Mahbubnagar

News June 25, 2024

మార్చి నుంచే జీరో బిల్లులు అమలు: భట్టి విక్రమార్క

image

ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో మార్చి నెల నుంచి గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్లులు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాత్రి మన్ననూరు గ్రామంలో జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ వల్ల ఈ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో జీరో బిల్లులు అమలు చేయలేదని భట్టి తెలిపారు.

News June 25, 2024

జడ్చర్ల: గొర్రెల కాపరి హత్య కేసులో వీడిన మిస్టరీ

image

గొర్రెల కాపరిని భార్యే హత్య చేయించినట్లు జడ్చర్ల CI ఆదిరెడ్డి తెలిపారు. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, చిన్న ఆంజనేయులు(46) దంపతులు. పెద్ద కుమార్తె ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో తండ్రి మందలించాడు. ఈ విషయంలో కుమార్తె, భార్యను కొట్టాడు. దీంతో భాగ్యలక్ష్మి భర్త హత్యకు ప్లాన్ చేసింది. మూడు మేకలు ఇస్తానని కాళ్ల మైసమ్మతో ఒప్పందం చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 21న ముగ్గురు కలిసి హత్య చేశారు.

News June 25, 2024

MBNR: 1725 ఉపాధ్యాయుల బదిలీ.. ఆన్‌‌లైన్‌లో ఉత్తర్వులు

image

ఉమ్మడి జిల్లాలో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను అధికారులు ఆన్‌‌లైన్‌లో పెట్టారు. MBNR-394, NGKL-446, NRPT-271, WNPT-310, GDWL-304 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 229 మంది సీనియర్ SAలు, GHMలు పదోన్నతులు పొంది పాఠశాలలో చేరారు.

News June 25, 2024

MBNR: ప్రశాంతంగా డీఏఓ, హెచ్ఐడబ్ల్యూఓ పరీక్షలు

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్- 2,డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు సోమవారం నుంచి శనివారం వరకు జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లాకేంద్రంలో జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, ఫాతిమా స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు 730 మంది పరీక్షకు హాజరయ్యారు.

News June 25, 2024

మహబూబ్‌నగర్: బాలానగర్ RIపై సస్పెన్షన్‌ వేటు

image

బాలానగర్ RI వెంకట్ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అదివారం MRO ఆఫీసులో తలుపులు వేసుకొని రికార్డులు రాస్తున్న ఆర్‌ఐపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. 4 నెలల క్రితం హేమాదిపూర్ గ్రామంలో చనిపోయిన రైతు పొలాన్ని ఆయన భార్య పేరిట విరాసత్ చేశారు. దీనిపై HYDలో ఉంటున్న రైతు 2వ భార్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఆర్ఐ తప్పు ఉన్నట్లు నిర్ధారించి సస్పెండ్ చేసినట్లు సమాచారం.

News June 25, 2024

MBNR: విద్యుత్ అధికారులతో డిప్యూటి సీఎం సమీక్ష

image

ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యుత్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈగలపెంట సమీపంలో ఉన్న జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగం, ఉత్పత్తి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మెరుగైన విద్యుత్ అందించాలని కోరారు.

News June 25, 2024

రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు సూచికలు: సీజీఎం సుశీల

image

రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు సూచికలని నాబార్డ్ తెలంగాణ సీజీఎం సుశీల పేర్కొన్నారు. నాబార్డ్ డీజీఎం శ్వేత సింగ్ తో కలిసి సోమవారం అయిజ సింగిల్ విండో కార్యాలయాన్ని సందర్శించారు. విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సూపర్ మార్కెట్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో నష్టాల్లో ఉన్న అయిజ విండోను లాభాల వైపు మళ్లించారని ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డిని ప్రశంసించారు.

News June 24, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు: భట్టి విక్రమార్క
✒DSCలో పోస్టులు పెంచాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా B.ed,Ded అభ్యర్థుల
నిరసన
✒NGKL:గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
✒ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌.. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక
✒ఇంటర్ ఫలితాలు.. గద్వాల ఫస్ట్.. నారాయణపేట లాస్ట్
✒ఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం
✒MBNR:25 నుంచి జాతీయ నెట్ బాల్‌కు శిక్షణ
✒గృహ జ్యోతి పథకాన్ని దరఖాస్తు చేసుకోండి: MPDO

News June 24, 2024

నాగర్‌కర్నూల్: మహిళపై దాడి ఘటనలో కొత్త కోణం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు మహిళా ఈశ్వరమ్మపై దాడి ఘటనలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఈశ్వరమ్మపై దాడికి ముందే 20 రోజుల క్రితం ఆమె చిన్నమామ నాగన్న అనుమానాస్పదంగా మృతిచెందారు. భూమి విక్రయానికి అడ్డుపడ్డాడని నాగన్నను కొందరు హత్య చేసి పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేయించారని స్థానికంగా టాక్. తాజాగా దాడి నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుతో నాగన్న మృతిపైనా పోలీసులు విచారణ చేపట్టారు.

News June 24, 2024

శ్రీశైలంలో సన్నిధిలో డీప్యూటీ సీఎంతో పాలమూరు ఎమ్మెల్యేలు

image

శ్రీశైలం మల్లికార్జున స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేయించి, వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.