India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో G-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. MBNRలో 54 కేంద్రాల్లో 20,584 మంది, NGKLలో 32 కేంద్రాల్లో 9,731, గద్వాలలో 25 కేంద్రాల్లో 8,722, WNPలో 31 కేంద్రాల్లో 8,569, NRPTలో 13 కేంద్రాల్లో 3,994 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు.
-ALL THE BEST
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేతో పాటు డాటా ఎంట్రీ కూడా పూర్తయింది. దీంతో రిజర్వేషన్లు మార్పులు జరిగే అవకాశం ఉంది. జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. MBNR-441, NGKL-464, GDWL-255, WNPT-260, NRPT-280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ఆయా రాజకీయ నేతలు, కార్యకర్తలు కార్యకలాపాలు చేపట్టి, అందరిని పలకరిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు యాసంగిలో సాగునీరు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు 5 విడుదల వారీగా నీరు అందిస్తామని, మొదటి విడత ఈనెల 25న నీరు విడుదల చేస్తామన్నారు.
జీడీ ఫలితాల్లో నారాయణపేట జిల్లాకు చెందిన అవినాశ్(సీఆర్పీఎఫ్), రవి (బీఎస్ఎఫ్)లో ఉద్యోగం సాధించారు.వారు మాట్లాడుతూ.. దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామన్నారు. వారిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.
నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ – 2 పరీక్షల నేపథ్యంలో అధికారులు పరీక్ష విధులకు హాజరు కానుండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఇట్టి విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రాకూడదని సూచించారు.
❤లగచర్లకు వెళ్తా..ఎవరోస్తారో చూస్తా:డీకే అరుణ
❤ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్లు
❤గద్వాల:హైవే- 44పై గడ్డి ట్రాక్టర్ దగ్దం
❤మర్రి జనార్దన్ రెడ్డికు ఈడీ నోటీసులు
❤కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:SFI
❤గ్రూప్-2..144 సెక్షన్ అమలు:SPలు
❤మధ్యాహ్న భోజనం..అధికారుల ఫోకస్
❤గండీడ్:ప్రేమను ఒప్పుకోలేదని యువకుడి సూసైడ్
❤కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు
గుండెనొప్పి సమస్య ఉందని చెప్పిన రైతు హిర్యానాయక్కు సంకెళ్లువేసి తీసుకెళ్తారా అని MP DK అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్కు పోలీసులు బేడీలువేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లకు వెళ్తానని ఎవరడ్డొస్తారో చూస్తానని పేర్కొన్నారు.
లగచర్ల కేసులో రైతుకు బేడీల వ్యవహారంపై MBNR ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఆమె నేడు ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏం తప్పు చేశాడని రైతు హీర్యానాయక్కు సంకెళ్లు వేశారు..? అమాయకులపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, సంకెళ్లు వేయడం ఇదేనా మీ ప్రజాపాలన అంటే అని ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడుకోవడం చేతగాక అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు.
కొడుకు మందలించాడన్న మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న వనపర్తి జిల్లాలో జరిగింది. SI సురేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన కాశమ్మ(68) తరచుగా కల్లు తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈదే విషయంలో గురువారం మరోసారి గొడవ పడగా కాశమ్మ ఇంట్లోంచి వెళ్లిపోగా గ్రామ శివారులోని చెరువులో డెడ్బాడీ దొరికింది.ఆమె కొడుకు శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రస్తుతం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో పాలమూరు నుంచి పలువురి మంత్రి పదవి అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి బెర్తు దక్కుతుందా..? కామెంట్ చేయండి
Sorry, no posts matched your criteria.