India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 11,12న HYDలోని హకీం పేటలోని స్పోర్ట్స్ స్కూల్లో హాజరుకావాలని డీవైఎస్ఓ సీతారాం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 26 మంది ఎంపికయ్యారని, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, కమ్యూనిటీ సర్టిఫికెట్, 10 పాస్ ఫొటోలు, రెండు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ZP ఛైర్పర్సన్ సరిత ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ నేతలు సైతం ఇటీవల గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.
పోలీస్ సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గద్వాల ఎస్పీ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నేర, న్యాయచట్టాలు 2023 ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నూతన చట్టాల ద్వారా అవకాశం కలిగిందన్నారు. ఇకపై నూతన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు
✒BRSకు షాక్.. కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే
✒ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✒పార్టీ మారిన MLAలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✒GDWL,NRPTలో రేపు భారీ వర్షాలు
✒పలుచోట్ల జగ్జీవన్రామ్ వర్ధంతి వేడుకలు
✒వనపర్తి: GO10 రద్దుచేయాలని అంగన్వాడీల రిలే నిరాహారదీక్షలు
✒సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి:SPలు
✒వన మహోత్సవంపై అధికారుల ప్రత్యేక ఫోకస్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు కాస్త ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. మీ మండలంలో వర్షం పడిందా.. కామెంట్ చేయండి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తున్నాయని శనివారం హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిత్వాలను చంపేసుకుని కాంగ్రెస్లో చేరుతున్నారని ఆయన మండిపడ్డారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేశవరావును రాష్ట్ర ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల బిఆర్ఎస్ నుండి కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. నేడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గులాబీ జెండా నీడలో కొనసాగుతున్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. శనివారం హైదరాబాదులోని గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నడిగడ్డలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లారు. గత 2 నెలలుగా నడిగడ్డలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో తెరపడనుంది.
Sorry, no posts matched your criteria.