India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని 108 అంబులెన్స్లో మెడికల్ టెక్నీషియన్స్ కోసం ఈ నెల 9న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ రవికుమార్ తెలిపారు. BSc-BZC, BSC Nursing, ANM, GNM, B-Pam, D-Pam, DMLT, MLT ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. 9న ఉ:10:00 నుంచి మ:3:00 వరకు జడ్చర్ల MPDO కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.
రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ చైర్మన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ చైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఫీజులు చెల్లించాలని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య తెలిపారు. ఇవాళ నుంచి 26 వరకు ఎలాంటి అదనపు రుసుముల లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఆయన అన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కళాశాలలో వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.
లండన్ నగరంలో 7, 8 తేదీలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వెళ్లారు. నల్లమలలోని ప్రకృతి పర్యటక ప్రాంతాలపై, కృష్ణానది పరవళ్లు, పర్యాటకులను ఆకర్షిస్తాయని వివరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి ఈ నెల 8 తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ట్రాన్స్జెండర్ని యువకులు అపహరించే ప్రయత్నం చేసిన ఘటన జడ్చర్ల బస్టాండులో జరిగింది. సోమవారం రాత్రి కొందరు యువకులు ట్రాన్స్జెండర్ను యువతి అనుకొని మభ్య పెట్టి బైక్పై ఎక్కించుకుని కొత్తపల్లి ఇసుక క్వారీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన కొందరు వారిని అడ్డుకుని 100 సమాచారం అందించారు. పోలీసులకు అక్కడికి చేరుకుని ఆమె వివరాలు అడగగా నల్గొండ జిల్లాకి చెందినట్లుగా తెలిపింది. యువకులు పరారయ్యారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేసి సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వెయ్యనున్నారు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల వివరాలు.. మోతీ ఘనపూర్కు చెందిన ఖలీల్(32) కుటుంబ సభ్యులతో గొడవపడి ఫిర్యాదు చేసేందుకు పీఎస్కు వెళ్లాడు. కాసేపటికి బయటికి వెళ్లి ఒంటికి నిప్పంటించుకుకొని పీఎస్లోకి రాగా హోంగార్డ్ రాముకి గాయాలయ్యాయి. ఖలీల్, హోంగార్డులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లండన్లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ స్టాల్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ప్రపంచ నలుమూలల విస్తరించిందని తెలిపారు. లండన్లో స్టాల్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు.
✔GET READY..రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ✔11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ✔NRPT:చిరుతపులి దాడిలో మేకలు మృతి ✔MBNR:పీఎంశ్రీకి 119 పాఠశాలలు ఎంపిక ✔కడ్తాల్: మహిళ మృతదేహం లభ్యం ✔MBNR:ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ప్రారంభమైన రాజకీయ వేడి ✔GDWL:సెల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఉత్తమ ప్రతిభ ✔ప్రతి ఇంటిపై స్టిక్కర్లు అతికించాలి:కలెక్టర్లు ✔కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్:AITUC
Sorry, no posts matched your criteria.