India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్ ఎస్పీ హర్షవర్ధన్కి జిల్లా పోలీస్ సిబ్బంది బుధవారం ఘనంగా వేడుకలు పలికారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హల్ నందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 8నెలల కాలంలో సిబ్బంది సహకారంతో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఘనత హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ వరకు అందరికీ దక్కుతుందన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం అమానవీయ ఘటన వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని నాగనూల్ రోడ్డులో శ్మశానవాటిక ఎదురుగా అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అయితే అప్పటికే ఆడశిశువు మృతి చెందింది. స్ధానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మక్తల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాలు.. మండలంలోని అనుగొండకు చెందిన సంజీవ్, కవిత(45) దంపతులు మక్తల్లో వరి విత్తనాలు కొనుగోలు చేసి బైక్పై గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సాయిబాబా మందిరం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కిందపడిన కవిత తలపై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్లో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. చివరి వరకు కేసీఆర్ నాయకత్వంలో BRS కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. గద్వాల క్యాంప్ ఆఫీసులో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు 4 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అదంతా తానంటే గిట్టని వారు చేసే తప్పుడు ప్రచారం అన్నారు.
శ్రీరంగాపురంలోని రంగసముద్ర జలాశయం దాదాపు 3 కి.మీ. పొడవైన ఆయకట్టుతో పాటు ఆలయానికి మూడు వైపులా నీరు ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కట్ట వెంబడి విద్యుద్దీపాలు, సేదతీరేందుకు బెంచీలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి మినీ ట్యాంక్ బండ్గా మారిస్తే జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.
విహారయాత్ర ఓ యువకుని కుటుంబంలో విషాదం మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాన్గల్కి చెందిన ఏడుగురు యువకులు స్నేహితులతో కలిసి జూరాల సందర్శనకు వెళ్లారు. యాత్ర ముగించుకుని మట్టి రోడ్డుపై వస్తుండగా మూలమల్ల గ్రామం వద్ద కారు బోల్తాపడింది. ఈ ఘటనలో రోహన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆరుగురికి గాయాలైయాయని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా వెలుగొండలో 51.8 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తీమాన్ దొడ్డిలో 41.5 మి.మీ, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో 21.5 మి.మీ, నారాయణపేట జిల్లా కోటకొండలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
సివిల్ సర్వీసెస్-2025 పరీక్ష రాసే అభ్యర్థులకు HYDలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ అందించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట జిల్లాలకు చెందిన డిగ్రీ పాసై, ఆసక్తి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి తమ పేర్లను www.tgbc-studycircle.cgg.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.
చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గోపాల్పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై హరి ప్రసాద్ కథనం ప్రకారం.. కుర్మయ్య (41) అనే వ్యక్తి మంగళవారం కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ఊరు పక్కనే ఉన్న బావిలో చేపల వేటకు వెళ్లారని, చేపలు పడ్డాయని బావిలోకి దిగి చూడగా కాళ్లకు వల్ల చుట్టుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
తెలంగాణ ఎక్సైజ్శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.