India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤లొంగిపోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు
➤రేవంత్ రెడ్డి ఇలాకాలో రైతుల రణరంగం
➤రేపు మద్దూర్కు సీఎం రాక..భారీ బందోబస్తు
➤సుంకేసుల 23 గేట్లు ఓపెన్
➤అంగడిరైచూర్లో పులి కలకలం
➤బొంరాస్పేట:Way2News EFFECT..VKBD బస్సు ప్రారంభం
➤29న ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ ఎంపిక
➤జూపల్లికి రాజకీయ విలువలు లేవు: హర్షవర్ధన్ రెడ్డి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. MBNR పురపాలక పరిధి క్రిస్టియన్పల్లిలోని 523 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో ప్లాట్లుగా చేసి విక్రయించడంపై నలుగురిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్కు పంపామన్నారు. శ్రీకాంత్ గౌడ్ బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని చెప్పారు.
మద్దూరు మండలంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. శుక్రవారం హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ వెళ్ళే రోడ్డును పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడళ్లలో పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హెలిప్యాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సతీష్ ఇంటివరకు పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ‘మామిడి క్లస్టర్’ గా ఎంపిక చేసింది. దీని కోసం రూ.100 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. తెగుళ్ల నివారణ, నాణ్యమైన అధిక దిగుబడి పొందేందుకు మామిడి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లె, కల్వకోలు గ్రామాల్లో 1000 ఎకరాల్లో మామిడి తోటలపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో(శుక్రవారం) నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 36.8 డిగ్రీలుగా నమోదయింది. గద్వాల జిల్లా అల్వాల్పాడులో 33.2 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రలో 29.9 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోస్గిలో 29.8 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 29.4 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అవమానం భరించలేక బాలిక సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. మల్దకల్కు చెందిన బాలిక(17) గద్వాలకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఇంట్లో పనిలో చేరింది. కాగా ఇంట్లో దొంగతనం చేసిందని యజమాని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక, ఆమె తల్లిని PSకు పిలిచి విచారించినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో అవమనంగా భావించిన బాలిక పురుగుమందు తాగింది. కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 31 నుంచి నవంబర్ 18 వరకు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉద్దాల రోజున సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని DSA స్టేడియంలో ఈనెల 29న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్-14,అండర్-17 విభాగంలో బాల,బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్,ఆధార్ కార్డు జిరాక్స్ లతో హాజరు కావాలని కోరారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష జరిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఇంకా ఎన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలన్నారు. సన్న రకం ధాన్యం సేకరణలో అధికారులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు.
అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన జట్టుకు ట్రోఫీని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.