Mahbubnagar

News December 14, 2024

నారాయణపేట: పారా మిలటరీ ఉద్యోగాలు సాధించారు

image

జీడీ ఫలితాల్లో నారాయణపేట జిల్లాకు చెందిన అవినాశ్(సీఆర్పీఎఫ్), రవి (బీఎస్ఎఫ్)లో ఉద్యోగం సాధించారు.వారు మాట్లాడుతూ.. దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామన్నారు. వారిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

News December 14, 2024

NRPT: కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి రద్దు

image

నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ – 2 పరీక్షల నేపథ్యంలో అధికారులు పరీక్ష విధులకు హాజరు కానుండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఇట్టి విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.

News December 14, 2024

ఉమ్మడి పాలమూరులో నేటి ముఖ్య వార్తలు!

image

❤లగచర్లకు వెళ్తా..ఎవరోస్తారో చూస్తా:డీకే అరుణ
❤ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్లు
❤గద్వాల:హైవే- 44పై గడ్డి ట్రాక్టర్ దగ్దం
❤మర్రి జనార్దన్ రెడ్డికు ఈడీ నోటీసులు
❤కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:SFI
❤గ్రూప్-2..144 సెక్షన్ అమలు:SPలు
❤మధ్యాహ్న భోజనం..అధికారుల ఫోకస్
❤గండీడ్:ప్రేమను ఒప్పుకోలేదని యువకుడి సూసైడ్
❤కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు

News December 13, 2024

లగచర్లకు వెళ్తా.. ఎవరడ్డొస్తారో చూస్తా: డీకే అరుణ

image

గుండెనొప్పి సమస్య ఉందని చెప్పిన రైతు హిర్యానాయక్‌కు సంకెళ్లువేసి తీసుకెళ్తారా అని MP DK అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్‌కు పోలీసులు బేడీలువేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లకు వెళ్తానని ఎవరడ్డొస్తారో చూస్తానని పేర్కొన్నారు.

News December 13, 2024

లగచర్ల రైతుకు బేడీలు.. MBNR ఎంపీ ఫైర్

image

లగచర్ల కేసులో రైతుకు బేడీల వ్యవహారంపై MBNR ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఆమె నేడు ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏం తప్పు చేశాడని రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేశారు..? అమాయకులపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, సంకెళ్లు వేయడం ఇదేనా మీ ప్రజాపాలన అంటే అని ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడుకోవడం చేతగాక అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు.

News December 13, 2024

వనపర్తి: కొడుకు మందలించాడని తల్లి సూసైడ్‌‌

image

కొడుకు మందలించాడన్న మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న వనపర్తి జిల్లాలో జరిగింది. SI సురేశ్‌‌ గౌడ్‌‌ తెలిపిన వివరాలు.. ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన కాశమ్మ(68) తరచుగా కల్లు తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈదే విషయంలో గురువారం మరోసారి గొడవ పడగా కాశమ్మ ఇంట్లోంచి వెళ్లిపోగా గ్రామ శివారులోని చెరువులో డెడ్‌‌బాడీ దొరికింది.ఆమె కొడుకు శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 13, 2024

పాలమూరుకు మంత్రి పదవి దక్కేనా..?

image

త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రస్తుతం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో పాలమూరు నుంచి పలువురి మంత్రి పదవి అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి బెర్తు దక్కుతుందా..? కామెంట్ చేయండి

News December 13, 2024

గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సంతోష్

image

15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు, రోజుకు 2 దఫాలుగా పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 25 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News December 13, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి..TOP NEWS!

image

❤MBNR: రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ రెడ్డి
❤అయిజ: Way2News ఎఫెక్ట్.. నిత్యవసర సరుకులు అందజేత
❤లగచర్ల రైతు చేతికి బేడీలు.. KTR అభ్యంతరం
❤14న లోక్ అదాలత్
❤NGKL:రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤లగచర్ల కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ
❤గ్రూప్-2 పరీక్ష.. నిర్వహణపై ప్రత్యేకంగా నిఘా
❤GDWL:రేపు జాబ్ మేళా
❤కొనసాగుతున్న సీఎం కప్పు క్రీడలు
❤ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ

News December 12, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

image

జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలోని ఆశ్రమం వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. మిడ్జిల్ మండలం రెడ్డి గూడ గ్రామానికి చెందిన జైపాల్ 50, అతని భార్య సౌరీలమ్మ మోటార్ సైకిల్ పై వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.