India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీలు బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, జోగులాంబ గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మహబూబ్ నగర్ ఎస్పీగా విధులు నిర్వహించిన హర్షవర్ధన్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా, గద్వాల ఎస్పీగా పని చేసిన రితిరాజ్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా నియమించింది.
షాద్నగర్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.
అచ్చంపేట మండలం లింగోటం పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి పక్కన అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. మృతుడు ఉప్పునుంతల మండలం కట్లబండ తండాకు చెందిన గణేష్(30)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు జూన్ నెల ఖర్చుల మాసంగా మారింది. రైతులు వ్యవసాయానికి సిద్ధమవడం వల్ల విత్తనాలు, ఎరువులు కొనాల్సి ఉంటుంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో పిల్లలకు బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, తదితరాల కొనుగోలు తప్పనిసరి అవుతుంది. ప్రైవేటుగా చదివిస్తే ఫీజు తడిసి మోపెడవుతుంది. వీటికి తోడు పెరిగిన ధరలు కూరగాయలతో బెంబేలెత్తిస్తున్నాయి.
జిల్లాకు వచ్చే సివిల్ సర్వీసెస్ అధికారులు కల్యాణ గడియల్లో వస్తున్నారనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. 2023 జనవరి 26న ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రక్షిత కె.మూర్తి నెలరోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 1న జిల్లాకు కలెక్టర్ హోదాలో వచ్చిన తేజస్ నందలాల్ పవార్ నెలరోజుల్లోనే వివాహం చేసుకోగా.. తాజాగా వచ్చిన కలెక్టర్ ఆదర్శ్ సురభి మ్యారేజ్ సైతం జలై 7న జరగనుంది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 8,849 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 1,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.531 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యుల్ కులాల బాల, బాలికలకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. ఇందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు రూ.200లు చెల్లించి ఆన్ లైన్ లో www.tgswreis. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పాలమూరు ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
♥సర్వం సిద్ధం.. నేడే బక్రీద్ పండుగ
♥రాజోలి:నేటి నుంచి వైకుంఠ నారాయణస్వామి ఉత్సవాలు
♥పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎంపీలు,ఎమ్మెల్యేలు
♥గండీడ్:నూతన బస్సు సౌకర్యం.. ప్రారంభించనున్న నేతలు
♥త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక ఫోకస్
♥అక్రమ ఇసుక తరలింపు పై అధికారుల నిఘా
♥ఉమ్మడి జిల్లాలో.. NMMSకు 257 మంది ఎంపిక
♥ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో నూతన అడ్మిషన్లపై అధికారుల నజర్
రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీ గంతలో పడి చనిపోయాడు. MBNR జిల్లా రాజాపూర్కు చెందిన శివ, లావణ్య దంపతుల కొడుకు జశ్వంత్(2) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి సమీప PHC వెనుక ఉన్న డ్రైనేజీ గుంతలో పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు జడ్చర్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాబు అప్పటికే చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. బాలుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు మండిపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.