India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒ ఫొటోగ్రఫీ
అంశం: పోలీస్ సేవలు, త్యాగాలు/ప్రజా రక్షణ
ఫొటోలు: గరిష్ఠంగా 3
ఫొటో సైజు: 10×8 ఇంచులు
✒ షార్ట్ ఫిలిం
వ్యవధి: గరిష్ఠంగా 3Mits
థీమ్: పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత/సమాజ రక్షణ.. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మీ పూర్తి వివరాలతో పాటు ఫొటోలు, షార్ట్ ఫిలిం(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలి.
పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలలో పాల్గొనాలని ఎస్పీ డి.జానకి యువత, విద్యార్థులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు పిలుపునిచ్చారు. పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిబింబించేలా తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆమె కోరారు. ఈ నెల 23వ తేదీ లోగా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో తమ రచనలు/చిత్రాలను సమర్పించాలని ఎస్పీ సూచించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం ఉందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతోనే తుమ్మల మంత్రి అయ్యారన్నారు. మాగంటి సునీత ఎమ్మెల్యే భర్త మరణిస్తే వచ్చిన ఉపఎన్నికలో ఆమె బిడ్డలు, కొడుకు ప్రచారం చేయడంపై అభ్యంతరం ఏంటని నిలదీశారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
MBNRలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీ.జానకి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
✒ పెండింగ్ FIRలు, ఛార్జ్షీట్లు పూర్తి చేయాలి
✒ NBW వారెంట్లు.. ప్రతి వారానికి నివేదిక సమర్పించాలి
✒ డ్రంక్ అండ్ డ్రైవ్.. ప్రత్యేక నిఘా పెట్టాలి
✒ మిస్సింగ్ వ్యక్తులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
✒ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి
పాలమూరు వర్శిటీలోని ఈనెల 16న 4వ స్నాతకోత్సవనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్శిటీ ఉపకులపతి(VC) ఆచార్య జిఎన్ శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారని, వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ రెడ్డి (Dr.మన్నే సత్యనారాయణ రెడ్డి)కి పాలమూరు వర్శిటీ (పీయూ) గౌరవ డాక్టరేట్ గవర్నర్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ రానున్నారన్నారు. ఈ వేడుకల్లో 12 పీహెచ్డీలు, బంగారు పతకాలు ప్రదానం ఉంటుందన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని నీటి సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని నగర పాలక సంస్థ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. నగర పాలక సంస్థ పరిధిలోని పైప్ లైన్ లీకేజిలు, తాగునీటి సరఫరా, పబ్లిక్ బోర్ రిపేర్, వీధి దీపాలు వంటి సమస్యలకు Toll free నంబర్ 7093911352 కాల్ చేయాలన్నారు. ఉదయం 09:00 నుంచి సాయంత్రం 06:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు.
మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ మేరకు 11 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో నేరుగా మాట్లాడి, బాధితులకు చట్టపరమైన సహాయం అందించడమే కాకుండా, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా, పారదర్శక విధానంలో చర్యలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు.
Sorry, no posts matched your criteria.