Khammam

News April 27, 2024

KMM: మే 6 నుంచి డిగ్రీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

News April 27, 2024

నేను రైతు బిడ్డను.. ఇక్కడే పుట్టి పెరిగాను: నామా

image

తాను ఇక్కడే పుట్టి పెరిగిన రైతు బిడ్డనని, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటానని బీఆర్ఎస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పార్లమెంట్ కు వెళ్లి ప్రజా సమస్యలపై కోట్లాడి మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

News April 27, 2024

కాంగ్రెస్‌లోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీలక నేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న జేవీఎస్ చౌదరి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సుదీర్ఘ మంతనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొంతకాలం పనిచేసిన అనుభవం జేవీఎస్‌కు ఉంది. ఆ అనుభవంతోనే శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

News April 27, 2024

KMM: సోషల్ మీడియాలో ప్రచార జోరు..

image

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆర్భాటాలు, ర్యాలీలు, మైకుల హోరు, ప్రచార వాహనాల జోరు ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. ర్యాలీలు, కార్నర్ మీటింగ్, అగ్రనాయకులను రప్పిస్తూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉదయం వాకింగ్లో యువతను పలకరిస్తున్నారు.
ఇంటింటి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలే చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

News April 27, 2024

ఖమ్మం లోక్‌సభ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువ

image

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 16,31,039 మంది కాగా వీరిలో పురుషులు 7,87,160, మహిళలు 8,43,749, ఇతరులు 130 మంది ఉన్నారు. పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాగా వచ్చేనెల 13న జరగనున్న ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో మహిళలు ఎటు మొగ్గు చూపితే ఆ అభ్యర్థికే విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News April 27, 2024

ఆర్ఆర్ఆర్ ఛాయ్.. చాలా స్పెషల్

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విన్నూత్న ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మంలోని ఇవాళ ఉదయం టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న హోటల్‌లో ఇదీ ఆర్ఆర్ఆర్ ఛాయ్ స్పెషల్ అంటూ తనదైన శైలిలో అందరికి అందించారు. అనంతరం అక్కడే అల్పాహారం సేవించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, బేబీ స్వర్ణకుమారి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

News April 27, 2024

‘భార్య, తమ్ముడు, కొడుకు టూ వియ్యంకుడు’

image

ఖమ్మం కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందని ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. నిన్న రాత్రి లక్ష్మీదేవిపల్లిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి తన భార్య కోసం, ఒక మంత్రి తన తమ్ముడి కోసం, మరో మంత్రి తన కొడుకు టికెట్ కోసం పోరాడారని చివరకు ఒక మంత్రి వియ్యంకుడి దగ్గర ఆగిందన్నారు. మన అభివృద్ధి మన చేతుల్లో ఉండాలా? బయటి వ్యక్తి చేతిలో పెట్టాలా? ప్రజలే ఆలోచించాలన్నారు.

News April 27, 2024

ఖమ్మంలో హీరో వెంకటేశ్ ఎన్నికల ప్రచారం!

image

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు గాను రఘురామిరెడ్డి వర్గీయులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేశ్
నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

News April 27, 2024

నలుగురు నామినేషన్లు తిరస్కరణ

image

ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 41మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News April 27, 2024

రెండవ దశ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశాం: రిటర్నింగ్ అధికారి

image

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి గౌతమ్, పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ తో కలిసి పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.