India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు, మూడు లక్షల జరిమానాను విధిస్తూ మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరిరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. గుత్తుల శ్రీనివాసరావు వద్ద సుందరయ్యనగర్కి చెందిన చింతల రాజారాం 2015 సంవత్సరంలో 3 లక్షల అప్పుగా తీసుకుని డబ్బు కోసం తిరగ్గా చాలా రోజుల తర్వాత చెక్ను ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.
ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెం వద్ద రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.
కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి.
టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల స్విమ్మింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.హన్మంతరాజు తెలిపారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టును ఈ నెల 13, 14వ తేదీల్లో సికింద్రాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.
కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి.
ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ సహా ఏ శాఖ కార్యాలయంలో చూసినా.. ఎక్కడ నలుగురు ఉద్యోగులు కలిసినా బదిలీలపైనే చర్చ జరుగుతుంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్గా మూడు కేటగిరీల్లో బదిలీలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై 2, 3 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలోని 58 శాఖల్లో 7,053మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో కేటగిరీలో 40 శాతం మందికి బదిలీలు జరగనున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐతే కొంత కసరత్తు జరిగినా ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవలే పొంగులేటి పాలేరు నియోజకవర్గంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించగా.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్త మండలాల ఏర్పాటుకు సానుకూలత ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో 42 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, సుమారు 45 లక్షల వరకు మిర్చి బస్తాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. గత ఏడాది వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 92,273 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. మధిరలోని 13కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 12లక్షల బస్తాలు నిల్వ చేసినట్లు అంచనా. కనీసం రెండు లక్షల బస్తాలను కూడా విక్రయించకపోవడంతో 10 లక్షలకు పైగా బస్తాలు నిల్వ ఉన్నాయి.
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. లోకో పైలట్ సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.