India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలురకు క్రికెట్ ఎంపికలు MDCA స్టేడియంలో నిర్వహించారు. SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనా వారిని ఈ నెల 15న నారాయణపేటలో జరిగే ఎంపికలలో పంపిస్తామన్నారు. పీడీలు వేణుగోపాల్, అబ్దుల్లా, మోహినుద్దీన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మిడ్జిల్ (దోనూరు)లో 12.7 డిగ్రీలు, గండీడ్ (సల్కర్పేట)లో 13.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర చలి ప్రభావంతో పాల దిగుబడి తగ్గిందని రైతులు తెలిపారు.

మహబూబ్నగర్లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

మహబూబ్నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్నగర్కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ ఎన్.బీ.రత్నం ఆదేశించారు. జిల్లా SP డి.జానకి ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం సైబర్ వారియర్స్తో సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో కేసులు పరిష్కరించే ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.