India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

❤️పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీ భవనాల నిర్మాణం చేపట్టండి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి.❤️తెలంగాణ హైకోర్టు విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ నోటిఫికేషన్లో తీవ్ర అన్యాయం: మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సహదేవుడు.❤️డిండి లిఫ్ట్ నుంచి రోజుకు నుంచి టీఎంసీలు నీటిని తరలించడం తగదు: మాజీ మంత్రి నాగం ❤️పెద్దమందడి చెందిన పెంటయ్య(52) ఏపీలో అనంతపురంలో రైలు ఢీ, మృతి

BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో MRPS అధినేత మందకృష్ణ మాదిగ HYDలోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న వేల గొంతులు.. లక్షల డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన వంతు పాత్ర పోషించాలని ఆర్ఎస్పీని మందకృష్ణ కోరారు. అందుకు ఆర్ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మార్పీఎస్ వర్గాలు తెలిపారు.

గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దివంగత నటుడు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు దేవాలయ ఛైర్మన్ ప్రహ్లాద రావు స్వామివారి శేష వస్త్రం, చరిత్ర పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా దేవాలయ అన్నదానానికి రూ.5,016 అందించారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖరరావు, కేశవర్ధన్ రెడ్డి ఉన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి సీతక్క షాద్నగర్ నియోజకవర్గానికి చేరుకున్నారు. పట్టణంలోని బైపాస్ కేశంపేట రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ కాంగ్రెస్ నాయకురాలు బతుకమ్మతో స్వాగతం పలికారు.

మహబూబ్నగర్ జిల్లాలోని నందిపాడు, దోరెపల్లి, గుండుమాల్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. కాగా.. గురువారం రాత్రి కొత్తపల్లితండా మాజీ సర్పంచ్ బెణిక్యానాయక్ పొలంలో గొర్రెల మందపై చిరుత దాడి చేసిందని కాపరులు తెలిపారు. రాత్రుళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువుల దాడిలో పశువులు మృతిచెందితే తమకు సమాచారం అందించాలని అటవీ అధికారులు తెలిపారు.

నారాయణపేట పట్టణంలోని ఓ కాలనీలో మూడు రోజుల క్రితం ఓ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నరేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శివుడు, పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఉమామహేశ్వరం ఆలయం ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన చెట్లతో కూడిన కొండపై.. ఉత్తర ద్వారం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం కలిగి ఉంది. రెండో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని మౌర్య చంద్రగుప్త పాలనలో ఉంది. దీన్నే పూర్ మ్యాన్స్ ఊటీ అని పిలుస్తారు. క్రీ.శ.14వ శతాబ్దిలో మాధవనాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లను నిర్మించినట్లు ప్రచారం.

పంటలు సాగు చేసిన రైతులకు రైతుభరోసా అందిస్తామని, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దేవరకద్రలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత BRS ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.

ఆర్టీసీ బస్సులో నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో డ్రైవర్, కండక్టర్ సహకారంతో ప్రయాణికులే పురుడు పోసిన ఘటన శుక్రవారం గద్వాల ఆర్టీసీ డిపో పరిధిలో చోటు చేసుకుంది. రాయచూరు జిల్లా బాయిదొడ్డికి చెందిన పావని నిండు గర్భిణీ కావడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి ఆర్టీసీ బస్సులో ఎక్కింది. మార్గమధ్యలో నందిన్నె వద్ద ఆమెకు పురిటినొప్పులు రావడంతో బస్సులోనే ప్రసవం చేశారు.
Sorry, no posts matched your criteria.