Mahbubnagar

News July 4, 2024

ఈనెల 7న ఉమ్మడి జిల్లా అండర్-22 క్రికెట్ జట్టు ఎంపిక

image

HCA అండర్-23 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు ఈనెల 7న ఉదయం 10 గంటలకు పిల్లలమర్రి దారిలోని ఎండీసీఏ మైదానంలో ఎంపికలు చేపడుతున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. తెల్లని దుస్తులు, ఆధార్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, పదో తరగతి/ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని కోరారు.

News July 4, 2024

PUలో కొత్త కోర్సులు ఆగిపోయాయి !

image

పాలమూరు విశ్వవిద్యాలయ పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉపకులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ సహా కొత్త కోర్సులు ప్రారంభిస్తారని యువత భావించినా.. ఆశలు అడియాశలే అయ్యాయి. బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నా .. కొత్తగా వారిని తీసుకునే పరిస్థితి లేదు. ఉప కులపతి నియామకంపై స్పష్టత కొరవడింది. తొందరగా వీసీని అపాయింట్ చేయాలని విద్యార్థులు కోరారు.

News July 4, 2024

MBNR:  నేటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ

image

పదో రాష్ట్రస్థాయి అండర్-19 జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ గురువారం నుంచి ఈ నెల 6 వరకు నిర్వహిస్తున్నారు. పూర్వ పది జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులతో పాటు బుధవారం క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీల్లో ఎంపికైన 16 మంది పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు, రాష్ట్ర క్రీడల సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

News July 4, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయులు
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రవీందర్ కోరారు. http:///nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ లో వివరాలను నిర్ణీత నమూనాలో నిక్షిప్తం చేయాలని సూచించారు.

News July 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వట్టువర్లపల్లిలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కోస్గిలో 3.3 మిల్లీమీటర్ల, మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేటలో 3.0 మిల్లీమీటర్ల, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 3.0 మిల్లీ మీటర్లు, గద్వాల జిల్లా కోదండపూరులో 1.8 మిల్లీమీటర్లు నమోదయ్యింది.

News July 3, 2024

కొడంగల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బొంరాస్ పేట్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మెట్లకుంటకు చెందిన భైరం నర్సింలు అనే రైతు అప్పుల బాధ భరించలేక గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రావుఫ్ తెలిపారు.

News July 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ పాటించాలి:SFI,AISF ✒WNPT:’ACBకి చిక్కిన గోపాల్ పేట్ MRO’ ✒మహమ్మదాబాద్ లో నూతన కలెక్టర్ విజిట్ ✒NGKL:జాగ్రత్త..వ్యవసాయ పొలంలో చిరుత సంచారం ✒CM రేవంత్ రెడ్డికి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి లేఖ ✒యువత టెక్నికల్ రంగాలపై దృష్టి సారించాలి: మంత్రి జూపల్లి ✒కొత్త పాఠశాలలో చేరిన పలు ఎన్జీటీ టీచర్లు ✒ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలలో MPP,MPTC,ZPTCలకు ఘన సన్మానం

News July 3, 2024

ఏసీబీకి చిక్కిన గోపాల్ పేట్ MRO

image

లంచం తీసుకుంటూ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండల పరిధిలోని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం ఒకరి నుంచి MRO, జాయింట్‌ సబ్ రిజిస్ట్రార్‌ ఎస్.శ్రీనివాసులు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు‌ ACBని ఆశ్రయించారు. బుధవారం రూ. 8 వేల లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News July 3, 2024

NGKL: వ్యవసాయ పొలంలో చిరుత సంచారం

image

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని ఎంగంపల్లి తండా శివారులో వ్యవసాయ పొలంలో చిరుత పులి సంచరించింది. పరిసర రైతులు పొలంలో పాదముద్రలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. వారు ఎంగంపల్లితండాలో చిరుత పులి సంచరించిన వ్యవసాయ పొలాల్లో అధికారులు పాదముద్రలను సేకరించారు. చిరుత సంచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

News July 3, 2024

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12ప్రాంతాలు గుర్తించారు. నల్లమల పరిధిలో మన్ననూరు, సోమశిలలో వసతి, శ్రీశైలం ఆలయ సందర్శన, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్‌వాటర్‌లో బోటింగ్ ఉండనుంది. దీంతో స్థానికంగా ఉపాది, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.