Mahbubnagar

News December 1, 2024

వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: CM

image

మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్థాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ విజయేంద్ర బోయి, మధుసూదన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

News December 1, 2024

MBNR: పంచాయతీ ఎన్నికలు.. యువత గురి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై యువత ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం కూడా ఈసారి యువతకు అవకాశం కనిపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి. జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

News December 1, 2024

2009లో ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపితే జిల్లాకు ఏం చేశావు: సీఎం

image

ఉమ్మడి జిల్లాలో మీ ఊరు లేకపోయినా 2009లో ఎంపీగా గెలిపించి ఢిల్లీ పంపితే వలసల జిల్లా పాలమూరుకు ఏం చేశావు కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాడి పంటలు పండాల్సిన పాలమూరును ఎడారి చేసి వలసలు ప్రోత్సహించిన ఘన చరిత్ర కేసీఆర్ అని మండిపడ్డారు.

News December 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔రేపటి నుంచి ఓపెన్ డిగ్రీ,PG తరగతులు
✔CM రాకతో.. జనసంద్రమైన పాలమూరు
✔కొడంగల్లో సైన్స్ సెంటర్.. ఉత్తర్వులు జారీ
✔అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు: SIలు
✔వనపర్తి:రేపు మహాలక్ష్మి యాగం
✔కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: CITU
✔విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:PDSU,SFI
✔ట్రాక్టర్ నడిపిన సీఎం రేవంత్ రెడ్డి
✔ మల్దకల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

News November 30, 2024

MBNR: ఏడాదికి 20వేల కోట్లు ప్రత్యేకంగా ఇవ్వండి: సీఎం

image

పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావడానికి ప్రత్యేకంగా ప్రతి ఏడాది రూ.20వేల కోట్లు ఇవ్వాలని సహచర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతు పండుగ బహిరంగ సభలో ప్రసంగించారు. పాలమూరు జిల్లా రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తారని చెప్పారు.

News November 30, 2024

కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అయింది: సీఎం

image

కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రూ.లక్ష రెండు వేల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతో రైతులు దేశంలో ఎక్కడలేని విధంగా వరి ధాన్యం పండించారని అన్నారు.

News November 30, 2024

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అన్న పెద్దమనిషి కేసీఆర్ కాదా: సీఎం

image

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని రైతులను కించపరిచిన పెద్దమనిషి నేడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వరి సాగు చేస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నామని అన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ రైతుల ఖాతాలలో పడుతుంటే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో గుబులు లేస్తుందని అన్నారు.

News November 30, 2024

70 ఏళ్ల తర్వాత మీ రైతుబిడ్డ సీఎంగా అయ్యాడు: రేవంత్ రెడ్డి

image

70 ఏళ్ల తర్వాత పాలమూరు రైతుబిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడని, మీ అందరి ఆశీర్వాదంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీఎంగా కావడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. సీఎం బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించే బాధ్యత తన మీద ఉన్నదని అన్నారు. సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేశారు.

News November 30, 2024

MBNR: రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం: మంత్రి తుమ్మల

image

పదేళ్ల BRS పాలనలో ఛిన్నాభిన్నమైన తెలంగాణను CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. MBNRసభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఆగమైందని, ఏడాదిగా బాగు చేస్తున్నామని తెలిపారు. ‘అన్నా.. కష్టాలున్నా.. అప్పులున్నా.. కడుపు కట్టుకోనైనా సరే రైతు రుణమాఫీ చేద్దామని’ సీఎం అన్నారని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు.

News November 30, 2024

దొరల గడీలను కుప్ప కూల్చి ప్రజాపాలన తెచ్చిన రోజు ఇది: సీఎం

image

నవంబర్ 30, 2023న గడీల పాలనను కుప్ప కూల్చివేసి ప్రజా పాలన తీసుకువచ్చిన రోజు మనందరికీ పండుగ రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాలమూరులో రైతు కుటుంబంలో పుట్టిన తనకు ఇక్కడి ప్రజలు పడ్డ కష్టాలు అన్ని తెలుసునని సీఎం అన్నారు. అచ్చంపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ ప్రాంతం నుంచి అనేకమంది వలస వెళ్లేవారని గుర్తు చేశారు.