India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన విషాద ఘటన రాజాపూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రేకులపల్లి గ్రామ పరిధిలోని ఒప్పితండాకు చెందిన శివ(15) గ్రామపంచాయితీలో విద్యుత్ బల్బును అమర్చుతున్నాడు. పక్కనే ఉన్న 11కేజీ వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి బాలుడిపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురవారం ఒకే ఒక్క జిల్లాలో మాత్రమే వర్షపాత వివరాలు నమోదు అయ్యాయి. వాటి వివరాలు ఇలా.. అత్యధిక వర్షపాతం నారాయణపేట జిల్లా కేంద్రంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్నగర్, జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT
ముగ్గురు కూతుళ్ల వివాహాలకు చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బొంరాస్పేట్ మండలం మెట్లకుంటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నర్సింహులు (62), మొగులమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు సంతానం. కూతుళ్ల పెళ్లిళ్లు చేసి నర్సింహులు అప్పులపాలవడంతో తరచూ భార్యకు చెప్పుకుని బాధపడుతుండేవాడు. ఈక్రమంలో పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) మూడో విడత దరఖాస్తుకు జులై 4 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మూడో విడత సీట్ అలాట్మెంట్ JULY 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT
జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని పోలీసులకు కొత్త చట్టాల అమలుపై శిక్షణా తరగతులు నిర్వహించామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇక నుంచి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలు తమ అనుమానాల నివృత్తి కోసం పోలీస్ శాఖను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
కోస్గిలో ఏర్పాటైన ఉమ్మడి జిల్లాలోని తొలి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డా.శ్రీనివాసులు పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్, సీఎస్సీ (డేటా, సీఎస్సీ(ఏఐ, ఎంఎల్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతో విద్యను అభ్యసించవచ్చని, ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. MBNR-42, NGKL-51, WNPT-49, NRPT-57, GDWL-64 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. త్వరలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.