Mahbubnagar

News March 31, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

❤కనిపించిన నెలవంక.. రేపే రంజాన్❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤’రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం’❤ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు❤జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి❤సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు❤గద్వాల: చట్నీలో బల్లి❤బల్మూర్‌: జిల్లా స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు❤గ్రామాల్లో పంచాంగ శ్రవణం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News March 30, 2025

NGKL: దిగుబడి రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

image

మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనమోని శ్రీనివాసులు అనే రైతు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో మామిడి తోటను కౌలు చేస్తున్నాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News March 30, 2025

MBNR: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.

News March 30, 2025

MBNR: జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ సేవలు: శ్రీదేవి

image

జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ సేవల్ని శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి ప్రారంభించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు ఆర్అండ్బీ అతిథిగృహంలో జిల్లా జడ్జి పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఉన్నారు.

News March 30, 2025

MBNR: ఇక సిద్ధం అవ్వండి: కలెక్టర్

image

2025 యాసంగి ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఐకేపీ ద్వారా ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

News March 30, 2025

MBNR: అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి.. చివరికి!

image

అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. సీఐ నాగార్జున వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జహంగీర్, ఓ గిరిజన మహిళతో గత 10 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 రోజుల క్రితం ఆ మహిళ కుమారుడు జహంగీర్ అనే వ్యక్తిపై దాడి చేయగా గాయపడ్డాడు. మరుసటి రోజు మరణించాడు. కేసు నమోదు చేసి, సిద్ధార్థ అనే వ్యక్తిని రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.

News March 30, 2025

MBNR: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితం తీపి, చేదుల సమ్మేళనం అయినప్పటికీ కూడా అవన్నీ మన అభ్యున్నతికి పునాదులుగా నిలవాలన్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా పండగలు చేసుకోవాలని సూచించారు. రైతాంగానికి సంపూర్ణమైన ఫలితాలు దక్కి రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో పురోగతి సాధించాలని కాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.

News March 30, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

❤అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి:CM రేవంత్ రెడ్డి❤మన్యంకొండ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤కొడంగల్ ప్రజలు రాష్ట్రన్ని పాలించే శక్తిని ఇచ్చారు: సీఎం❤ఉగాది,రంజాన్ EFFECT.. రద్దీగా మారిన బస్టాండ్లు❤సింగపూర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ❤రేపే ఉగాది వేడుకలు❤NGKL:మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News March 29, 2025

అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: CM రేవంత్

image

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో అల్లాను కొలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన “రంజాన్ ఇఫ్తార్ విందు”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News March 29, 2025

MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యసేకరణ: కలెక్టర్

image

ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో యాసంగి ధాన్య సేకరణపై సమీక్షించారు. యాసంగి వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చొప్పున మద్దతు ధర ప్రకటించిందన్నారు. అంతేకాకుండా సన్న ధాన్యాన్నికి క్వింటాల్ కు రూ.500 బోనస్ ప్రకటించిదన్నారు.

error: Content is protected !!