India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచి ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనే చర్చ సాగుతోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ MLA వాకిటి శ్రీహరికి పదవి వస్తుందని టాక్. రాష్ట్రంలోనే ఈ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే, గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో బెర్త్ ఖాయమని వాకిటి వర్గీయులు అంటున్నారు. పదవి వస్తే జిల్లాలో తొలిసారి MLAగా గెలిచి మంత్రి అయిన ఘనత ఆయనదే.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 జులై 3న మండల పరిషత్ కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 719 మంది MPTCలు ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో సీసీ, డ్రైనేజీలకు కేటాయించారు. తమ డిమాండ్ల ఒక్కటీ నెరవేరలేదని, ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘునాథ్ పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,448 మంది ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సుమారు 2,413 మంది కొత్త స్థానాల్లో విధుల్లో చేరగా.. మరో 1,095 మంది ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులను నియమించే వరకు పాత స్థానాల్లోనే కొనసాగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, మారుమూల తండాలు, శివారు గ్రామాల్లో కొత్త ఉపాధ్యాయులు రాకపోవడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది.
ఇటీవల పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన పరీక్షలలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడి బుక్ అయిన విద్యార్థులు వ్యక్తిగతంగా మాల్ ప్రాక్టీస్ కమిటీ ఎదుట బుధవారం ఉదయం 11:30 గంటలకు హాజరుకావాలని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.palamuruuniversity.com సైట్ను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 81 ఉన్నాయి. వీటిలో 40,746 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలు 163 ఉన్నాయి. వీటిలో 29,297 మంది చదువుతున్నారు. మొత్తం 70వేల మందికి ఇద్దరే ఫిజికల్ డైరెక్టర్లు (వ్యాయామ అధ్యాపకులు) ఉన్నారు. ఒకరు జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో, మరొకరు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారు. PDలు లేకపోవడంతో క్రీడ రంగంలో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS) కింద తొలిరోజు 9 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో MBNRలో 1, GDWL 1, WNPT 1, NGKL 2,NRPT 4 కేసులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజు 30 నుంచి 40 కేసులు నమోదయ్యేవి. అలాంటి జులై 1న 9 కేసులే నమోదయ్యాయి. అటు నిత్యం చాలా కేసులు నమోదయ్యే MBNR గ్రామీణా PSలో ఒక్కటి నమోదు కాలేదు. కొత్త చట్టాల్లోని సెక్షన్లు క్షుణ్ణంగా పరిశీలించి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని WNP జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ప్రసవాలకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి పేదలు డబ్బులు వృధా చేసుకుంటున్నారని, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు మెరుగుపరచుకోవాలని సూచించారు.
నూతన చట్టాల ప్రకారం గద్వాల జిల్లా రాజోలి పోలీస్ స్టేషన్లో మొదటి కేసు నమోదైంది. రాజోలికి చెందిన బటికేరి శ్రీనివాసులు జీవితంపై విరక్తి చెంది సుంకేసుల డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని కొడుకు బసవరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై జగదీశ్ సెక్షన్ 195 BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం) ప్రకారం కేసు నమోదు చేశారు.
మహబూబ్నగర్లో సోమవారం సాయంత్రం రైలు కిందపడి తండ్రి, కూతురు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం.. ఏనుగొండలో ఉంటున్న శివానంద్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాలపైకి వెళ్లాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు వెళ్లిన చందనను రైలు ఢీకొట్టడంతో ఇద్దరు రైలు కిందపడి చనిపోయినట్లు తెలిసింది. వీరిద్దరు ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్గా, ల్యాబ్ టెక్నిషియన్గా చేస్తున్నారు.
నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అమ్రాబాద్ మండలం మన్ననూరులో మంత్రులు సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని అన్నారు. జాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.