Khammam

News July 7, 2024

గడిచిన పదేళ్లలో కుంటుపడిన అభివృద్ధి!

image

రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువగా నష్టపోయింది భద్రాచలం పుణ్యక్షేత్రం. తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం , చింతూరు పూర్తిగా ఏపీలో కలిశాయి. భద్రాచలం మండలంలోని రెవెన్యూ గ్రామం మినహా మిగతా గ్రామాలు, బూర్గంపాడు మండలంలో కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడిచిన పదేళ్లలో భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది.

News July 7, 2024

డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం సాయంత్రం పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11,809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 6,352 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

News July 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా విజృంభిస్తున్న విషజ్వరాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో జనం మంచం బారిన పడుతున్నారు. వర్షాకాలానికి తోడు వాతావరణ మార్పులతో అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. అయితే ఈ సమయంలో జనం ఇష్టం వచ్చినట్లు సొంత వైద్యం చేసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

News July 7, 2024

ఆర్టీసీ కార్మికులపై మోయలేని భారం!

image

సురక్షిత ప్రయాణానికి మారుపేరైన ఆర్టీసీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే కార్మికులపై మోయలేని భారం పడుతోంది. చాలీచాలని వేతనాలు, అధికారుల వేధింపులు, పాత బస్సులు, డబుల్ డ్యూటీలు, పని ఒత్తిడితో అలసటకు గురవుతున్న కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్డుపై ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది.

News July 7, 2024

సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ శనివారం రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాసిన సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ సిఫార్సు లేఖలపై నేడు జరగనున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రస్తావించాలని లేఖలో పేర్కొన్నారు.

News July 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆] డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఇల్లెందులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో ఎంపీ RRR పర్యటన
∆} మణుగూరులో సింగరేణి కార్మికుల నిరాహార దీక్ష
∆} ఖమ్మంలో మాల మహానాడు సమావేశం

News July 7, 2024

ఖమ్మం: ఫోన్ ధర డబ్బులు చెల్లించాల్సిందే!

image

భద్రాద్రి జిల్లా రామవరానికి చెందిన మహబూబ్ అలీ 2022లో ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్  రూ.18,298 చెల్లించి బుక్ చేసుకున్నాడు. ఆర్డర్ రాగా దానిని ఓపెన్ చేస్తే చార్జర్, పౌచ్ మాత్రమే ఉండటంతో ఆన్లైన్ కంపెనీకి ఫోన్ చేశాడు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు నివేదించాడు. పరిశీలించిన కమిషన్ కంపెనీ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించి ఫోన్ ధర చెల్లించాలని తీర్పునిచ్చారు.

News July 7, 2024

ఖమ్మం జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం:కలెక్టర్

image

ఖమ్మం: వర్షాలు మొదలవడంతో ప్లాంటేషన్ ఒక పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నందు వనమహోత్సవంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.

News July 6, 2024

డబ్బులు తీసుకోవడం మర్చిపోతే కాల్ చేయండి: RM సరిరామ్

image

ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ వెనుక రాసే డబ్బులు మర్చిపోతే తిరిగి పొందొచ్చని ఖమ్మం RM సరిరామ్ అన్నారు. TGSRTC హెల్ప్ లైన్ నంబర్ 040-69440000 కాల్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. కాల్ చేసి టికెట్ మీద ఉన్న కండక్టర్ ఎంప్లాయ్ నంబర్ చెప్తే అతని కాంటాక్ట్ నంబర్ ఇస్తామని, దీంతో ఆ డబ్బులు రికవర్ చేసుకోవచ్చని తెలిపారు.

News July 6, 2024

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాది అరెస్ట్

image

భద్రాచలంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాదిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించారు. కొంతకాలం క్రితం ఓ మహిళ తన కుటుంబ వివాద పరిష్కారం కోసం కృష్ణ ప్రసాద్ అనే న్యాయవాదిని సంప్రదించింది. ఈ క్రమంలో అతను మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. న్యాయవాదిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.