Mahbubnagar

News June 27, 2024

NGKL: పెరిగిన పులుల సంచారం

image

కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అడవి పచ్చదనం పెరగడంతో పులుల సంచారం పెరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా, కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16దాకా సంచరిస్తున్నాయి. AP నుంచి TG సరిహద్దులోని అడవి ప్రాంతాల్లో పులులు వస్తున్నాయని, పులుల సంచారం పెరగడంతో అందుకు తగ్గుట్టుగా వసతులు కల్పిస్తున్నామని కొల్లాపూర్ రేంజి అధికారి శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.

News June 27, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభం అయ్యాయని కానీ.. 35శాతం స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ ను రెన్యువల్ చేయలేదని అన్నారు. దీంతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళుతున్నారని, వెంటనే సమస్య పరిష్కారం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

News June 27, 2024

NGKL: పెరిగిన పులుల సంఖ్య

image

కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అడవి పచ్చదనం పెరగడంతో పులుల సంచారం పెరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా, కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16దాకా సంచరిస్తున్నాయి. AP నుంచి TG సరిహద్దులోని అడవి ప్రాంతాల్లో పులులు వస్తున్నాయని, పులుల సంచారం పెరగడంతో అందుకు తగ్గుట్టుగా వసతులు కల్పిస్తున్నామని కొల్లాపూర్ రేంజి అధికారి శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.

News June 27, 2024

రాజాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రాజాపూర్ మండల పరిధిలోని నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. కుచర్కల్ గ్రామానికి చెందిన యాదయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.

News June 27, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో పత్తి, వరిలదే అగ్రస్థానం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి, వరిలదే అగ్రస్థానంలో ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. నారాయణపేటలో 4,23,800, నాగర్ కర్నూల్ 5,62,299, గద్వాల 3,40,677, మహబూబ్ నగర్ 3,21,512, వనపర్తిలో 2,35,250 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిలో పత్తి, వరి పంటలదే అగ్రస్థానం. మిగతా కంది, జొన్నలు, పెసర, వేరుశనగ, అముదం, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తుంటారన్నారు.

News June 27, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కుల్కచర్ల మం. ఇప్పయిపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. MBNR జిల్లా నవాబ్‌పేట మం. కిషన్‌గూడకు చెందిన మల్లేశ్(24) బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి బైకుపై ఇప్పయిపల్లకి వెళ్లాడు. తాటికల్లు తాగి ఇంటికి వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 27, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా వెలుగొండలో 16.0 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తిమాన్దొడ్డిలో 4.5 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 0.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 27, 2024

MBNR: జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతులు ఇలా..

image

ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల HM,తెలుగు,హిందీ,జీవ,గణిత,భౌతిక,సాంఘికశాస్త్రం,ఆంగ్లం,వ్యాయామ విద్య,ప్రత్యేక విద్య తదితర సబ్జెక్టుల్లో SGTలు SAగా పదోన్నతి పొందనున్నారు.MBNR-450,NGKL-498,
GDWL-266,WNPT-394,NRPT-242 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు SAలుగా పదోన్నతులు పొందనున్నారు.ఇప్పటికే ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు.వెబ్ ఆప్షన్లు పరిశీలించి రాష్ట్ర అధికారులు కొత్త పాఠశాలలను కేటాయించనున్నారు.

News June 27, 2024

పోక్సో కేసులో నేరస్థుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

image

పోక్సో కేసులో నేరస్థుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లాజడ్జి ఎండీ రఫీ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాలు.. శంషాబాద్‌‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన నరసింహ నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలికను ప్రేమపేరుతో వంచించాడు. వెళ్లి చేసుకుంటానని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో 2023 సెప్టెంబర్ 16న ధన్వాడ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

News June 27, 2024

అచ్చంపేట: లింక్ క్లిక్ చేస్తే అంతే!

image

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి రూ. 96 వేలు పోగొట్టుకున్నాడు. అచ్చంపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన బిచ్యానాయక్ ఫోన్‌కు క్రిడెట్ కార్డు పోరుతో ఓ లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 96 వేలు మాయమయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.