India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొనిజర్లలో జరిగింది. కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మల్లుపల్లికి చెందిన ఉపేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లని నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ లో నీటిని తాగడంతో అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ఆరోగ్యం కోసం మట్టికుండల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ కొనుగోలు చేయలేని పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు నగరంలోని ప్రధాన వీధుల్లో వ్యాపారులు పలు రకాల కుండలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
కల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అక్కడకు సుజాతనగర్కు చెందిన ఇద్దరు వచ్చారు. ఆ వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. గతంలో ఇదే ఇంటి వద్ద ఇదే ఘటనపై కేసు నమోదైంది. దీంతో ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షాకీర్ తెలిపారు.
పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు ముందు రోజే కేంద్రాలను సరిచూసుకుంటే మంచిదని సూచించారు. అలాగే, పరీక్ష రోజు కేంద్రాలకు హాల్ టికెట్లతో నిర్ణీత సమయానికి కంటే ముందుగా చేరుకోవాలని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని, అవాంచనీయ ఘటనలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
*వివిధ శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
*ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
*ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
*అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
*బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
*కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
*పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా పొదెం గుర్తింపు పొందారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏకతాటిపై నడిపించారు.
KMM, MHBDలో పాగా వేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. MHBD స్థానం నుంచి బలరాంనాయక్ బరిలో ఉండగా.. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించలేదు. అటూ BRS ఈ రెండు స్థానాలను నిలబెట్టుకోవాలని అడుగులు వేస్తోంది. సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవితకు మళ్లీ టికెట్లు ప్రకటించింది. మరో పక్క BJP సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. MHBD నుంచి అజ్మీరా సీతారాంనాయక్ను బరిలో నిలిపింది. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న మువ్వా విజయ్బాబును కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను విజయ్బాబు నిర్వర్తించి కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ప్రభుత్వం గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.
లోకసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విధివిధానాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదివారం వెల్లడించనున్నట్లు డిపిఆర్ఓ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ హాజరుకావాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల నగారా మోగింది. నియోజకవర్గాల వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్ అనుమతులు, వాహన అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పొందాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.