Khammam

News April 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో KCR రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ CM కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బస్సు యాత్రలు చేపట్టనున్నారు. BRS పార్టీ రోడ్‌షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ నెల 29న ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో ఉండనుంది. 30న తల్లాడ, కొత్తగూడెంలో మాజీ సీఎం రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

News April 21, 2024

KMM: నిద్రపోతుండగా విద్యార్థినికి పాము కాటు

image

పాము కాటు గురై ఓ విద్యార్థిని తీవ్ర అవస్థతకు గురైన ఘటన తిరుమలాయపాలెం మండలంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్నాబాద్ గ్రామానికి చెందిన మాగి వెంకన్న, లక్ష్మి దంపతుల కుమార్తె స్పందన శనివారం రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్పందన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

News April 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} కూసుమంచి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆}ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News April 21, 2024

KMM: గీత దాటితే కొరడా ఝళిపిస్తారు ..!!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. ప్రవర్తన నియమావళికి లోబడి పార్టీలు అభ్యర్థులు నడుచుకోవలసి ఉంటుంది. ప్రచార సమయంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలను అధికారులు షాడో బృందాల ద్వారా నమోదు చేస్తున్నారు. ఒకవేళ గీత దాటితే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.

News April 21, 2024

వర్షాల నేపథ్యంలో రైతుల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

image

అకాల వర్షాలు, పంట నష్టాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆరా తీశారు. రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టంపై మంత్రి తుమ్మల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. రానున్న 3, 4 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని.. పంట కొనుగోలు కేంద్రాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని తుమ్మల ఆదేశించారు.

News April 21, 2024

ఖమ్మం: రూ.48,63,300 విలువైన సొత్తు స్వాధీనం

image

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శనివారం వరకు 517మందిపై 471 కేసులు నమోదు చేసి.. రూ.48,63,300 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన సెల్‌ నోడల్‌ అధికారి మురళీధర్‌రావు తెలిపారు. 40 కేసుల్లో బాధ్యులు ఆధారాలను సమర్పించడంతో తిరిగి ఇచ్చామన్నారు. ఇవి కాకుండా రూ.3.50లక్షల విలువైన పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకుని 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

News April 21, 2024

29 వరకు బీఈడీ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) రెండో సంవత్సరం, రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్ష ఫీజు తేదీని కేయూ అధికారులు ప్రకటించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29లోపు చెల్లించవచ్చని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహా చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రాధిక తెలిపారు. ఆలస్య రుసుంతో మే 5 వరకు చెల్లించవచ్చన్నారు.

News April 20, 2024

KMM: ఇక గొర్రెల పంపిణీ లేనట్టేనా!

image

గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధకశాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా.. తాము చెల్లించిన డీడీలు అయినా వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 20, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో వడదెబ్బ నుంచి రక్షణ సూచనలపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎండదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఉదయం‌ 11గంటలు దాటితే బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు.

News April 20, 2024

KMM: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన BRS నేతలు

image

మాజీ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శనివారం BRS నాయకులు పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖమ్మం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన రూ. 2లక్షల రుణమాఫీ, రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 4 వేలు పెన్షన్, వరికి రూ. 500 బోనస్ హామీలు అమలు చేయాలని గుర్తు చేశారు.