India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉట్కూర్ మండలం చిన్నపోర్లలో భూ తగాదాల కారణంగా దాయాదుల మధ్య జరిగిన దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉట్కూర్ ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణం జరిగిందని బాధితులు ఆరోపించారు. దీంతో శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర హక్కులపై చంద్రబాబు విషం నూరిపోస్తూ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. MLC, MP ఎన్నికల ఫలితాలపై వనపర్తి పార్టీ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అదృశ్య శక్తుల ప్రభావంతో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా తెలంగాణ వ్యతిరేక శక్తి ఆదిత్యదాస్ను సీఎం నియమించారని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్లో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 32.7, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 32.4, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 31.8, గద్వాల జిల్లా అల్వాలపాడు 29.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లాల్లోని 229 ఉన్నత పాఠశాలల్లో జీహెచ్ఎంలు ఖాళీలు భర్తీ అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 16, నాగర్ కర్నూల్ -81, వనపర్తి-53, జోగులాంబ గద్వాల -30, నారాయణపేట-49 జీహెచ్ఎంలుగా ఖాళీలను భర్తీ చేశారు. ఎస్ఏల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన ఖాళీలను అధికారులు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎస్టీల్లో పదోన్నతి కోసం అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ తాత్కాలిక జాబితా ప్రకటించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు క్రింది విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా సెరివెంకటాపూర్ 15.0 మి.మీ, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 16.5 మి.మీ, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మహబూబ్ నగర్ జిల్లా బీసీ మేధావుల సంఘం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ మేధావుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టాలని అలాగే ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న బీసీలను ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
లింగాల మండలంలోని రాంపూర్ పెంటకు చెందిన రాముడు (14) సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారితే పాఠశాలకు వెళ్లే ఆ విద్యార్థి రాముడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. రాముడు బలవన్మరణంపై పలు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగస్టు 15లోగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల బాకీలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి. గత ప్రభుత్వం రూ.లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేసింది. ముందుగా రూ.50వేల లోపు వారికి, రూ.99 వేల వరకు మాఫీ చేసింది. తాజాగా సీఎం ఆదేశాలతో అధికారులు గైడ్ లైన్పై దృష్టి పెట్టారు.
ప్రభుత్వం బడుల్లో అన్ని వసతులు కల్పించడమే కాక అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందుతుందని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ అన్నారు. గురువారం ఉప్పునుంతలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఆమ్మ ఆదర్శ బడుల్లో పనులపై వెంటనే నివేదికలు సమర్పించాలన్నారు.
హైదరాబాద్లోని గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో రాష్ట్రలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖచే UPSC నిర్వహించే సివిల్స్ సర్వీసెస్ పరీక్ష-2025 శిక్షణకు ఆసక్తి గల వారు https://studaycircle.cgg.gov.in లో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.