Khammam

News April 14, 2024

ఫోన్ ట్యాపింగ్‌‌లో ఉన్న వారు ఎంతటి వారైనా వదిలేది లేదు: మంత్రి

image

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వారిపై విచరణ జరుగుతుంది. ఆధారాలతో సహా బయటికి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎంతటి పెద్దవారైనా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరువు అని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు అన్నారు.

News April 14, 2024

ఖమ్మం: బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

image

10 ఏళ్లు అధికారంలో ఉండి సెక్రటేరియట్‌కు రాకుండా ప్రజలను కలవకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గత బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు రంగాన్ని గందరగోళంలోకి నెట్టేసి, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు.

News April 14, 2024

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరావును ప్రకటించగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

News April 14, 2024

ఖమ్మం: అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చింతూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ సుకుమామిడి మండల పరిషత్ యూపీ పాఠశాల ఉపాధ్యాయుడు కనకారావు(59) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు.

News April 14, 2024

ఉదయాన్నే ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండల శివారులో బైక్‌ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

కొత్తగూడెం: ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు జారీ

image

కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నాగారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో MEO కృష్ణయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శనివారం ఆయన పాఠశాలను తనిఖీ చేయగా ఉపాధ్యాయుడు గైర్హాజరు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడు వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే పాఠశాలకు వస్తున్నాడని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News April 14, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> సత్తుపల్లికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాక
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
> కల్లూరు, వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
> ఎర్రుపాలెంలో కరెంటు కోత
> వైరా: గన్నవరంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
> పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
> భద్రాచలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
> ఖమ్మంలో ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచారం

News April 14, 2024

విజయవాడ-భద్రాచలం రోడ్డు, రైలు పునఃప్రారంభం

image

విజయవాడ- భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం), భద్రాచలం రోడ్డు- విజయవాడ మధ్య ప్యాసింజర్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం పునఃప్రారంభించారు. ఈ రైళ్లను 21 వరకు నడిపిస్తామని ప్రకటించారు. విజయవాడలో మొదలుకానున్న ప్యాసింజర్‌ రైలు ఖమ్మం, డోర్నకల్‌, కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వరకు నడుస్తుంది. తిరిగి కొత్తగూడెంలో మొదలై ఇదే మార్గం ద్వారా విజయవాడ చేరుకుంటుంది.

News April 14, 2024

రామయ్య కళ్యాణం టికెట్ల వివరాలు 

image

ఈనెల 17న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే ఉభయ దాతలు వివిఐపి, వీఐపీ, సామాన్య భక్తులకు టికెట్ల వివరాలు అలాగే వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. ఉభయ దాతల టికెట్లు రూ. 7500, వివిఐపి టికెట్లు రూ. 2500, విఐపి టికెట్లు రూ. 2000, సామాన్య భక్తులకు రూ. 1000, రూ. 300, రూ. 150 రేట్ల ప్రకారం అందుబాటులో ఉంచామన్నారు.

News April 13, 2024

పాలేరు ప్రజల సమస్యల కోసం నూతన ఒరవడి: మంత్రి పొంగులేటి

image

తనను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన పాలేరు ప్రజల కోసం అనునిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. నాలుగు మండలాలకు ఇద్దరు వ్యక్తి గత సిబ్బందిని నియమించుకుని వారి కోసం ఓ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేస్తానని ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులతో పొంగులేటి మాట్లాడారు.