India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు
∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన
∆} దమ్మపేటలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} చింతకాని మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓవైపు సాగు నీటి కొరత, దంచికొడుతున్న ఎండలు కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా ఉన్న పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమయ్యాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు నీటి వనరులు ఎండిపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించినా ఎండ తీవ్రతతో నీరు అందక మధ్యలోనే పంటలను వదిలేస్తున్నారు.
కూలర్ కడుగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. కొత్తగూడెం టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధి రామవరంలో ఈ విషాదం జరిగింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 7వ నంబర్ బజార్కు చెందిన సయ్యద్ షోయబ్ (28) ఇంట్లో మోటార్ ఆన్ చేసి కూలర్ను కుడుతున్నాడు. మోటార్ వైర్ తెగి కాలుపై పడగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో 984 చెరువులు ఉండగా.. వీటి పరిధిలో 1.50 లక్షల పైచిలుకు ఆయకట్టు ఉంది. వానాకాలం వర్షాలు లేక చాలా చెరువులు పూర్తిగా నిండలేదు. వానాకాలం సాగు బాగానే ఉన్నా.. యాసంగిలో మాత్రం సాగు తగ్గింది. దీంతో రైతులు 20వేల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈ చెరువుల కిందే తాగునీటి పథకాలు ఉన్నాయి. కాగా, మొత్తం చెరువుల్లో కేవలం 11 చెరువుల్లోనే 75 శాతం లోపు, మూడు చెరువుల్లో 75 నుంచి 100శాతంలోపు నీటి మట్టం ఉంది.
నవమి రోజున శ్రీ సీతారామ కల్యాణం నిర్వహించే వారిలో వైదిక పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతీ క్రతువులో వీరు పాల్గొని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా శాస్త్రోక్త పాత్ర పోషిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో పొడిచేటి సీతారామానుజాచార్యులు, బ్రహ్మగా అమరవాది గోపాలకృష్ణమాచార్యులు , ఆచార్యులుగా కోటి శ్రీమన్నారాయణాచార్యులు వైదిక పెద్దలుగా వ్యవహరిస్తారు.
బియ్యం స్టాక్లో తేడా ఉండడంతో తల్లాడ మండలంలోని మిట్టపల్లిలోని రెండు రేషన్ షాపులను సివిల్ సప్లయ్ అధికారులు సీజ్ చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టపల్లిలోని 5వ నెంబర్ షాపు 13.10 క్వింటాళ్లు, 23వ షాపులో 12 .64 క్వింటాళ్ల బియ్యం తూకంలో తేడా ఉండడంతో సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ షాపు బాధ్యతలను రామానుజవరం, నూతనకల్ డీలర్లకు అప్పగించారు.
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఓ వైపు దిగుబడి లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు పడిపోయాయి. దీనికి తోడు ప్రస్తుతం ఎండలు పెరగడంతో కాయ రంగు మారుతోంది. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు, మిర్చి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయం కూడా వచ్చేలా లేదని వాపోతున్నారు.
రంజాన్ మాసంలో హలీమ్ను తినేందుకు ఎంతగా ఇష్టపడతారో.. గరం గరం గంజిని సేవించేందుకు కూడా అంతే ఇష్టం చూపిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ ద్రవపదార్థమైన వేడివేడి గంజి(జావ)ను తాగితే మంచిదని భావిస్తారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో మసీదుల్లో ఈ పసందైన ఘమఘుమలాడే వంటకాన్ని మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు తయారు చేస్తారు.ఉపవాస దీక్షా పరులు ఈ గంజిని సేవిస్తే బడలిక తీరుతుంది.
అనారోగ్యంతో బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం పినపాక మండలంలో చోటుచేసుకుంది. కరకగూడెం గ్రామానికి చెందిన బాలిక సౌమ్య (8)కు కామెర్లు రావటంతో మణుగూరులోనీ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బాలిక మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు.
రైతులను రెచ్చగొట్టి పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మాజీ సీఎం కేసీఆర్ రైతు దీక్షల పేరుతో నటిస్తూ పంట పొలాలను పరిశీలిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు.
Sorry, no posts matched your criteria.