India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (MDCA) రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. ఈనెల 24న మహబూబ్ నగర్లోని క్రికెట్ స్టేడియంలో (పిల్లలమర్రి) ఎంపికలు ఉంటాయని, 1.9.2011 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో హాజరు కావాలన్నారు.
#SHARE IT.

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు మహబూబ్నగర్లోని స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి హాజరయ్యారు. మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేణుగోపాల్, జగన్మోహన్ గౌడ్, బి.నాగరాజు, జి.రాఘవేందర్, మేరి పుష్ప, సుగుణ నాగమణి, రమణ, లక్ష్మీ నారాయణ క్రీడాకారులు పాల్గొన్నారు.

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్స్టాండ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్స్టాండ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ప్రజా భద్రత–పోలీసు బాధ్యత కార్యక్రమం’ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్లో సాధారణ మహిళలా నడుచుకుంటూ ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించింది. బస్టాండ్లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరి నుండైనా వేధింపులు, అసౌకర్యాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలన్నారు.

నవాబుపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య(40) కూతురు గౌతమి ఓ యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం తన పొలంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రీయ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సిఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈనెల 23వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో స్త్రీ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.శాంత కుమార్, కురుమూర్తి గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలన్నారు. పురుషులు బరువు 85 కిలోల లోపు, స్త్రీలు 75 కిలోల లోపు ఉండాలన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ఎంపీడీవోల యూనియన్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా (కోయిలకొండ) ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా (నవాబ్ పేట) ఎంపీడీవో జయరాం నాయక్, జనరల్ సెక్రటరీగా (MBNR) కరుణశ్రీ, కోశాధికారిగా (హన్వాడ) ఎంపీడీవో యశోదమ్మ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా (జడ్చర్ల) ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా(భూత్పూర్) ఎంపీడీవో ఉమాదేవి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.
Sorry, no posts matched your criteria.