India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్, ప్రియాంక దంపతులు జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి సాయికృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. భర్త పరిశ్రమలో విధులకు వెళ్ళగా ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అన్నారు.
గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికను వివాహం చేసుకోవడంతో Way2Newలో వచ్చిన “బడికి వెళ్లే బాలికకు వివాహం.. కేసు నమోదు” అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. MEO వెంకటయ్య, AMO శ్రీనివాస్ బాలికను మహమ్మదాబాద్ కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచారం ఇచ్చిన టీచర్లను అభినందిస్తూ.. పూర్తి నివేదికను జిల్లా విద్యాధికారికి అందిస్తామన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. MBNR, NGKL, WNPT, జడ్చర్ల, కోస్గి, మక్తల్, గద్వాల్, కొడంగల్ ప్రాంతాల్లో మురుగు నీరు రహదారులపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం ముగిసిన తర్వాత సిబ్బంది విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. వర్షం పోవడంతో పంటలకు కొంత ఆసరాగా నిలిచింది.
ఓ నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష రూ.5లక్షల జరిమానా రాజేంద్రనగర్ కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. NGKL జిల్లాకు చెందిన ఓ కుటుంబం శంషాబాద్లో పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, అక్కడే ఉంటున్న శివకుమార్ వారికి పరిచయమై ఓ బాలికను 2017 మే 18 నాందేడ్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పట్లో కేసు నమోదు అయింది. కోర్టు శిక్ష విధించింది.
నల్లమలను టూరిజం హబ్గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయం రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గాలో మంత్రులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం 75వ వన మహోత్సవంలో భాగంగా వారు మొక్కలు నాటారు.
షీ టీమ్స్తో మహిళలకు, విద్యార్థినిలకు భరోసా కల్పిస్తున్నామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురైతే షీ టీమ్ సభ్యులకు నేరుగా లేదా 8712670398 నంబర్ ద్వారా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చట్టరీత్య నేరమని హెచ్చరించారు.
డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని MBNR జిల్లాకలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. డ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలలో పర్యటించి ఆమె పరిశీలించారు. చెత్త, చెదారం రోడ్లపై, డ్రైనేజీలలో వేయరాదని కాలనీవాసులకు సూచించారు. మురుగునీరు ప్రవహించేలా డ్రైనేజీలను శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పలువురు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటనకు బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమల్లలో పర్యటించి ఇక్కడ నెలకొన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
MBNR:ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 8న జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాను ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బయోడేటా, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్,2 పాస్ ఫొటో సైజ్ ఫొటోలతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాల సెట్ తో హాజరు కావాలన్నారు.
Sorry, no posts matched your criteria.