India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లకు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్నగర్లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ పక్కన రూం సమీపంలో ఓ వ్యక్తి చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. అతడి రెండు చేతులు కొట్టేసి ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే 8712659312, 8712659334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని 2-టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇది హత్యనా.. ప్రమాదమా తెలియాల్సి ఉంది.

గద్వాల పట్టణంలోని భీమ్నగర్ కాలనీకి చెందిన <<14843542>>అనుమానాస్పదంగా <<>>పవిత్ర నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. బంధువుల, పోలీసుల వివరాల ప్రకారం.. మల్దకల్ మండలం మద్దెలబండకి చెందిన కుమ్మరి వినయ్- పవిత్ర రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వరకట్నం కోసం భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కుమార్తె సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు.

✔గద్వాల: యువతి అనుమానాస్పద మృతి
✔ఫీజు రియంబర్మెట్స్ విడుదల చేయాలి:BC సంఘం
✔MBNR: హౌస్ వైరింగ్..ఉచిత శిక్షణ,భోజనం
✔ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిల జననాలు
✔గండీడ్,గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం
✔15,16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్లు
✔కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం:BRS
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి

పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లాలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా యువకులకు ఎలక్ట్రిషన్(హౌస్ వైరింగ్)లో ఉచిత శిక్షణ,భోజనం,వసతి కల్పిస్తున్నట్లు ఎస్బwఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(SBRSETI) డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని,19-45 సం|| వయస్సు ఉన్నవారు అర్హులని, మిగతా వివరాలకు 95424 30607, 99633 69361కు సంప్రదించాలని, ఆసక్తి గల యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ.. స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO అధికారులు తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి.అత్యధికంగా గద్వాల జిల్లా సాటేర్లలో 33.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా మాగనూరులో 32.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా రేవల్లిలో 30.2 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 29.3 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో 28.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాల్కు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై ఆదివారం రాత్రి గుండుమాల్-పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు. దానిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా 15 మంది పట్టుబడగా.. 22 మందిని కోర్టులో హాజరు పరిచారు. రాష్ట్రంలోనే అత్యధిక అవినీతి కేసులు ఉమ్మడి పాలమూరులోనే నమోదయ్యాయి. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే, లంచాన్ని ఉపేక్షించకండి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుదాం. లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం
Sorry, no posts matched your criteria.