Mahbubnagar

News July 8, 2024

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటమే: TWJF

image

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని TWJF రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య హెచ్చరించారు. MBNR ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో సోమయ్య పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై 6నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపడంలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు ఇల్లు, హెల్త్ కార్డు ద్వారా ఉచిత వైద్యం, పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

News July 8, 2024

NRPT: డిజిటల్ క్లాస్ రూమ్‌ ప్రారంభించనున్న మంచు లక్ష్మి

image

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి రేపు ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి రానున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్, వెణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు రత్నం రెడ్డి కలిసి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధం చేసి ఉంచారు.

News July 8, 2024

వనపర్తి: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. తప్పిన ముప్పు

image

వనపర్తి జిల్లా రేవల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఈ ఆస్పత్రిని 1999 సంవత్సరంలో నిర్మించారు. నాసిరకంగా కట్టడంతోనే పైకప్పు కోల్పోయిందని రోగులు అన్నారు. ఉన్నతాధికారుల స్పందించి ఆసుపత్రిని బాగు చేసి, రోగులకు సేవలు చేయాలని మండల కేంద్ర ప్రజలు కోరారు.

News July 8, 2024

ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలు వాట్సాప్ ద్వారా పంపాలి

image

NGKL: స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలను రూపొందించి వాట్సాప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణ ప్రచార గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News July 8, 2024

బల్కంపేట ఎల్లమ్మకు గద్వాల పట్టు చీర

image

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని నడిగడ్డ దైవం జమ్ములమ్మ ఆలయ ఛైర్మన్ గాయత్రి, సతీశ్ దంపతులు గద్వాల పట్టుచీర, సారె సోమవారం తెల్లవారుజామున అందజేశారు. ప్రతి ఏటా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జ్యోతి దంపతులు అమ్మవారికి పట్టుచీర సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నడిగడ్డ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

News July 8, 2024

మహబూబ్‌నగర్: నేటి నుంచి మొహర్రం

image

హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా ప్రతీక అయిన మొహర్రంను సోమవారం నుంచి జరుపుకోనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పీర్ల ఊరేగింపు చాలా ప్రత్యేకత ఉంది. జిల్లాలో పది రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు గ్రామ గ్రామాన జరుపుకుంటారు. నారాయణపేట జిల్లా కోయిలకొండ బీబీ ఫాతిమా సవారి తర్వాత ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ సవారీలు వైభవంగా జరుగుతాయి.

News July 8, 2024

MBNR: 14న జగన్నాథ రథయాత్ర మహోత్సవం

image

శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం పాలమూరులో ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఎం.యాదిరెడ్డి, రాజమల్లేశ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు పాలమూరు భక్త బృందం ఆధ్వర్యంలో కీర్తనలు, నృత్యాలు, భజనలు, కోలాటాలతో పరమాద్భుతమైన ఉత్సవంగా జరగనుందని చెప్పారు.

News July 8, 2024

కృష్ణ జింకలకు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు

image

కృష్ణా నదీతీర ప్రాంతాల్లోని రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వందలాది కృష్ణ జింకలు పంట పొలాల్లోకి ప్రవేశించి, రైతులు విత్తిన విత్తనాలతోపాటు మొలకెత్తిన మొక్కలను తినేస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.2.70 కోట్లు మంజూరు చేస్తూ, పరిపాలన అనుమతులు ఇచ్చింది.

News July 8, 2024

MBNR, NGKL జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

image

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

News July 8, 2024

కృష్ణా జలాశయాలు లేక రైతులు ఆందోళన

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఎకరాలకు కేఎల్ ద్వారా సాగు నీరందడంతో పాటు 300 గ్రామాలకు పైగా 500 చెరువులతో పాటు దుందుభీ నదిలో సైతం కృష్ణా జలాలతో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం నెలరోజులు పూర్తైనా ఇంకా కృష్ణా జలాశయాలు డెడ్జోరేజీలో ఉండటంతో పరివాహక ప్రాంత రైతులందరూ ఆందోళన చెందుతున్నారు.