India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి మండలం దత్తాయపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్, పెద్ద తండా మాజీ సర్పంచ్ కుమారుడు రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్లో చేరామని దేవేందర్, రాజు నాయక్ అన్నారు.
చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కిన ఘటన పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగింది.యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాలు.. జడ్చర్ల మండలం పెద్దఆదిరాలకు చెందిన బరిగల శివకుమార్(23), మల్కాజిగిరిలో ఉంటున్న పవన్(24)లు పాత నేరస్థులు. చౌటుప్పల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. విచారించగా చోరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు.
జడ్చర్లలోని పెద్దగుట్టపై పురాతన శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేత ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. అనుమతులు లేకుండా ఎలా కూల్చివేస్తారని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే TS-SET 2024 పరీక్షకు MAY4న నోటిఫికేషన్ వెలుబడిన విషయం తెలిసిందే. MAY14న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు…JULY8 వరకు ఏలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
✓అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణుడై ఉండాలి
✓పరీక్ష: AUGUST28,29,30,31
✓www.telanganset.org
జడ్చర్లలోని పెద్దగుట్టపై పురాతన శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేత ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. అనుమతులు లేకుండా ఎలా కూల్చివేస్తారని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు పోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే MLAలుగా గెలుపొందారు. గద్వాల, అలంపూర్ BRSకు చెందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు విజయం సాధించారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ బలం 13కు పెరగగా.. BRSకు బలం ఒకటికి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి APలో గద్వాల కాంగ్రెస్కు కంచుకోట.
పాలమూరు యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ కశాశాల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ 4వ సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 15 వరకు చెల్లించాలని పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ శనివారం తెలిపారు. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు కూడా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.
బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన మల్లేశ్(12) శనివారం తాతతో కలిసి గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లాడు. అక్కడ అన్నం తిని నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్లగా బాలుడు అందులో పడ్డాడు. అది గమనించని తాత.. చాలా సేపైనా బాలుడు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లగా బావిలో పడినట్లు గుర్తించాడు. మృతదేహాన్ని ఇంటికి చేర్చి అంత్యక్రియలు చేశారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే మైనార్టీ విద్యార్థులకు, సీఎం విదేశీ విద్యా పథకం కింద లబ్ధి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి గోపాల్ తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులు పొందిన వారు, పీజీలో 60 శాతం మార్కులు వచ్చి పిహెచ్ డి చేయాలనుకున్న వారు ఈ పథకానికి అర్హులని తెలియజేశారు. ఈనెల 8 నుంచి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
నల్లమలలో రెండేళ్లలో జంతువులు గణనీయంగా వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, సాగర్ డివిజన్లున్నాయి. ఇటీవల సాగర్లో పెద్దపులి, అరుదైన జాతి రాబందు కనిపించగా సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో దుప్పులు, జింకల ఆవాసాలకే పరిమితమైన అడవిలో తాజాగా శాకాహార, మాంసహార జంతువుల సంఖ్య పెరిగింది. దక్షిణాదిలోనే అరుదైన ఎలుగుబంట్లు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.