India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✔MBNR:లా,ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు పట్ల పలువురు హర్షం
✔భక్తులతో కిటకిటలాడిన కురుమూర్తి దేవాలయం
✔కిష్టంపల్లి: ముళ్లపొదలో పసికందు.. ఆసుపత్రికి తరలింపు
✔NGKL: డెంగ్యూతో బాలుడి మృతి
✔MBNR: 4న ఉమ్మడి జిల్లా స్థాయి యోగా ఎంపికలు
✔పలుచోట్ల దీపావళి వేడుకలు
✔మహమ్మదాబాద్: ఘనంగా మాజీ మంత్రి కమతం రాంరెడ్డి జయంతి వేడుకలు
✔పకడ్బందీగా కుటుంబ సర్వే: కలెక్టర్లు
✔కురుమూర్తి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పానగల్ లో 34.0 డిగ్రీలు, గద్వాల జిల్లా అలంపూర్ లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వార్లో 33.4 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో 33.2 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 32.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అమరచింత మండలం కిష్టంపల్లి గ్రామ శివారులోని ముళ్ళపొదలో ఓ పసికందు శుక్రవారం ఉదయం లభ్యమైంది. కళ్ళు కూడా తెరవని ఆడ శిశువును ఎవరో అక్కడ విసిరేసిపోయారని గ్రామానికి చెందిన రాజు తెలిపాడు. చికిత్స నిమిత్తం పాపను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దేవస్థాన సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వలలో చెత్తను తొలగిస్తున్నారు. ఉద్దాల గుండు వద్ద పిచ్చి మొక్కలను తొలగిస్తూ నేలను చదును చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం పనులను పూర్తి చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లికి చెందిన బాలుడు శశివర్ధన్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఈ నెల 4వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 విభాగాల బాలబాలికల యోగా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వనపర్తి జిల్లాలోని చిట్యాల శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. వనపర్తికి చెందిన రాములు నాలుగు రోజులుగా కనిపించకుండాపోయాడు. గురువారం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. రాములు హత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ ప్రజల ఇలవేల్పు, పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న కురుమూర్తి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మో త్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి యాగశాల, ఉత్సవాల్లో ప్రధానమైన కల్యాణోత్సవం 2న, అలంకారోత్సవం 6న, ఉద్దాలోత్సవం 8న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దీపావళికి దావత్ ప్లాన్ ఉంటే బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోండి. తాగాలనుకుంటే మందు బాటిళ్ల బిల్లులు ఉంచుకోండి. మందు పార్టీకి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు కనుక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. గిట్టనివాళ్లు రేవ్ పార్టీ అనే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండండి’ అని ఆయన ట్వీట్ చేశారు.
➤ప్రారంభమైన కురుమూర్తి ఉత్సవాలు
➤ఘనంగా దీపావళి సంబరాలు
➤Way2Newsతో దీపావళి ప్రేమికుడు
➤దీపావళి EFFECT..మార్కెట్లో కొనుగోళ్ల కోలాహలం
➤గండీడ్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
➤కొత్తకోట: వేరుశెనగ యంత్రంలో పడి మహిళ మృతి
➤వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి:VBSF
➤PM యశస్వి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి: DEOలు
➤జూరాల కెనాల్లో పడిన వ్యక్తిని కాపాడిన స్థానికులు
Sorry, no posts matched your criteria.