India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో 18న కార్తీక మాసం, మూడో సోమవారం పురస్కరించుకొని హరిహరులకు లక్ష పుష్పార్చన, జల దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు రాత్రి 8 గంటలకు కటకం కృష్ణస్వామి కుటుంబ సభ్యులు భక్తులకు ఉపాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సాంబార్లో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి(M) పైపాడుకు చెందిన వీరేశ్ కూలీ పనులకు కర్నూలు జిల్లా గోనెగండ్ల(M) ఎన్గోడ్కు వెళ్లారు. ఆ ఊరిలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. వీరేశ్ కుమారుడు జగదీశ్(6) ఫోన్తో ఆడుకుంటూ సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత జారిపోవడంతో సాంబారులో పడిపోయాడు. కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
షాద్ నగర్ శివారు ప్రాంతంలోని బుచ్చి గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బుచ్చి గూడకు వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కనే పడి ఉన్న బైక్ను చూసి రోడ్డుప్రమాదంలో మృతిచెందాడా లేదా ఎవరైనా చంపేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు.
ఈ నెల 17, 18న నిర్వహించే గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట జిల్లాలో 4200 మంది అభ్యర్థులకు 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్, 45 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, నలుగురు రూట్ ఆఫీసర్లు, 13 మంది చీఫ్ సూపర్డెంట్లు, 15 మంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారని తెలిపారు.
మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. 2023 బ్యాచ్కు చెందిన సీనియర్ మెడికల్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగు చేశారు. బాధితులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టి 10 మంది సీనియర్ విద్యార్థులను కాలేజ్ నుంచి సస్పెండు చేశారు.
HYD ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా నల్లమల ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఖాసిం నియామకమయ్యారు. దీంతో ఆయన స్వగ్రామమైన లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో సంబరాలు జరుపుకొన్నారు. తమ ప్రాంత వాసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడని, రాష్ట్ర ఏర్పాటులో ఓయూ కీలక పాత్ర వహించిందని, అంత గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఆయన ఎంపికవడం తమకు గర్వంగా ఉందన్నారు.
బిజినేపల్లి మం. మమ్మాయిపల్లిలో ఆర్మీ <<14606930>>జవాన్ శివాజీ<<>>(28) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. 2014లో ఆర్మీలో చేరిన శివాజీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నారు. వారం క్రితం సెలవులపై ఇంటికొచ్చిన శివాజీ బుధవారం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా రాత్రి ఉరేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
ప్రియదర్శని జూరాల ప్రాజెక్టులో తాజా సమాచారం ఇలా ఉంది. శుక్రవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సమార్థ్యం 9.357 టీఎంసీలకు గానూ 5.650 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ నాగేశ్వరరావు తెలిపారు. నెట్టెంపాడుకు 609, ఎడమ కాలువకు 957, కుడికాలువకు 368 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం అవుట్ ఫ్లో 2,500 క్యూసెక్కులుగా వెళ్తున్నట్లు తెలిపారు.
డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, గతంలో వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15లోగా ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్లైన్లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ,తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15లోగా ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్లైన్లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.