India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలమూరు జిల్లా కాంగ్రెస్కు 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు 12 చోట్ల గెలవడంతోపాటు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. జిల్లాకు సీఎం, మంత్రి పదవితోపాటు దక్కడంతో శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS అల్లంపూర్, గద్వాలలో గెలవగా ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు.

✔మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన సీఎం, ఉమ్మడి జిల్లా నేతలు✔అభివృద్ధికి సహకరించండి: బండి సంజయ్✔ప్రారంభమైన రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు✔REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్✔కార్మికుల హామీలు నెరవేర్చాలి:CITU✔జోగులాంబ అమ్మవారి సేవలో హీరో ఆకాశ్✔కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔GREAT:రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔GWDL:Way2Newsతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆవేదన

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో రాష్ట్రానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని DSA మైదానంలో సీఎం కప్-2024 పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,584 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. 6 మ్యాట్లపై మ్యాచులు నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ నెట్ బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి టోర్నీకి అతిథ్యం లభించింది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెల 2 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

మన్మోహన్ సింగ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. మొదటి పర్యటనలో జులై 1 2004న ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతులకు రూ.19.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం కల్పించారు. రెండోసారి అక్టోబర్ 26 2006న కొత్తకోటలో పర్యటించి.. HYD- బెంగళూరు జాతీయ రహదారి(NH-44) విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ఆయన ఉమ్మడి పాలమూరు వాసుల మనసు గెలుచుకున్నారు.

షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం గంగన్నగూడానికి చెందిన శేఖర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి సమీపంలో ఉన్న ఉప్పలకుంట చెరువులో శేఖర్ రెడ్డి గతంలో చేపలు బయటకు వెళ్లేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ రెడ్డి తిరిగి రాకపోవడంతో పలుచోట్ల గాలించగా చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య? హత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదులోని NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.

నర్వ మండలం రాయి కోడ్ గ్రామానికి, గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. నర్వ మండల, గ్రామాల బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

✔ఘనంగా క్రిస్మస్ వేడుకలు✔ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి✔NGKL: పోలీస్ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు✔వనపర్తి: అయ్యప్ప ఆలయంలో స్వచ్ఛభారత్✔ఒకవైపు ముసురు..మరోవైపు చలి✔CM ఇలాకాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు✔NRPT: మూడు రోజులు త్రాగునీటి సరఫరా నిలిపివేత✔సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దు:SPలు✔PUలో క్రీడాకారులకు ట్రాక్ సూట్, యూనిఫామ్స్ అందజేత
Sorry, no posts matched your criteria.