Mahbubnagar

News December 12, 2024

రాజీమార్గమే రాజ మార్గం: MBNR ఎస్పీ

image

రాజీమార్గమే రాజ మార్గం అని MBNR ఎస్పీ జానకి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు.. కానీ రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏం సాధించలేమన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

News December 12, 2024

మహబూబ్‌నగర్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. జడ్చర్ల మండలం లింగంపేట మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్(45) మృతిచెందగా.. ఆగి ఉన్న లారీ ఢీకొని రాంప్రకాశ్, లవకుశ్ మృతి చెందారు. కర్నూల్ జిల్లాకి చెందిన గొడ్డయ్యగౌడ్ పాల పాకెట్ల కోసం వెళ్లి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనండంతో చనిపోయాడు. నవాబుపేట మండలం పోమాల్‌కి చెందిన రాజు నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు

News December 12, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి వద్ద జరిగిన రోడ్డు <<14853514>>ప్రమాదంలో <<>>ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. UP బల్‌రాంపూర్‌ జిల్లాకి చెందిన రాంప్రకాశ్(35), లవకుశ్(33) కల్వకుర్తి నుంచి మిడ్జిల్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. కేసు నమోదైంది.

News December 12, 2024

MBNR: ‘ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు’

image

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు అందజేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రియబ్రతమిశ్రా చెప్పారు. MBNR SBI రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ..రైతుల కోసం రైతులే నిర్వహించుకునే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తమ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News December 12, 2024

మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త

image

అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు✔ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి✔నీటిపారుదల సమీక్ష..పాల్గొన్న ఎమ్మెల్యేలు✔పెబ్బేరు:కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు✔GDWL:TS- MESA జిల్లా సర్వసభ సమావేశం✔రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రుణాలు:DGM✔బాలానగర్:రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి✔గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్లు✔మోహన్ బాబు SORRY చెప్పాలి:ప్రెస్ క్లబ్✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News December 11, 2024

మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త

image

అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

News December 11, 2024

తెలంగాణ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి ఎన్నిక

image

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 53 ఓట్ల మెజార్టీతో  రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం కల్పించిన ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రం నలుమూలల క్రీడల పట్ల విద్యార్థులు, యువత ఆసక్తి పెంచుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

News December 11, 2024

MBNR: నీటిపారుదల సమీక్షలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

హైదరాబాద్ జలసౌధలో బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని తమ తమ నియోజకవర్గాలకు పెండింగ్ పనులను, కొత్తగా చేపట్టబోయే పనులను గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తామని తెలిపారన్నారు.

News December 11, 2024

PU డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్.. ఈనెల 21 నుంచి పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.