India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ కుమార్తె మమత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో కేజీబీవీ లెక్చరర్గా, 2024లో గురుకుల జూనియర్ లెక్చరర్గా, ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించి గెజిటెడ్ పోస్ట్ను దక్కించుకుంది. భర్త సుకుమార్ గౌడ్ ప్రోత్సాహంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మిడ్జిల్ మండలం బోయిన్పల్లి జెడ్పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకూడదని సూచించారు.
✔రేపు పుష్ప-2 రిలీజ్.. మొదలైన హంగామా✔NGKL:నూతన డీఈవోగా రమేష్ కుమార్✔ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి✔NGKL: బైక్కు నిప్పు పెట్టిన దుండగులు✔అడ్డాకుల: ట్రాక్టర్, డీసీఎం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు✔గద్వాలలో రేపు చేనేత సంబరాలు✔కనీస వేతనం చెల్లించాలని ఆశ వర్కర్ల ధర్నా✔నియామక పత్రాలు అందుకున్న గ్రూప్-4 అభ్యర్థులు✔పలువురికి CMRF చెక్కులు అందజేత✔మధ్యాహ్న భోజనం.. తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు
నగల <<14783426>>వ్యాపారి హత్య<<>> కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వనపర్తి SP తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లాకు చెందిన శేషు(43) బంగారం, వెండి ఆభరణాలను హోల్సేల్ ధరలకు సరఫరా చేసేవాడు. బిజినేపల్లిలో గోల్డ్ షాపు నడుపుతున్న దీపక్మాలి(రాజస్థాన్)కు గత నెలలో కొన్ని నగలు ఇచ్చాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చుకునేందుకు శేషు వద్ద నగలు, డబ్బు కొట్టేయాలనుకున్నాడు. తమ్ముడితో కలిసి ప్లాన్ ప్రకారం NOV 21న శేషును హత్య చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నాగర్కర్నూల్, వనపర్తి, షాద్ నగర్, మహబూబ్నగర్, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.
భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బొంరాస్పేట్ మండలం మదన్ పల్లి తండాలో జరిగింది. ఎస్ఐ రావుఫ్ తెలిపిన వివరాలు.. తండాకు చెందిన లాలిబాయి, అమినా నాయక్ ఇద్దరు దంపతులు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దంపతుల మధ్య వివాదం నెలకొంది. మంగళవారం ఇద్దరు గొడవ పడగా భార్య గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
దివ్యాంగుల సంక్షేమ కోసం ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ అడిటోరియంలో ప్రపంచ దివ్యాంగులదినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమె సమాన అవకాశాలు, గౌరవంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏడాది పాలన పూర్తి చేసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు పూల బొకేతో శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. తప్పులు జరిగినప్పుడు విమర్శించినా స్వీకరిస్తానని, సమస్యలు ఉంటే తన దృష్టికి తెచ్చినప్పుడు తప్పనిసరిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో త్రిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి బస్సుల సంఖ్యను పెంచుతానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25) అక్క పద్మ(31)ను ఆమె కుటుంబంతో కుంట్లూర్కు బయలుదేరారు. కోహెడ-పెద్దఅంబర్పేట ఔటర్రింగ్లో లారీ అకస్మాత్తుగా నిలపడంతో వేగంగా వస్తున్న వీరి కారు ఢీకొంది. ఈప్రమాదంతో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.