India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NGKL మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలాలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్గా సేవలందించారు. 2009లో NGKL నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపోందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో BRSలో చేరి ఓడిపోగా.. 2019లో టికెట్ రాలేదు. 2023లో కాంగ్రెస్లో టికెట్ రాకపోవడంతో BSP కొనసాగుతున్నారు.

వివాహిత ఉరేసుకున్న ఘటన కొల్లాపూర్ మం.లో జరిగింది. కుటుంబీకుల వివరాలు.. కుడికిల్లకు చెందిన భవాని(20)కి 3 నెలల క్రితం పెబ్బేరు మ. పాతపల్లి వాసి రాజేందర్తో పెళ్లైంది. శుక్రవారం పుట్టింటికి వచ్చిన భవాని.. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో స్థానికుల సహాయంతో భర్త పగలగొట్టారు. ఫ్యాన్కు వేలాడుతున్న ఆమెను కొల్లాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఆయా జిల్లాల పోలీసులు అల్టర్ చేశారు. ఊరెళ్లేవారు విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దని బ్యాంకు లాకర్లో దాచుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సూచించారు. ఇంటికి తాళం వేసేటప్పుడు డోర్ కాటన్ అడ్డంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరుగు పొరుగు వారికి చెప్పాలని, సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో గండీడ్, కోస్గి, కొత్తకోట, ధన్వాడ, వెల్దండ, కోడేరు, ఖిలా ఘనపూర్, పెబ్బేరు మండలాల్లో ఆదర్శ పాఠశాలలో ఉండగా.. 2025-26 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 6వ తరగతికి నేరుగా..7,8,9,10వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా నిధి పథకానికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రూ.4,95,211ల చెక్కు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం సాయంత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ రుణం తీర్చుకునే ఆకాశం వచ్చిందని అన్నారు.

✓ విలువైన వస్తువులు, నగదు, నగలు ఇంట్లో ఉంచకపోవడం మంచిది.✓ ఊరికి వెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టకండి.✓ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా గదిలో లైటు వేసి ఉంచండి.✓ నమ్మకమైన వ్యక్తిని వాచ్మెన్గా పెట్టుకోవడం మంచిది.✓ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటికి మొబైల్ అనుసంధానం చేసుకోవాలి.✓ ఇంటితాళం బయటకు కనిపించకుండా చూసుకోండి.✓ ఊరికి వెళ్లేముందు పోలీస్ స్టేషన్లో తెలపడం ఉత్తమం.

కురుమూర్తి స్వామి దేవాలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. దేవాలయ చరిత్రలో తొలిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. తొలిసారి నిర్వహించిన స్వామి వారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద శుక్రవారం రాత్రి <<15122838>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు, లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి, క్షతగాత్రులను MBNR, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

❤MBNR-2,62,311
❤కొడంగల్-2,46,526
❤జడ్చర్ల-2,24,477
❤దేవరకద్ర-2,40,980
❤నారాయణపేట-2,38,629
❤గద్వాల-2,58,460
❤వనపర్తి-2,75,059
❤మక్తల్-2,48,105
❤కొల్లాపూర్-2,41,460
❤షాద్ నగర్-2,43,260
❤కల్వకుర్తి-2,46,523
❤అచ్చంపేట-2,49,620
❤నాగర్ కర్నూల్-2,37,422
❤అలంపూర్-2,41,522
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 34,54,354 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 17,10,989, మహిళలు 17,43,276, ఇతరులు 89 మంది ఉన్నారు.
Sorry, no posts matched your criteria.