Mahbubnagar

News June 24, 2024

మహబూబ్‌నగర్ జిల్లా TODAY TOP NEWS

image

☞పలు చోట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం☞ఢిల్లీ బయలుదేరిన డీకే అరుణ☞షాద్‌నగర్: ప్రాణం తీసిన చికెన్ ముక్క☞నల్లమలలో ప్లాస్టిక్ వాడకం నిషేదం☞నవాబ్‌పేట్: గంట వ్యవధిలో అన్న, చెల్లెలు మృతి☞NGKL: 8 మందికి పోలీసు సేవా పతకాలు☞ఆదివారం MRO ఆఫీస్‌లో RI.. MLA సీరియస్☞సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్☞పలుచోట్ల శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాలులు

News June 23, 2024

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చెయ్యాలి: సీఎం

image

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

News June 23, 2024

MBNR: ఉపాధ్యాయులకు నేడు బదిలీల ఉత్తర్వులు

image

ఉపాధ్యాయులకు శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ కు అవకాశం కల్పించారు. ఆదివారం ఆన్లైన్లో బదిలీ ఉత్తర్వులను అందుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉత్తర్వులు అందుకొని సోమవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు.

News June 23, 2024

జడ్చర్ల: హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

image

జడ్చర్లలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. CI ఆదిరెడ్డి వివరాలు.. APలోని అనంతపురం వాసి సురేశ్(36) HYDలో ఉంటున్నాడు. ఈనెల 20న షాద్‌నగర్ వెళ్తునట్లు భార్యకు చెప్పి వెళ్లిన సురేశ్ జడ్చర్లలో హైవే పక్కన హోటల్‌లో రూం తీసుకున్నాడు. అదేరోజు రాత్రి పురుగు మందుతాగి సూసైడ్ చేసుకోగా సిబ్బంది గుర్తించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికిందని భార్య మంజుల ఫిర్యాదుతో నిన్న కేసు నమోదుచేశారు.

News June 23, 2024

పారిస్ ఒలంపిక్స్‌లో స‌త్తా చాటాలి: మంత్రి జూప‌ల్లి

image

అంత‌ర్జాతీయ ఒలంపిక్ దినోత్స‌వాన్ని పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో ఒలంపిక్ ర‌న్‌ను మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజ‌రై క్రీడా జ్యోతిని వెలిగించి ప‌రుగులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క్రీడాకారుల‌కు మంత్రి జూప‌ల్లి ఒలింపిక్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త‌దేశ‌ క్రీడాకారులు త‌మ సత్తా చాటి దేశ‌ కీర్తి ప్రతిష్టలను పెంచాలని అన్నారు.

News June 23, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా కోస్గిలో 45.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేటలో 35.0 మి.మీ, వనపర్తి జిల్లా పెబ్బేరులో 0.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ మరియు గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 23, 2024

హైదరాబాద్‌లో ACCIDENT.. వనపర్తి వాసి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లా వాసి మృతిచెందాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడిక్కకడే చనిపోయాడు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన రవి శంకర్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

MBNR: 1,800 మందికి పదోన్నతులు

image

మల్టీ జోన్-2 పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతమైంది. గతేడాది సెప్టెంబరులో బదిలీల కోసం ఉమ్మడి జిల్లా నుంచి 9,824 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బదిలీల్లో వివిధ విభాగాలకు చెందిన సుమారు ఏడు వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీరిలో సుమారు 1,800 మంది పదోన్నతులు పొందనున్నారు. ఇప్పటికే 229 SA, GHMలు పదోన్నతులు పొందారు.

News June 23, 2024

జూరాలకు తగ్గుతున్న ఇన్‌ఫ్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 908 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు నుంచి 2,054 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.830 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 23, 2024

MBNR: 28న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో ఈనెల 28న జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించనున్నామని డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని, ప్రవేశాల కోసం ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉండి, 2015 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్య కాలంలో జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు.