India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ధన్వాడలో 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా పానగల్లు 33.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నాపురవ్పల్లిలో 32.5 డిగ్రీలు, గద్వాల జిల్లా కల్లూరుతిమ్మన్నదొడ్డిలో 32.5 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా మాష్పల్లిలో 11.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈనెల 23న పాలమూరు యూనివర్సిటీలో పురుషుల బాస్కెట్బాల్, 25న స్త్రీ, పురుషు క్రికెట్ క్రీడారులను ఎంపిక చేయనున్నట్లు పీయూ PD శ్రీనివాసులు సోమవారం తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొన వచ్చన్నారు. 17-25 ఏళ్ల వయసు ఉండి, చదువుతున్న కళాశాల బోనోఫైడ్ తీసుకురావాలన్నారు. బ్యాట్మింటన్, టైక్వాండో 18,19 టైక్వాండో స్త్రీ, పురుషులు స్త్రీ, పురుషులు కబడ్డీ-21న ఎంపిక చేస్తామన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పంచాయతీ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ డీజిల్ మెయింటెనెన్స్, గ్రామాల్లోని తాగునీటి మోటార్ల మరమ్మతులు, వీధిలైట్ల నిర్వహణకు అప్పులు తీసుకురావాల్సిన దుస్థితి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జోగులాంబ దేవస్థానంలో రాత్రి వీఐపీ బందోబస్తు కొరకు వచ్చిన పోలీస్ సిబ్బంది, ASI భాషాపై కుక్కలు దాడి చేయడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అలంపూర్లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, కుక్కలను నివారించాలని భక్తులు కోరుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్లే పాదయాత్ర భక్తులు వెంట తెచ్చుకున్న కుక్కలను తుంగభద్రనది, నల్లమల అడవి ఉన్నందున ఇక్కడే వదిలేస్తున్నారు. దీంతో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు అంటున్నారు.
ఉమ్మడి MBNR జిల్లాలో సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA)-1 పరీక్షలు ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు (DCEB) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 4,180 పాఠశాలల్లోని 1-10 తరగతులకు చెందని సుమారు 5,42,530 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తుంటారు. పాలమూరు జిల్లాలో 39 మంది పోలీసులు అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి సోమశిలదే(1993). NGKL-32, NRPT-1, MBNR-2, WNPT-4 మంది పోలీసులు చనిపోయారు. వీరిని గుర్తు చేసుకుంటూ నేటి నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా త్యాగాలను స్మరించుకుంటున్నారు.
SBI బ్యాంక్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చల్లా శ్రీనివాసులు శెట్టి దంపతులు మొదటిసారిగా వనపర్తికి వచ్చారు. వారిని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ సంతోష్, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఇవాళ తాము ఏం పని చేయాల్సి వచ్చేదికాదని ఆయన తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం కూడా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు రుణాలు 40% కూడా మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.