India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✓పలు శాఖలపై భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
✓వేంసూర్ మండలంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
ఖమ్మం జిల్లాలో గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.6.69 కోట్ల విలువైన విద్యుత్ను వినియోగదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు సంస్థ గుర్తించింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి వచ్చాక ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్తో అనుసంధానమైన విద్యుత్ కనెక్షన్లకు ఉచిత పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.
ఖమ్మం మెడికల్ కాలేజి నిర్మాణం కాంట్రాక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీఅయ్యారు. తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్స్, ప్రొఫెసర్స్ క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్, క్రీడా మైదానం నిర్మాణం కేటాయించిన స్థల ప్రాంగణంలో ఏ బిల్డింగ్ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే విషయం త్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పాల్వంచ అంబేడ్కర్ సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోమొబైల్ వర్క్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల షెడ్యూలు విడుదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో పీటమూడి వీడటం లేదు. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
భద్రాచలంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం సౌమిత్రీ సదనం సమీపంలో రూ.3.6 కోట్లతో గ్రౌండ్ ప్లస్ 2పద్ధతిలో 34 గదులను నిర్మించారు. దీనికి జానకీ సదనం అని పేరు నిర్ణయించారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉండగా వీలైనంత తొందరగా పూర్తిచేసి 17న ప్రారంభించాలని సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సత్రాలకు తోడు ఇది అందుబాటులోకి వస్తే భక్తులకు వసతి సదుపాయం మెరుగుపడనుంది.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించే అవకాశముంది. దీంతో వీరికి మాత్రం గతంలో మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరైనా వస్తే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరు సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసే బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయాలి.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మండలం నాచేపల్లి గ్రామానికి చెందిన సట్టు నాగరాజు(29) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
∆} పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పెనుబల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} దుమ్ముగూడెం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} తల్లాడ మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
ఖమ్మంలోని చెరువుకట్ట బజార్కు చెందిన రాములు మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, విచారణలో ఆయనది హత్యేనని పోలీసులు తేల్చారు. రాములును ఆయన భార్య సత్యవతి కత్తిపీటతో ముఖంపై నరికి హత్య చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. దీంతో ఆమెను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.