India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరు యూనివర్సిటీ(PU) పరిధిలో డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 13 వరకు డిగ్రీ 1,3,5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు PU అధికారులు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు గమనించాలని కోరారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు గ్రూప్-4 అభ్యర్థులు ఆదివారం రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కలిశారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాలలో తమకంటే మార్కులు తక్కువ వచ్చిన అభ్యర్థులకు జాబ్ వచ్చిందని.. మార్కులు ఎక్కువ ఉన్నప్పటికీ తాము జాబ్ కోల్పోయామన్నారు. ఏ పద్ధతిన సెలక్షన్ ప్రాసెస్ జరిగిందో తెలిపాలని వారు బోర్డుకు వినతి పత్రాన్ని అందించారు.
పెద్దకొత్తపల్లి మండలంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. NGKL నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా కుడికిల్లకి చెందిన నిరంజనమ్మ కల్వకోల్ గ్రామం రహదారి వద్ద కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పరార్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
✓అభ్యర్థులు హాల్టికెట్ను ఏ-4 సైజ్ కలర్ ప్రింట్ తీసుకోవాలి. ✓హాల్టికెట్పై పాస్పోర్టు సైజ్ ఫొటో అతికించాలి. ✓హాల్టికెట్పై ఫొటో సరిగ్గా ముద్రించకుంటే గెజిటెడ్ అధికారి అటెస్టేషన్తో 3పాస్పోర్టు సైజ్ ఫొటోలతోపాటు, వెబ్సైట్లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్కు అందించాలి. ✓బ్లూ,బ్లాక్ బాల్ పెన్ ఉపయోగించాలి✓ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు జరిగే పరీక్షలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 154 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఈరోజు రెండు విడతలు, రేపు ఒక విడత పరీక్ష ఉంటుంది. ఉ.8:30 నుంచి 9:30 గంటల వరకు, మ.1:30 నుంచి 2:30గంటల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
పాలమూరు నుంచే ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు కుట్రలు చేస్తుంన్నారని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడే అభివృద్ధి మొదలైందని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే మట్టి కొట్టుకుపోతారని విమర్శించారు.
కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులగణులకు వారి సామాజిక వర్గం వివరాలు సేకరిస్తే సరిపోతుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్లు, పశువుల వివరాలు అవసరమా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం చేసేందుకే ఇన్ని ప్రశ్నలు పెట్టారన్నారు. సర్వేను పునః పరిశీలించాలన్నారు.
‘మెడికల్ హబ్’గా కొడంగల్ మారనుంది. అందులో భాగంగానే వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే భవనాల నిర్మాణానికి స్థల సేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. అయితే నర్సింగ్ కాలేజీకి అడ్మిషన్లు జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు.
కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో 18న కార్తీక మాసం, మూడో సోమవారం పురస్కరించుకొని హరిహరులకు లక్ష పుష్పార్చన, జల దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు రాత్రి 8 గంటలకు కటకం కృష్ణస్వామి కుటుంబ సభ్యులు భక్తులకు ఉపాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సాంబార్లో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి(M) పైపాడుకు చెందిన వీరేశ్ కూలీ పనులకు కర్నూలు జిల్లా గోనెగండ్ల(M) ఎన్గోడ్కు వెళ్లారు. ఆ ఊరిలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. వీరేశ్ కుమారుడు జగదీశ్(6) ఫోన్తో ఆడుకుంటూ సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత జారిపోవడంతో సాంబారులో పడిపోయాడు. కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.