India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
▶ఏసీబీకి పట్టుబడ్డ పాలమూరు డీఈఓ▶కుటుంబ సర్వే పేరుతో కాంగ్రెస్ డ్రామాలు: డీకే అరుణ▶NGKL:కుక్కల దాడి..20 మేక పిల్లల మృతి▶పర్యాటక అభివృద్ధికి చేయూత ఇవ్వాలి: మంత్రి జూపల్లి▶గద్వాల: బైక్ అదుపుతప్పి మహిళ మృతి▶మాడుగుల: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి▶కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు▶సర్వీస్ నుంచి DEOని డిస్మిస్ చేయండి:SFI,AISF▶ఈనెల 9,10న ఓటర్ నమోదు ప్రత్యేక డ్రైవ్
మహబూబ్నగర్ జిల్లాలో నేడు మాదిగల ధర్మ యుద్ధ మహాసభ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఆగస్టు1 సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లు రాష్ట్రాల వారీగా అమలు చేయాలని తీర్పు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలను వంచిస్తుందని అన్నారు. దీంతో మాదిగలు భవిష్యత్తులో మరింత మోసపోయే అవకాశముందని అన్నారు.
PUలో ఆర్చరి స్త్రీ, పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌతేజోన్(ఆలిండియా ఇంటర్ యూనివర్సిటి) టోర్నమెంట్ లో పాల్గొనేందుకు గురువారం ఎంపికలు నిర్వహించినట్లు PD డా. వై.శ్రీనివాసులు తెలిపారు. పురుషుల విభాగంలో విష్ణువర్థన్, భరత్ కుమార్, స్త్రీల విభాగంలో సుజాత, సునిత ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో NTR కాలేజ్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, కోచ్ జ్ఞానేశ్వర్, PDలు హరిబాబు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
కన్న కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన మాడుగుల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుడిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్కు ఇద్దరు కొడుకులు. వారంతా HYDలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దసరాకు సొంతూరికి వచ్చిన వారు 13న మద్యం మైకంలో గొడవపడ్డారు. పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకు సురేశ్ను తండ్రి నరికి చంపి పొలంలో పాతిపెట్టారు. నేడు మాడుగుల పోలీసులకు నిందితులు లొంగిపోవడంతో దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటూ మహబూబ్నగర్ DEO రవీందర్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వారి వివరాల ప్రకారం.. ఉపాధ్యాయునికి సీనియారిటీ విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు డీఈఓను సంప్రదించగా రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ డీఎస్పీ DEO ఇంట్లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
లవ్లో ఫెయిల్ అయిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన HYD అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. మహబూబ్నగర్ జిల్లాకి చెందిన సాయి కుమార్ (19) ఎలక్ట్రిషన్గా పని చేస్తూ చదువుకుంటున్నాడు. కాగా, కొద్ది రోజులుగా లవ్ ఫెయిల్ అయ్యి డిప్రెషన్లో ఉన్నాడని, అదే బాధతో ఉరేసుకున్నట్లు తెలిపారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని ఓ తండ్రి ట్రైన్ కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాలలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. మండలానికి చెందిన పరుశురాములు కూతురిని వినోద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడిని పలు మార్లు మందలించినా మారలేదు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన పరుశురాములు వెంకంపేట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.
✔ఘనంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
✔నేటి నుంచి ప్రారంభమైన కులగణన సర్వే
✔వేరుశనగ ధర గిట్టుబాటు కాకపోవడం: రైతులు
✔లండన్లో పర్యటిస్తున్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
✔మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాలమూరు నేతలు
✔రోడ్లపై ధాన్యాన్ని పోసి ప్రమాదాలకు కారణం కాకూడదు: SIలు
✔దామరగిద్ద:గుండెపోటుతో సీనియర్ అసిస్టెంట్ మృతి
✔తప్పులు లేకుండా సర్వే చేయండి:కలెక్టర్లు
Sorry, no posts matched your criteria.