Mahbubnagar

News November 30, 2024

MBNR: రూ.2 లక్షల లోపు రుణమాఫీకి సిద్ధం.. !

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసేందుకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు సమస్యలతో రుణమాఫీ కానీ 40,759 మంది రైతులకు గాను రూ.381.56 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా అత్యధికంగా NGKL జిల్లాలో 11,960, MBNR-8462, GWL-8262, WNPT-5,086, NRPT-6989 రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. వీటిని నేడు రైతు పండుగ సభలో సీఎం ప్రకటించనున్నారు.

News November 30, 2024

MBNR: సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..

image

నేడు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ‘రైతు పండగ’కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 3:30కి భూత్పూరు చేరుకుంటారు. 4:15 నిమిషాలకు సభాస్థలికి చేరుకొని 4:30గంటలకు ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు.

News November 30, 2024

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అన్ని సమస్యలే..!

image

ఉమ్మడి జిల్లాలోని 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాల వల్ల మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.

News November 30, 2024

MBNR: సమీక్ష సమావేశం.. హాజరైన మంత్రులు, MLAలు

image

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అండ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన సాగునీటి, పౌరసరఫరాల, వ్యవసాయసాయ రంగాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు , ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News November 29, 2024

రుణ రేపు.. మాపు అంటూ కాలక్షేపం చేశారు: మంత్రి ఉత్తమ్

image

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో రైతులను చాలా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రుణ మాఫీ విషయంలో రేపు.. మాపు అంటూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ఇంకా కొందరికి రుణమాఫీ కావాల్సి ఉందని అన్నారు.

News November 29, 2024

షాద్‌నగర్: రైతు పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

image

ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు రైతు పండుగలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు,లాభాదాయకమైన వ్యవసాయ పద్ధతులు, వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

News November 29, 2024

MBNR: రోడ్ల నిర్మాణానికై కేంద్ర మంత్రికి ఎంపీ అరుణ వినతి

image

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు జాతీయ రహదారుల అనుసంధానం, సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి 4 లేన్స్, 6లేన్స్ రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదనలతో ఉన్న వినతులను కేంద్రమంత్రికి అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపింది.

News November 29, 2024

రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా: హరీశ్ రావు

image

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్‌ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.

News November 29, 2024

నాగర్ కర్నూల్: మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థుల అస్వస్థత

image

మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని శుక్రవారం నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టమాటా రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు వైద్యులను పాఠశాలకు పిలిపించి అక్కడే చికిత్స అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 29, 2024

బాలానగర్ సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయండి: SKLTSHU

image

బాలానగర్ మండల సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మండలంలో పుట్టిన సీతాఫలం ఇతర జిల్లాల్లో విస్తరించింది. ఈ చెట్టుకు అందమైన ఆకులు, గుండ్రని ఆకారంలో రుచికరమైన పండ్లు ఉంటాయి. ఈ సీతాఫలాలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధత రక్షణ కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.