Mahbubnagar

News November 11, 2024

నాగర్‌కర్నూల్: తల్లి, వదిన సహయంతో హత్య

image

అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. SI నరేందర్‌రెడ్డి వివరాలు.. తిమ్మాజిపేట(M) రాళ్లచెరువుకు చెందిన శీను(40), గోపాల్ అన్నదమ్ములు. అన్న భార్యతో గోపాల్ వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గోపాల్.. వదిన, తల్లి సహయంతో శీనును చంపేశాడు. మృతదేహాన్ని గోపాల్ అత్తగారింటి వద్ద పడేయటం చూసిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదైంది.

News November 11, 2024

మానవపాడు: కరెంట్ బల్బు కాదు.. సూర్యుని అస్తమయం

image

విద్యుత్ స్తంభంపై బల్బు వెలుగునిస్తుంది అనుకుంటే పొరపాటు పడినట్టే. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ దృశ్యం మానవపాడు మండల శివారులో రైల్వే బ్రిడ్జి సమీపంలో కనిపించింది. ఓ విద్యుత్ స్తంభంపై సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూపర్లను ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసి విద్యుత్ స్తంభంపై సూర్యుడు ఉన్నాడా.. విద్యుత్ బల్బు వెలుగుతుందా అన్నట్లుగా అనిపించింది. ఈ దృశ్యం వే2న్యూస్ కంటపడింది.

News November 11, 2024

కురుమూర్తి టెంపుల్‌కి ఘాట్ రోడ్డు సంతోషకరం: మంత్రి కోమటిరెడ్డి

image

కలియుగ దైవంగా కురుమూర్తి దేవస్థానాన్ని భావించి లక్షలాది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2009లో ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు కురుమూర్తి దేవస్థానానికి ఘాట్ రోడ్డు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

News November 10, 2024

పదేళ్లుగా పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారు: రేవంత్

image

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పరిశ్రమలు రాలేదు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతున్నాయి. ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రేవంత్ తెలిపారు.

News November 10, 2024

సుప్రసిద్ధ కేంద్రంగా కురుమూర్తిని మారుస్తాం: సీఎం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. చరిత్రలోనే తొలిసారిగా కురుమూర్తి దేవస్థానానికి ముఖ్యమంత్రి రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో కురుమూర్తి దేవస్థానాని దేశంలో సుప్రసిద్ధ పర్యటక కేంద్రంగా తయారవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News November 10, 2024

సుప్రసిద్ధ కేంద్రంగా కురుమూర్తిని మారుస్తాం: సీఎం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. చరిత్రలోనే తొలిసారిగా కురుమూర్తి దేవస్థానానికి ముఖ్యమంత్రి రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో కురుమూర్తి దేవస్థానాని దేశంలో సుప్రసిద్ధ పర్యటక కేంద్రంగా తయారవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News November 10, 2024

కురుమూర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో కురుమూర్తి ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఆలయానికి సంబంధించి రూ.110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్ల మార్గంలోనే కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News November 10, 2024

MBNR: కులగణన.. వివరాల సేకరణలో 4,740 టీచర్లు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాల్లో 2,041కు పైగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న MBNR-1,156, NGKL-1,450, GDWL-606, NRPT-746, WNPT-782 మంది ఉపాధ్యాయులను అధికారులు సర్వేకు కేటాయించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒంటి పూటే కొనసాగగా.. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు సర్వేకు వెళుతున్నారు.

News November 10, 2024

MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించింది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.

News November 10, 2024

BREAKING: కురుమూర్తి స్వామి కోనేరులో పడి వ్యక్తి మృతి

image

కురుమూర్తి బ్రహోత్సవాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృత్యువాత పడ్డాడు. ఎస్సై శేఖర్ వివరాల ప్రకారం.. బ్రహోత్సవాలకు వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కోనేరులో స్నానం చేసేందుకు దిగి ఈతరాక మృతి చెందాడు. మృతుడు బ్రౌన్ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని ఇతడిని గుర్తించిన వారు సీసీ కుంట పోలీసు నంబర్ 87126 59354 సంప్రదించాలని తెలిపారు.