India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు 143 కోట్లు అవసరం ఉందని రోడ్ల భవనాల శాఖ అధికారులు అంచనా వేశారు. టెండర్లు పిలవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరు అవుతాయని, భావిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ పూర్తిగా కోలుకోవడంతో నిమ్స్ నుంచి డిశ్ఛార్జి చేశారు. కొందరి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గత నెల 23న నిమ్స్లో చేర్చారు. 8 రోజులు చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆమె వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు.
అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ అభయారణ్యంలో జూలై 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మన్ననూర్ ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ, వన్య ప్రాణుల వనగడను దృష్టిలో ఉంచుకొని అభయారణ్యంగా గుర్తించి ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడరాదన్నారు. వాటర్ బాటిళ్లు, బిస్కెట్ కవర్లు, పాలిథిన్ కవర్లు పడేయవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆరుతడి పంటలైన పత్తి, జొన్న, మొక్క జొన్న, కంది పంటలకు ఊరట లభించింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల నుంచి వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వర్షం పడకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉండగా.. ఈ వాన ఊపిరి పోసింది. ఈ వర్షంతో 15 రోజుల వరకు పంటలకు భరోసా దక్కినట్లేనని రైతులు అంటున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే 1,725 మంది SAలకు బదిలీ అయ్యారు. మరో 1,975 మంది SGTలు SAలుగా, 229 మంది SAలు GHMలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3,929 మంది ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఎస్జీటీల బదిలీలతో మరో రెండు వేల మందికి స్థాన చలనం కలగనుంది. ఒకే పాఠశాలలో 8ఏళ్ల పాటు పనిచేసిన SGTలు విధిగా మరో పాఠశాలకు బదిలీ కానున్నారు.
@ ఉమ్మడి జిల్లాలో నేటి నుండి కొత్త చట్టాలు అమలు..
@ మక్తల్: ఉచిత కంటి వైద్య శిబిరం.
@ షాద్నగర్: నూతన బస్సులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే.
@ దామరగిద్ద, జడ్చర్లలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ.
@ ఐజ సింగిల్ విండో సమావేశం.
@ మక్తల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
@ కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహవిష్కరణ.
@ పెద్దకొత్తపల్లి: తైబజార్ వేలం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల్లో పోస్టులను చూపించకుండా దాచిపెట్టి “అప్రకటిత రేషనలైజేషన్” చేశారని PRTU, TRTF ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని పోస్టులను కేటాయించలేదని వారు ఆరోపించారు. బదిలీలకు కేవలం ఒక్కరోజు గడువు ఇచ్చి.. హడావుడిగా ముగించడం సరికాదని అన్నారు. ఆప్షన్ల గడువు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన చట్టాల అమలుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. నెల రోజులుగా 14 బ్యాచ్లుగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయటంతో పాటు తీర్పులు వెలువడనున్నాయి.
గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాల నేపథ్యంలో గొర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి, రెండో విడతల కింద ఉమ్మడి జిల్లాలో 70,688 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల వద్ద గొర్రెల సంఖ్య తగ్గిందని అధికారులు గుర్తించారు. త్వరలో లెక్కలు తేల్చనున్నారు.
నేటి నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతిఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నూతన చట్టాలపై జిల్లా పోలీసులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో SP పాల్గొని మాట్లాడారు. భారత న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అవసరాన్నిబట్టి ప్రజా భద్రత కోసం చట్టాలను రూపకల్పన చేయడం జరిగిందని, కొత్తచట్టాలపై విడతలవారీగా శిక్షణ నిర్వహించామన్నారు.
Sorry, no posts matched your criteria.