India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్ర లేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

✓నేటి ఉదయం 11 గంటలకు క్లాక్ టవర్ కూడలిలో బీఆర్ఎస్ నిరసన ✓ఉదయం 10 గంటలకు డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ✓జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో పర్యటించనున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ✓కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జడ్చర్లలో బీఆర్ఎస్ నిరసన ✓మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు నేడు సెలవు

మహబూబ్నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా మహాత్మా గాంధీకి నివాళులర్పించి.. అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

✔గద్వాల:రేపు వాహనాలకు వేలం:SP
✔సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
✔ఈవీఎంలు తనిఖీ చేసిన కలెక్టర్లు
✔ధన్వాడ:ZP పాఠశాలలో ఫుడ్ పాయిజన్
✔NRPT:MLA సంతకం ఫోర్జరీ..నిందితులు అరెస్టు
✔బిజినేపల్లి:FEB 9 నుంచి చౌడేశ్వరి దేవి ఉత్సవాలు
✔అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలి:సీపీఎం
✔బేటి బచావో- బేటి పడావో ఉత్సవాలు
✔నిర్లక్ష్యంగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు:MBNR కలెక్టర్
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

అడ్డాకుల మండలం రాచాల (నాగయ్యపల్లి)కి చెందిన యువకుడు గద్దెగూడెం చెన్నయ్య(24) అనుమానాస్పద స్థితిలో మంగళవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత చెన్నయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

పాలమూరు మున్సిపాలిటీని 60 డివిజన్లతో కార్పొరేషన్గా మారుస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 49 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీని 60కి పెంచడంతో సభ్యుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు డివిజన్కు ఎంత మంది ఓటర్లు ఉంటారో తెలియాల్సి ఉంది.

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్న మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన పరిధి చుట్టూరా ఐదు కిలోమీటర్ల మేర మద్యపాన నిషేదం విధిస్తున్నట్టు స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యపాన నిషేధం విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.

మహబూబ్నగర్ లోని నిరుద్యోగులకు వివిధ ప్రవేట్ సంస్థల్లో 250 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 30న జిల్లా ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సర్టిఫికెట్స్తో పట్టణంలోని పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.

మన్యం కొండ దేవస్థానం ప్రతిష్ఠను పెంచే విధంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసిలో మన్యంకొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,SP డి.జానకి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.