Mahbubnagar

News October 20, 2024

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి: ఎంపీ మల్లురవి

image

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చూడాలని ఎంపీ మల్లు రవి అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో గద్వాల, NGKL జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 22న పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్లో సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. సబ్సిడీ రుణాలు, ప్రభుత్వ పథకాలు, స్మాల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు, బ్యాంకర్లు హాజరవుతారని తెలిపారు.

News October 20, 2024

NGKL: ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలం పరిశీలన

image

నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి సంబంధించిన స్థలాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, తదితరులు ఆదివారం పరిశీలించారు. పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి అన్ని రంగులతో భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నట్లు మల్లు రవి తెలిపారు.

News October 20, 2024

MBNR: గ్రూప్-1 పరీక్షలపై కేటీఆర్ కుట్ర: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

image

గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ గ్రూప్-1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతం చేస్తుందోనని వారు భయపడుతున్నారన్నారు. 56 రోజులలో డీఎస్సీ వేసి, 11 వేల పోస్టింగులు ఇచ్చిన చరిత్ర మాదేనన్నారు.

News October 20, 2024

MBNR: సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ మైదానంలో ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి సీఎం కప్పు ర్యాలీని టార్చ్ వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News October 20, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

image

ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)లలో శనివారం నిర్వహించారు. దాదాపు 400 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈనెల 28, 29, 30న రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్స్ టోర్నీ MBNRలో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విలియమ్స్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News October 20, 2024

నాగర్ కర్నూల్: భర్త ప్రైవేటు పార్ట్స్ కత్తిరించిన భార్య

image

NGKL జిల్లాలో ఘోరం జరిగింది. భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కత్తిరించిన ఘటన 6 రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు ప్రకారం.. లింగాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్త (34) నిద్రిస్తుండగా ప్రైవేటు పార్ట్స్‌ను కత్తిరించగా.. ఇంటి చుట్టుపక్కల వారు బాధితుడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 20, 2024

MBNR: దసరా EFFECT.. డిపోల వారీగా ఆదాయం.!

image

దసరా పండుగ సందర్భంగా ఈ నెల ఒకటి నుంచి 16 వరకు ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక బస్సులు నడిపారు. ఉమ్మడి జిల్లాలోని 1.GDWL-415.04, 2.MBNR-519.55, 3.అచ్చంపేట-315.88, 4.కల్వకుర్తి-388.36, 5.కోస్గి-42.44, 6.కొల్లాపూర్-265.27, 7.NGKL-353.98, 8.షాద్‌నగర్-316.55, 9.NRPT-347.10, 10.WNP-485.28 (రూ.లక్షల్లో) డిపోల్లో ఆదాయం వచ్చింది. 16 రోజుల్లో 52.72 లక్షల కిలో మీటర్లలో రూ.39.22 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 19, 2024

రేపు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడంపై నిరసనగా బీఆర్‌‌ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని శ్రేణులకు కేటీఆర్ సూచనలు చేశారు.

News October 19, 2024

NRPT : విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలి : టీపీటీఎఫ్ 

image

ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారిలు సూచించారు. నారాయణపేటలోని అంబేడ్కర్ భవన్‌లో విద్యారంగ సమస్యలు, సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

News October 19, 2024

MBNR: మరణ శాసనాలుగా మారుతున్న డీజేలు

image

డీజేలు మరణ శాసనాలుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గంటల పాటు డీజేల వద్ద డ్యాన్స్‌లు చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు అనేకం. దసరా ఉత్సవాల్లో వనపర్తి జిల్లా అమరచింత మండలం మిట్టనందిమల్లలో 28 ఏళ్ల ఓ యువకుడు డీజే వద్ద డ్యాన్సు చేశాడు. ఇంటికి వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. అధిక శబ్దాలు ఇచ్చే డీజేలతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నందున వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.