Mahbubnagar

News November 25, 2024

MBNR: జాగ్రత్త.. తప్పులు ఉండొద్దు: డిప్యూటీ సీఎం

image

కుల గణన కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఇలాంటి తప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ నుంచి వీసీ నిర్వహించి ఆయన ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అందుబాటులో లేని వాళ్లకు ఫోన్ చేసి సర్వే గురించి వివరించి సమాచారం తెలుసుకోవాలని, ఫుడ్ పాయిజన్ విషయంలో ఆరా తీశారు. ఆహారం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, డాటా ఎంట్రీలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

News November 25, 2024

ఉమ్మడి పాలమూరులో కుల గణన సర్వే వివరాలు ఇలా!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుల గణన సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఆదివారం నాటికి మహబూబ్ నగర్-99.8%, నాగర్ కర్నూల్-96%, నారాయణపేట-99.5%, గద్వాల్, వనపర్తి జిల్లాలో దాదాపు పూర్తయినట్లే. ఇంటిదగ్గర అందుబాటులో లేని వాళ్లకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేని వాళ్లు ఆయా మండలాల ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలన్నారు.

News November 25, 2024

గత ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు: జూపల్లి

image

BRS ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు జరిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం MBNR కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

News November 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔30న పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✔TCC కోర్సు.. ఫీజు చెల్లించండి:DEOలు
✔రేపు PUలో హ్యాండ్ బాల్ ఎంపికలు
✔29న దీక్షా దివస్..వైస్ ఇన్‌ఛార్జిల నియామకం
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔కొనసాగుతున్న కుల గణన సర్వే
✔సామాజిక‌ సేవలో రెడ్డిల పాత్ర మరువలేనిది: డీకే అరుణ
✔రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవ సభలు:మంత్రి జూపల్లి
✔MBNR:’ప్రజాపాలన విజయోత్సవ’ సభ..ఏర్పాట్లపై ఫోకస్
✔26న సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు

News November 24, 2024

MBNR: దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జీలుగా మన జిల్లా నాయకులు

image

ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జీలుగా మహబూబ్ నగర్ నేతలను నియమించారు. వికారాబాద్ జిల్లా ఇన్‌ఛార్జిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లాకు MBNR మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ బండ ప్రకాష్ లను నియమించింది.

News November 24, 2024

MBNR: 29న దీక్షా దివస్, వైస్ ఇన్‌ఛార్జిల నియామకం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఆయా జిల్లాలకు వైస్ ఇన్‌ఛార్జి లాను బీఆర్ఎస్ నియమించింది. MBNR జిల్లాకు కేమ మల్లేష్, NRPT ఎమ్మెల్సీ కోటి రెడ్డి, GDWL మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రెడ్డి, WNP మాజీ జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, NGKLకు మాజీ ఎమ్మెల్సీ విజయ సింహ రెడ్డిలను నియమించారు.

News November 24, 2024

ఈ నెల 30న మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్

image

ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. మంత్రి జూపల్లి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

News November 24, 2024

MBNR: చివరి దశకు సర్వే.. కుటుంబాలు ఎన్నంటే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే చివరి దశకు చేరింది. మొత్తం MBNR-2,41,853, NGKL-2,50,596, GDWL-1,67,886, NRPT-1,55,999, WNPT-1,54,793 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 180 ఇళ్లు కేటాయించారు. ఈ నెల 27 వరకు సమగ్ర సర్వే 100% పూర్తి చేస్తామని ఆయా జిల్లాల అధికారులు తెలిపారు.

News November 24, 2024

MBNR: TCC కోర్సు.. ఫీజు చెల్లించండి!!

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు తేదీలు ఖరారు అయ్యాయని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్‌లైన్లో చెల్లించాలన్నారు. డిసెంబర్ 3 లోగా చెల్లించాలని, 10వ తరగతి చదివిన వారు అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 24, 2024

NRPT: జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఈ గ్రామంలోనే  

image

NRPT జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగగా వాహనదారులు, వాకర్లు చలికి ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లాలోని దామర్ గిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామాల్లో ఆదివారం 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 17.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.