాలను నియమించారు.
స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీపీ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి , 15 ఎస్ఎస్టి , 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు చెప్పారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అటు ప్రజలతో మర్యాదగా మెలగాలని పేర్కొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న 134 కిలోల గంజాయిని అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం గొల్లగూడెం ప్రధాన రహదారి పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా కారులు అక్రమంగా చింతూరు నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దుమ్ముగూడెం మండలం డి.కొత్తగూడేనికి చెందిన తిరుపతిరావు (45) సోమవారం స్కూటీపై మహాదేవపురం వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో సుబ్బారావుపేట వద్ద తాలిపేరు ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మంగళవారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, ఏఆర్ఓ , డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా సజావుగా జరపాలన్నారు.
చర్ల సరిహద్దుకు ఆనుకుని ఉన్న సుకుమా జిల్లా కిస్టారం ఏరియా కమిటీకి చెందిన సోడి కొస, సోడి సుక్కి అనే మావోయిస్టు దంపతులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ గతంలో పలు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. సుక్కా అలియాస్ సోడి కోసపై రూ.5లక్షలు రివార్డు, సోడి సుక్కి మీద రూ.2 లక్షలు రివార్డు ఉంది.
ఖమ్మం: బీజేపీ అధిష్ఠానం విడుదల చేసే ఎంపీ అభ్యర్థుల నెక్స్ట్ లిస్టులో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు అన్నారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు ఆగిందో పార్టీకే తెలియాలన్నారు. పాత బీజేపీ నేతలతో మాట్లాడే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ సీనియర్ నేతల సహకారం తనకే ఉందన్నారు. ఖమ్మంలో బీజేపీ సత్తా ఏంటో ఎన్నికల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.
సత్తుపల్లిలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం పట్టణ శివారులోని వంతెన పైనుంచి వెళ్తుండగా అదుపుతప్పి తమ్మిలేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా వాగులో పూర్తిగా మునిగిన డీసీఎంను పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.