India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్దూర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మండలంలోని చెన్నరెడ్డిపల్లి, మోమినాపూర్ శివారులో చిరుత సంచరిస్తుందని ఆ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించడంతో ప్రజలకు భయం పట్టుకుంది. చిరుతలతో జాగ్రతగా ఉండాలే తప్పా, పొలం కంచెలకు షాక్ పెట్టడం, విష ప్రయోగాలు చేసి చిరుతల మృతికి కారణమైతే రూ.10లక్షల జరిమానా, కేసులు పెడతామని బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
సివిల్ సర్వీసు-2025 సంవత్సరంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎ.స్వప్న, జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి ఆర్.ఇందిరా తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన BC, SC, ST అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని కోరారు.
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించని కారణంగా 14 మందికి కలెక్టర్ సంతోష్ షోకాజ్ నోటీసు జారీచేశారు. మంగళవారం ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన ఆయన సిబ్బంది గైర్హజరయిన విషయాన్ని గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను ఆరాతీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు 3 నెలల క్రితం తనను ప్రేమ వివాహం చేసుకొని ఇప్పుడు కలిసి ఉండటం ఇష్టం లేదని చెబుతున్నాడని తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ, యువకుడు సోషల్ మీడియాలో కలుసుకొని వివాహం చేసుకున్నారు. తిరుపతిలో ఉంటూ జీవనం సాగించారు. ఇటీవల అతడు సొంత ఊరికి వచ్చి, తిరిగి రాకపోవడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది.
మద్దూర్ మండల పరిధిలోనీ చెన్నారెడ్డిపల్లి, కంసాన్పల్లి, పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని, అప్రమత్తంగా ఉంటూ.. వాటికి హాని తలపెట్టకూడదని మద్దూరు మండల ఫారెస్టు అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. వాటికి నష్టం కల్గించే ప్రయత్నాలు పొలాలకు విద్యుత్తు తీగలు ఏర్పాట్లు, చనిపోయిన జీవాలకు విషప్రయోగం చేస్తే.. రూ.10లక్షల జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కొత్త ఎస్పీగా టీ.శ్రీనివాస్ రావు బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 2013 స్టేట్ సర్వీస్ పోలీస్ బ్యాచ్కు చెందిన ఆయన ఇన్ని రోజులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు. కాగా సైబరాబాద్ పరిధిలో పలు కీలక కేసుల ఛేదనలో టీ.శ్రీనివాస్ రావు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన జిల్లాకు రానుండడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా జానకి ధరావత్ రానున్నారు. ఎస్పీ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2007లో 6 నెలల పాటు ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేసిన ఆమెకు MBNRపై అవగాహన ఉంది. 2013లో ఐపీఎస్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి బదిలీపై జిల్లాకు వస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,975 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమానికి రూ.29.75 లక్షలు కేటాయించారు. బ్యానర్, కరపత్రాల ముద్రణ, ఇతర ఖర్చుల కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున మంజూరు చేశారు. ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుందని అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని మౌలాలి గుట్టలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సోమవారం పరిశీలించారు. మొదటి దశలో 588,రెండవ దశలో 84 మొత్తం 672 డబుల్ బెడ్ రూంలను నిర్మాణం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైద్యం భాస్కర్ కలెక్టర్కు వివరించారు. 672 గృహాలలో 588 గృహాలు లబ్దిదారులకు కేటాయించినట్లు తెలిపారు.
✒ఉమ్మడి జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు
✒SDNR:చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు!
✒అచ్చంపేట: రోడ్డు పక్కన యువకుడి మృతదేహం
✒MBNR ఎస్పీగా జానకి ధరావత్, గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు నియామకం
✒బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లా MLAలు, MPలు
✒విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి:ABVP ✒Way2Newsకు స్పందన.. గండీడ్ మండలానికి బస్సు సౌకర్యం
✒Way2Newsకు స్పందన..MRO కార్యాలయ ఆవరణలో మరమ్మతులు
Sorry, no posts matched your criteria.