Mahbubnagar

News October 31, 2024

MBNR: సర్వేకు సర్వం సిద్ధం.. 50 ప్రశ్నలపై ఫోకస్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠంగా తలపెట్టిన సకుటుంబ సర్వేకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా, మండల కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాల్లో ఎన్యుమరేటర్లకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై అవగాహన కల్పించారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధిపై సర్వే జరగనుంది.

News October 31, 2024

MBNR: నవోదయ దరఖాస్తు మరోసారి పొడిగింపు

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను.. 9,11వ తరగతుల్లో ప్రవేశానికి నిన్నటితో గడువు ముగియగా.. మరోసారి నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించారని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు ఉండాలన్నారు.

News October 31, 2024

MBNR: దీపావళి: ఈ జాగ్రత్తలు మరవకండి.!

image

✓ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
✓ వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
✓ గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
✓ కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయండి.
✓ ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
> SHARE IT..

News October 31, 2024

ధరూరు: పాఠశాలలో పాము కలకలం..

image

ధరూర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పాము కలకలం రేపింది. విద్యార్ధులు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్ల కింద ఆడుకునేందుకు వెళ్లిన సమయంలో పాము కనిపించడంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు అప్రమత్తం అయి విద్యార్థులను రక్షించారు. పాము బీసీ హాస్టల్‌లో చొరబడటం చూసి పలువురు గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపారు. చుట్టు పక్కల చెత్త పేరుకుపోవడంతో పాములు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు.

News October 31, 2024

MBNR: మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు రానున్నాయా?

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంటుకు రెండు స్థానాల చొప్పున, మొత్తంగా మరో నాలుగు నియోజకవర్గాలు ఏర్పాడనున్నాయి. జనాభా విస్తీర్ణం ప్రకారమైతే ఆరు అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు, నిపుణులలో చర్చలు జరుగుతున్నాయి. జనాభా, జిల్లా విభజన ప్రకారం అయితే ఈ సంఖ్య 20కి పెరగవచ్చని ప్రచారం సాగుతోంది.

News October 30, 2024

వనపర్తి: ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ సస్పెండ్

image

వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభు వినయ్ అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో BC పొలిటికల్ JAC ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేశారు.

News October 30, 2024

నిర్ణీత సమయంలో కులగణన పూర్తి చేస్తాం: మంత్రి జూపల్లి

image

కులగణనను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంతో నిష్పత్తి ప్రకారం వివరాలు సేకరిస్తామన్నారు. నవంబర్ 31 లోపు కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు ఉంటాయన్నారు. మూసి పరివాహక ప్రజలకు మేలు జరగడం BRS నేతలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.

News October 30, 2024

MBNR: కురుమూర్తి జాతరకు 179 ప్రత్యేక బస్సులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అతిపెద్ద జాతర, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నవంబర్ 7, 8, 9 తేదీల్లో మొత్తం 179 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల నుంచి బస్సులు నడపనుండగా, జాతరకు వెళ్లే భక్తుల కోసం బస్టాండ్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News October 30, 2024

కొడంగల్: తల్లిదండ్రులపై ప్రేమతో విగ్రహాల ఏర్పాటు

image

తల్లిదండ్రులకు ఒక్కపూట భోజనం పెట్టడానికి వెనకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు కొడుకులు. కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన గొల్ల బుగ్గమ్మ, లక్ష్మప్ప మృతి చెందారు. వీరికి ఐదుగురు కుమారులు ఉండగా.. అందులో తిమ్మప్ప, మల్లప్పలు తల్లిదండ్రులపై మమకారంతో తమ వ్యవసాయ పొలంలో వారి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించారు.

News October 30, 2024

MBNR: కురుమూర్తి జాతరకు 179 బస్సులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అతిపెద్ద జాతర, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నవంబర్ 7, 8, 9 తేదీల్లో మొత్తం 179 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ బస్టాండ్లలో కురుమూర్తి జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.