Mahbubnagar

News July 8, 2024

MBNR: జిల్లాకు అవసరమైన ఎరువుల రెడీ

image

వానాకాలం సీజన్లో రైతులకు కావలసిన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు అవసరమైన 54,104 మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే బఫర్ స్టాక్ గోదాంకు తరలించామని తెలిపింది. గతేడాది వరకు అమల్లో ఉన్న విధానంపై సమీక్ష చేసి ఒకవైపు డీలర్లకు, మరోవైపు మార్క్ ఫెడ్కు చెరిసగం ఎరువులు కేటాయించేలా శాఖ చర్యలు తీసుకుంది.

News July 8, 2024

MBNR: ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం: మంత్రి

image

ఉమ్మడి జిల్లాకు MBNR- RRతోపాటు మిగతా అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, MLAలతో కలిసి ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పర్యాటక అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్‌పై చర్చించారు.

News July 8, 2024

MBNR: నేటి నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం-2024 కింద ఉపకార వేతనాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి ఆర్.ఇందిర తెలిపారు. www.telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో నేటి నుంచి ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీలను కలెక్టరేట్లోని మైనార్టీ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News July 8, 2024

MBNR: 9న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎమ్మెల్యేలతో పాటు అన్ని శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

News July 8, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

➤ఉమ్మడి జిల్లా అధికారులు, MLAలతో మంత్రి సమీక్ష
➤కొయిలకొండ: యాక్సిడెంట్‌‌లో అన్నదమ్ములు మృతి
➤జడ్చర్ల: ఆలయ కోనేరు పూడ్చివేతపై డీకే అరుణ ఫైర్
➤నిరంజన్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి ఫైర్
➤జిల్లా వ్యాప్తంగా MRPS ఆవిర్భావ వేడుకలు
➤అమనగల్లు ఎస్సై బదిలీ
➤బల్మూరు: ఫొటో గ్రాఫర్ ఆత్మహత్య
➤తిమ్మాజిపేట: కట్నం కోసం వేధింపులు.. భర్తపై కేసు

News July 8, 2024

మౌలిక సౌకర్యాల కల్పనే ద్వేయం: మంత్రి రాజనర్సింహ

image

ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలు, ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తూ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి మ్యాప్‌ను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సామాన్యుడు మెచ్చే విధంగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

News July 7, 2024

MBNR: ఉరేసుకుని ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య

image

ఫొటోగ్రాఫర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోలిశెట్టిపల్లి శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండల కేంద్రానికి చెందిన దుడ్డు యాదగిరి(38) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. పొలం యజమాని అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 7, 2024

డీ. శ్రీనివాస్‌కు ఎంపీ డీకే అరుణ నివాళి

image

ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి, దివంగత డీ. శ్రీనివాస్ స్మృతి సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

image

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన కోయిలకొండ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. బూరుగుపల్లికి చెందిన గొల్ల మోగులయ్య, లక్ష్మయ్య గ్రామం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా పారుపల్లి వద్ద RTC బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో RTC బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2024

KCR రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు: ఎమ్మెల్యే శంకర్

image

ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్ప చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. షాద్ నగర్‌లో అయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఏపీ మాజీ మంత్రి రోజా పెట్టిన రాగి సంకటి, నాటు కోడి పులుసు కేసీఆర్ తిన్నప్పుడు నిరంజన్ రెడ్డి ఎక్కడ పోయారని ఎద్దేవా చేశారు.