India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.

NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.

బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.

మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మహబూబ్నగర్ పట్టణం ఇక అప్గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.

పోలీస్ అధికారులు వ్యవస్థీకృత నేరాలపై దృష్టి పెట్టాలని, నమోదైన ప్రతి కేసులో లోతైన విచారణ పారదర్శకంగా చేపట్టాలని MBNR జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. సాక్షులను బ్రీఫ్ చేస్తూ మహిళలపై జరుగుతున్న నేరాలు, ఫోక్సో కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు.

గట్టు మండల పోలీస్ స్టేషన్ను గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, కేసులు, పెండింగ్ కేసులు, సీడీ ఫైళ్లు తదితరాలను సమీక్షించారు. గ్రామ ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, స్టేషన్లో ఉన్న కార్యకలాపాలపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారికి మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.

గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నేడు సీఎం కప్ క్రీడ పోటీలు ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ విజయేంద్ర బోయి హాజరయ్యారు. జిల్లాలో 36 క్రీడ అంశాలలో సీఎంతో పోటీలు నిర్వహించమన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా క్రీడాకారులు సత్తా చాటాలన్నారు.

ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లోరెవెన్యూ శాఖకు సంబంధించి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. మండలంల వారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్పై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన నోడల్ అధికారులు విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు 2025 నిర్వహణకు నియమించిన నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వివిధ విభాగాలలో 12 మంది నోడల్ అధికారులను నియమించామని అన్నారు.
Sorry, no posts matched your criteria.