India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశాల భర్తీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసేందుకు నేడు చివరి రోజు. ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు అందిస్తారు. ఆసక్తి ఉండి ఇంకా అప్లే చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంచార్జ్ DMHOలను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానంలో ఇన్ఛార్జి డిఎంహెచ్ఓలను నియమించింది. మహబూబ్ నగర్ డిఎంహెచ్ఓగా డా.కృష్ణకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గద్వాల ఇన్చార్జి DMHOగా డాక్టర్ SK సిద్దప్పను, వనపర్తి ఇన్చార్జి DMHOగా డాక్టర్ ఎ.శ్రీనివాసులును నియమించారు.
గోపాలపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సమీపంలో ఓ రైతు పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని లచ్చు నాయక్ పొలంలో నిన్న సాయంత్రం పొలంలో మొసలి సంచరిస్తుండగా కొందరు స్థానికులు గమనించారు. గ్రామస్థులు వెంటనే వనపర్తి సాగర్ స్నేక్ సొసైటీకి కాల్ చేయగా వారు వచ్చి పట్టుకొని బీచుపల్లి దగ్గర కృష్ణ నదిలో వదిలినట్లు చెప్పారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 31నుంచి ప్రారంభం కానున్నాయి.
›OCT 31న ఉత్సవాలు ప్రారంభం ›NOV 1న ఆవాహిత దేవతాపూజలు ›2న స్వామివారి కల్యాణం, మయూర వాహనసేవ ›3న హంసవాహన సేవ, ›4న శేషవాహన సేవ ›5న గజవాహన సేవ ›6న బంగారం ఆభరణాలతో అలంకార ఉత్సవం, అశ్వవాహన సేవ ›7న హనుమద్వాహన వాహనసేవ ›8న ఉద్దాల ఉత్సవం, ఉద్దాలకొండపై గురుడ వాహనంపై ఊరేగింపు ›18న స్వామి అలంకారం తీయడంలో ఉత్సవాల ముగింపు
మదనాపురం ఆత్మకూర్ సమీపంలో కొండపై కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. 2 తేదీ నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో ముదినేశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి రోజు స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉమ్మడి జిల్లా ప్రజలే కాక కర్ణాటక, ఏపీ నుంచి భక్తులు వస్తారని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు.
తలకొండపల్లి మండల కేంద్రంలో ఓ వృద్ధురాలిపై మండల కేంద్రానికి చెందిన రమేశ్ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. బాధితురాలి భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందగా ఆమెకు ముగ్గురు సంతానం. వారం రోజుల కిందట ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై ఇంటి పక్కన ఉండే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్సై వివరించారు. మంగళవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
పాలమూరు జిల్లాలోని కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 9 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. ఈ నెల 31నుంచి నవంబర్ 18 వరకు బస్సు సౌకర్యం అన్ని ఏరియాలో నుంచి కల్పిస్తున్నామన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన ముగ్గురు TGPSC జూనియర్ లెక్చరర్(JL) జాబ్స్ కొట్టి ఔరా అనిపించారు. కల్వరాల గ్రామానికి చెందిన హిమబిందు (కామర్స్ ), రాముడు(కెమిస్ట్రీ), భరత్ (హిస్టరీ) JLగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన ముగ్గురికి ఒకేసారి ఉద్యోగాలు రావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు కుటుంబీకులు హర్షం వ్వక్తం చేస్తున్నారు. వారిని స్థానికులు అభినందించారు.
వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన ముగ్గురు TGPSC జూనియర్ లెక్చరర్(JL) జాబ్స్ కొట్టి ఔరా అనిపించారు. కల్వరాల గ్రామానికి చెందిన హిమబిందు (కామర్స్ ), రాముడు(కెమిస్ట్రీ), భరత్ (హిస్టరీ) JLగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన ముగ్గురికి ఒకేసారి ఉద్యోగాలు రావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు కుటుంబీకులు హర్షం వ్వక్తం చేస్తున్నారు. వారిని స్థానికులు అభినందించారు.
మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని పాలమూరు యూనివర్సిటీ వీసి ప్రొ. శ్రీనివాస్ అన్నారు. ఇవాళ పాలమూరు యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ఒరియెంటేషన్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు సామాజిక విలువలు, సంస్కారం చెప్పాలని సూచించారు. రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి, స్పీకర్ రాంరెడ్డి, ప్రొఫెసర్ కుమారస్వామి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.