India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావుతో మాట్లాడారు.
✔ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం ✔ఈనెల 26న మద్దూర్కు సీఎం రేవంత్ రెడ్డి ✔శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ✔భారీగా పెరిగిన చికెన్ ధరలు ✔NGKL:30న జాతీయ స్థాయి బండలాగుడు పోటీల ప్రదర్శన ✔NGKL: గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు ✔ప్రగతిపథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి ✔10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం:BRSV
స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని జోగులాంబ జోన్ 7 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ పిలుపునిచ్చారు. పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఐజి మాట్లాడుతూ.. ప్రాణపాయస్థితిలో రక్తదానం చేసినట్లయితే బాధితులను ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు.
గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి చనిపోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. సుభాష్ నగర్ వాసి ఉప్పరి వెంకటయ్య (43) ఉ.11 గంటలకు టిఫిన్ సెంటర్ నుంచి దోశ తెచ్చుకొని ఇంట్లో తింటుండగా ఒక్కసారిగా మింగడంతో గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక కింద పడి చనిపోయాడు. ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ రూపొందించిన 80 పాటల సంకలనం ‘ప్రగతిపథంలో ప్రజా పాలన’ పుస్తకాన్ని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాలన్నీ ప్రజలకి చేరవేయడంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కావున ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 28 వరకు ఆయా సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.300 ఫైన్తో నవంబర్ 3వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరంలో 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా సోలిపూర్ లో 34.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 33.3 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 28.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 7.5 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.
రాజోలికి చెందిన శివ(26) మంగళవారం రాత్రి బైక్ పైనుంచి పడి మృతిచెందారు. కుర్వ మద్దిలేటి చిన్న కొడుకు శివ వెళుతూ బైక్ అదుపు తప్పడంతో కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య లక్ష్మి నిండు గర్భిణీ కాగా నేడు తెల్లవారుజామున పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సారి పుట్టిన బిడ్డను చూసుకోకుండా తండ్రి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం 1,690 కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాలను నిర్మించింది. ఒక్కో కేంద్రానికి రూ.12 లక్షల చొప్పున మొత్తం రూ.42.23 కోట్లు ఖర్చు చేసింది. తడి చెత్తతో కంపోస్టు ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా స్వచ్ఛతను సాధించే ఉద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టి నిధులు విడుదల చేసింది. సిబ్బంది లేకపోవడంతో ఆ కేంద్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.