Mahbubnagar

News June 29, 2024

BREAKING: నాగర్ కర్నూల్: డివైడర్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

నాగర్ కర్నూల్: భర్తను చంపిన భార్య

image

భర్తను భార్య కిరాతకంగా బండరాయి, కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు. శివశంకర్‌(35) హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శివలీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. శివశంకర్‌కు తన ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. ఆవేశానికి గురైన శివలీల, శివశంకర్‌ తలపై బండరాయి, కర్రతో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు

News June 29, 2024

MBNR: ‘పది’ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి!

image

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,020 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,238 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. MBNR-70.21శాతం, GDWL-87.80 శాతం, WNPT-95.36శాతం, NGKL-93.40 శాతం, NRPT-76.73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

News June 29, 2024

షాద్‌నగర్ ఘటనలో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ

image

షాద్‌నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News June 29, 2024

బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రగతిపై బ్యాంకు అధికారులతో చర్చించారు. ఈ ఏడాది పీఎంఈజీపీ కింద యూనిట్లు ఇవ్వడానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.

News June 28, 2024

షాద్‌నగర్ పేలుడు.. మృతులు వీరే

image

షాద్‌నగర్ పరిధిలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన నితీష్ కుమార్(22), రామ్ సెత్(24), బీహార్‌కు చెందిన రాంప్రకాష్(31), చిత్తరంజన్(31), ఒడిషాకు చెందిన రతికాంత్ అనే కార్మికులు మృతి చెందినట్లు ఆర్డీవో మాధవరావు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

News June 28, 2024

‘ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు”

image

√కొడంగల్ అభివృద్ధిపై NRPT,VKB జిల్లా కలెక్టర్ల సమీక్ష.
√ SDNR:భారీ పేలుడు.. ముగ్గురు మృతి.
√ACPT:మాజీ మంత్రి హరీష్ రావుకు అచ్చంపేట MLA సవాల్.
√NGKL:ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి జూపల్లి.
√MBNR:ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే: పీయూ OSD.
√NGKL: భర్తను చంపిన భార్య.
√ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా EX.PM పీవీ నరసింహారావు జయంతి వేడుకలు.
√SDNR:పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా.

News June 28, 2024

SDNR: పరిశ్రమలో పేలుడు.. భయానక దృశ్యాలు

image

షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాసు కంపెనీలో సంభవించిన భారీ ప్రమాదంలో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. కంప్రెషర్ పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కచోట ఎగిరిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మిక నేత తెలిపారు. ఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందగా పలువురు షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News June 28, 2024

ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే: ఓఎస్డీ

image

విద్యార్థి దశ నుండి ప్రణాళిక బద్ధంగా చదవడం ద్వారా విజయం మీదే అని పీయూ ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు స్టడీ సర్కిల్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలలో ఎక్కడా లేని విధంగా తమ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

NGKL:భర్తను చంపిన భార్య.. కారణం అదే !

image

నాగర్‌కర్నూల్‌లో భర్తను భార్య కొట్టి చంపిన విషయం తెలిసిందే. సీఐ కనకయ్య తెలిపిన వివరాలు.. 15వ వార్డుకు చెందిన శివశంకర్, శివలీల దంపతులు. శివ హమాలీ కూలీ. కాగా భార్య వివాహేతర సంబంధంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇద్దరు గొడవ పడగా పక్కనే ఉన్న రాళ్లు, కర్రలతో కొట్టి భర్తను చంపేసింది. తెల్లవారుజామున స్థానికుల సమాచారంతో పోలీసులు శివలీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.