India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగర్కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో వరి విత్తనాలు ఉన్నాయని విత్తన సరఫరా విభాగం అధికారులు రామకృష్ణ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. RNR 15048 రకం అందుబాటులో ఉన్నాయని, 20 కేజీల ప్యాకెట్ ధర రూ.1060 అందజేస్తున్నట్లు తెలిపారు. కావలసిన రైతులు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు.

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. జూబ్లీహిల్స్లో భరణి లేఅవుట్లో ఆయన ఇంట్లో రూ.7.5 లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులకు జైపాల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, SSC 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. నేడు(సోమవారం) ఫైన్తో స్పెషల్ అడ్మిషన్లు పొందవచ్చని ఆయా పాఠశాలల అధికారులు తెలిపారు.

తొలిరోజు జరిగిన గ్రూప్ -2 పరీక్ష సెకండ్ పేపర్లో పాలమూరు బిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యపై ప్రశ్న వచ్చింది. ‘పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య దీనిని పునరుజ్జీవింప జేయడానికి చేసిన కృషికి ప్రసిద్ధి’ అని ప్రశ్న అడిగారు. మొగులయ్యపై ప్రశ్న రావడంతో జిల్లా వాసులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొగులయ్య స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట.

భారతదేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వల్లభాయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. దేశానికి ఏకత్వం, సామాజిక సంస్కరణలు అందించిన విజన్ ఉన్న నాయకుడు వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీంతో ఉమ్మడి జిల్లాలోని నిరుపేదల సొంతింటి కల తీరనుంది. మొదటి విడతలో దాదాపు 49వేల మందికి లబ్ధి చేకూరనుంది. స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 36.14 లక్షల జనాభా ఉండగా.. 2,43,796 కుటుంబాలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నాయి. ఇందులో అత్యధికంగా NGKL జిల్లాలో 70,025 కుటుంబాలు ఉన్నాయి. అధికారుల ఇంటింటి సర్వేతో జిల్లాలోని లబ్ధదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేతో పాటు డాటా ఎంట్రీ కూడా పూర్తయింది. దీంతో రిజర్వేషన్లు మార్పులు జరిగే అవకాశం ఉంది. జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. MBNR-441, NGKL-464, GDWL-255, WNPT-260, NRPT-280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ఆయా రాజకీయ నేతలు, కార్యకర్తలు కార్యకలాపాలు చేపట్టి, అందరిని పలకరిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో G-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. MBNRలో 54 కేంద్రాల్లో 20,584 మంది, NGKLలో 32 కేంద్రాల్లో 9,731, గద్వాలలో 25 కేంద్రాల్లో 8,722, WNPలో 31 కేంద్రాల్లో 8,569, NRPTలో 13 కేంద్రాల్లో 3,994 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు.
-ALL THE BEST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేతో పాటు డాటా ఎంట్రీ కూడా పూర్తయింది. దీంతో రిజర్వేషన్లు మార్పులు జరిగే అవకాశం ఉంది. జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. MBNR-441, NGKL-464, GDWL-255, WNPT-260, NRPT-280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ఆయా రాజకీయ నేతలు, కార్యకర్తలు కార్యకలాపాలు చేపట్టి, అందరిని పలకరిస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు యాసంగిలో సాగునీరు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు 5 విడుదల వారీగా నీరు అందిస్తామని, మొదటి విడత ఈనెల 25న నీరు విడుదల చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.