India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔న్యూ ఇయర్..ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు:SPలు✔గద్వాల:13వ రోజు న్యాయవాదుల దీక్ష✔ఎస్ఎస్ఏలకు క్రమబద్ధీకరించాలి:బిఎస్పీ✔జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల యువకుడు✔NGKL:పాముకాటుతో యువ రైతు మృతి✔NRPT:PSను తనిఖీ చేసిన డిఎస్పీ✔19వ రోజు కొనసాగిన ఉద్యోగుల సమ్మె✔సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:SIలు ✔జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కోస్గి విద్యార్థి

కల్వకుర్తిలోని కొత్త కాటన్ మిల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్పై కల్వకుర్తి వైపు వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణానికి చెందిన శ్రీనాథ్ (17), భాను (16)గా గుర్తించారు. మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 63 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT నంబర్ 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తనకు సహకారం అందించిన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందించారు.

ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నవాబుపేట మండలం కాకర్లపహాడ్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంకిత(18) మహబూబ్నగర్లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆలయంలో పని చేస్తుంటారు. కాగా, ఆదివారం వారు గుడికి వెళ్లి తిరిగి వచ్చే వరకు అంకిత ఇంట్లో ఉరేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఇవాళ ఉదయం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకొని ఫారెస్టు ఆఫీసర్లకు అప్పగించారు.

ఉమ్మడి పాలమూరులో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడి గుడ్డు ధర కొండెక్కింది. నూతన సంవత్సర వేడుకల్లో కేకు తయారీలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ధర అక్టోబర్- రూ.6.30, నవంబర్- రూ.6.50, డిసెంబర్- రూ.7.10 పైన ఉంది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ధర తగ్గి గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. ధర పెరగడంతో గుడ్లు నోటికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్లో నమోదు చేయాలని ఇప్పటికే అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.

నల్లమల, కృష్ణా నది తీరంలో టెంపుల్, ఎకో, రివర్ టూరిజం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ.65 కోట్లతో ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్లాన్ చేయగా అత్యధికంగా సోమశిలకు కేటాయించారు. నల్లమలలోని అక్కమహాదేవి గుహలు మొదలుకుని సలేశ్వరం, మల్లెల తీర్థం, లొద్దిమల్లయ్య, మద్దిమడుగు, ఆక్టోపస్, ఫర్హాబాద్ వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుడి కోట అభివృద్ధికి రూ.25 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నట్లు MLA వంశీకృష్ణ తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా టెట్ అభ్యర్థులకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వచ్చే నెల 2-20 మధ్య తేదీల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు సమర్పించే సమయంలో 16 కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఆధారంగా ఇచ్చిన జిల్లాలో కాకుండా చివరి ప్రాధాన్యతలో దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
Sorry, no posts matched your criteria.